రోడ్డు ప్రమాదంలో 35 మంది సజీవదహనం..

 

చైనాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 35 మంది సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం.. 56 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్టు బస్సు.. గువాడ్రయిల్స్ జాతీయ రహదారిపై వెళుతుండగా రోడ్డు సైడ్‌వాల్‌ను ఢీకొట్టింది. దీంతో ఆయిల్ లీక్ కావడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈప్రమాదంలో చిన్నారులు సహా మొత్తం 35 మంది సజీవదహనమయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.