6 గంటల తరువాత చెవిరెడ్డి విడుదల...

 

రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమామహేశ్వర రావులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీ గేటు బయట దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఇందుకగాను ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే దాదాపు  6 గంటల తరువాత ఆయనను విడుదల చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్సలు గుప్పించారు. చంద్రబాబు పాలన తాలిబన్ల పాలన కంటే దారుణంగా ఉందని...తనను అరెస్ట్ చేసినా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమాలను అరెస్ట్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.