లారీ, కారు ఢీ... ఐదుగురి మృతి... ఒకే కుటుంబం

 

చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. కడప నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారును రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద ఒక లారీ ఢీకొనడంతో కారులో వున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కారు నంబర్ ఎపి 22 ఎఎం 0250. ఈ ఘోర ప్రమాదంలో మరణించినవారు మహబూబ్ నగర్‌ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని సుజుకీ మోటార్స్‌ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబమని తెలుస్తోంది. వీరు హైదరాబాద్ నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.