బొత్స పై గంటా ఫైర్‌

 

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ పార్టీలో మాటల యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు అధిష్టానానికి అనుకూలంగా మాట్లాడి రాష్ట్ర నేతల ఆగ్రహానికి గురైన బొత్సా సత్యనారాయణ మరోసారి అదే పని చేసి గంటా కోపానికి గురయ్యారు. అధిష్టాన్ని దిక్కరిస్తే చర్యలు తప్పవంటూ బొత్స చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి సహా బొత్స సత్యనారాయణ సహా మంత్రలందరకూ అధిష్టానానికి రాసిన లేఖపై సంతకాలు పెట్టామన్నారు.  ఆ ప్రకారం సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని బొత్స కూడా వ్యతిరేకించినట్లే అన్నారు.