వైయస్ కుటుంబానికి విశ్వసనీయతే లేదు

 

 

 

 

జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలా,ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ లపై బిజెపి మరోసారి ధ్వజమెత్తింది. ఎప్పుడు విశ్వసనీయత గురు౦చి మాట్లాడే వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అసలు విశ్వసనీయతే లేదని మండిపడింది. బిజెపి నేతలు దాసరి మల్లేశం, రాములతో కలిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.

 


వైయస్ కుటుంబానికి దమ్ము, ధైర్యం ఉంటే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి డైరెక్టర్లుగా కొనసాగుతున్నట్లు ప్రకటించాలని. లేదంటే కంపెనీలు మీవి కావని చెప్పండి. అలా చెబితే ఆధారాలతో సహా నిరూపించడానికి మా సిద్ధంగా ఉంది అని అన్నారు. విజయలక్ష్మి బైబిల్‌ను చేతిలో పట్టుకుని విశ్వసనీయత గురించి మాట్లాడతారు. విశ్వసనీయత గురించి మాట్లాడే మీరు కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించి ఎందుకు విశ్వసనీయతను చాటుకోవట్లేదు? అంటే నేను చేసిన ఆరోపణలు వాస్తవాలేనని అంగీకరిస్తున్నారా?" అని ఆయన అన్నారు.

 


విశ్వసనీయత లేని షర్మిల ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర పేరిట ప్రజల వద్దకు వెళుతోందని ప్రశ్నించారు.