కేసీఆర్ కు నితీష్ ఫోన్..!!

 

బీహార్ సీఎం నితీష్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసారు.. యోగక్షేమాలు కనుక్కోవడానికి కాదులేండి.. రాజకీయ కారణంతోనే చేసారు.. ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.. అయితే రాజ్యసభలో ఏ పార్టీకీ, ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లేదు.. అందుకే బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తుంది.. బీజేపీ అభ్యర్థిని నిలబెడితే విపక్షాలన్నీ ఏకమయ్యే ప్రమాదం ఉందని భావించిన గ్రహించిన బీజేపీ, ఈ అవకాశాన్ని మిత్రపక్షమైన జేడీయూకి ఇవ్వాలని నిర్ణయించింది.. దీనివల్ల తటస్థంగా ఉన్న పార్టీలు కూడా మద్దతిస్తాయని బీజేపీ ఆలోచన.. దానిలో భాగంగానే నితీష్, కేసీఆర్ కు ఫోన్ చేసారు.. తమ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతివ్వాలని కోరారు.. అయితే కేసీఆర్ మాత్రం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది.