బంగ్లాదేశ్‌లో నౌక ప్రమాదం... 200 మంది మ‌ృతి?

 

బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో 250 మంది ప్రయాణికులతో వెళ్తున్న పినాక్-6 పేరుగల నౌక మునిగిపోవడంతో 200 మరణించారని తెలుస్తోంది. ఇప్పటి వరకు 115 మృతదేహాలు లభ్యమయ్యాయి. 40 మంది మినహా మిగతా అందరూ గల్లంతయ్యారు. చాలామంది ప్రయాణికుల జాడ ఇప్పటికీ తెలియక పోవడం, నదిలో మునిగిపోయిన పినాక్-6 పడవలోనే వారంతా చిక్కుపడి ఉండడమో, లేదా భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపంలో ప్రవహిస్తున్న పద్మా నది ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండడమో జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కెపాసిటీకి రెట్టింపు సంఖ్యలో సుమారు 250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవ సోమవారం అలల తాకిడికి తలకిందులై మునిగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోపలే వందమందికి పైగా ప్రయాణికులను నౌకలు, స్పీడ్‌బోట్ల సాయంతో కాపాడారు.