నేడు శ్రీకాకుళంలో బాలయ్య ఎన్నికల ప్రచారం

 

మొట్టమొదటిసారి హిందూపురం నుండి ఎన్నికలలో పోటీ చేయబోతున్ననందమూరి బాలకృష్ణ, తన నియోజక వర్గంలో ఇప్పటికే ఒకసారి ప్రచారం నిర్వహించారు. పార్టీలో మంచి ప్రజాకర్షణ గల ఆయన కేవలం హిందూపురంకే పరిమితం అవలేరు కనుక సీమాంధ్రలో అన్ని జిల్లాలలో కూడా ప్రచారం చేయనున్నారు. మొదటగా ఆయన ఈరోజు శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు హైదరాబాదు నుండి విమానంలో విశాఖ కు చేరుకొని అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సారవకోట చేరుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెడతారు. ఈరోజు ఆయన పోలాకి, ఉర్లాం, ఆముదాలవలస, భ్రుజ కొల్లివలస, సింగుపురం, శ్రీకూర్మం, శ్రీకాకుళం పట్టణంలో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈ నందమూరి లెజెండ్ ప్రచారానికి ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసినా చేయకపోయినా, ఆయనకున్న ప్రజాకర్షణ కారణంగా ప్రజలు ఆయనను చూసేందుకు, ఆయన చెప్పే డైలాగ్స్ వినేందుకు భారీ ఎత్తున తరలిరావడం తధ్యమని చెప్పవచ్చును.