దర్శకుడు రవిచోప్రా మృతి

 

అమితాబ్ బచ్చన్ నటించిన ‘బాగ్‌బన్’ చిత్ర దర్శకుడు రవిచోప్రా (68) బుధవారం మధ్యాహ్నం ముంబైలో కన్నుమూశారు. రవిచోప్రా గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. బాలీవుడ్ ప్రముఖుడైన బి.ఆర్.చోప్రా కుమారుడే రవిచోప్రా. రవిచోప్రా ‘ద బర్నింగ్ ట్రైన్’, ‘ఆజ్ కీ ఆవాజ్’, ‘బాబుల్’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. రవిచోప్రాకు భార్య, ముగ్గురు పిల్లలు వున్నారు. రవిచోప్రా మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.