బీజేపీలో చేరింది.. మోదీ కే మీ ఓటు అని ప్రచారం చెయ్యనున్న సైనా నెహ్వాల్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బీజేపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ పార్టీ జనరల్ సెక్రెటరీ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. సైనా నెహ్వాల్ తో ఢిల్లీలో ఎన్నికల ప్రచార నిర్వహించబోతున్నట్లు సమాచారం. బిజెపి జాతీయ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మోదీ దేశం కోసం పాటుపడుడుతున్న వైనం చూసి ఆయనతో పని చేయాలనే బీజేపీలో చేరినట్లు సైనా నెహ్వాల్ మీడియాతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు నడ్డాతో భేటీ అయ్యారు సైనా. రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైనాతో ప్రచారం చేయించాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీ దేశ అభివృద్ధి కోసం, క్రీడ అభివృద్ధి కోసం పాటుపడడం చూసి కొందరు ఆకర్షితులు అవుతున్నారు. బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. దీని కోసం ముఖ్యమైన నేతలు, సెలబ్రిటీలతో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించే వ్యూహం చేసినట్లు సమాచారం. కేంద్ర మంతి అమిత్ షా తో పాటు వివిధ ముఖ్య నేతల సైతం ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. కేజ్రివాల్ కు దీటుగా ఎన్నికల ప్రచారం చేసి ఢిల్లీని సైతం తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు సమాచారం.