కోడలు ఆత్మహత్య.. అత్తా మామలకు ఊరట..
posted on Jul 23, 2018 4:38PM
ఈనెల 13న అనిసియా బాత్రా న్యూఢిల్లీలోని తమ నివాసం పంచశీల్ పార్క్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ల అనిసియా బాత్రా, ఆమె భర్త మయాంక్ సింఘ్వీ మధ్య అంతకు ముందు రోజు రాత్రి తీవ్ర వాగ్వాదం జరిగింది.
మరుసటి రోజు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు భర్తకు సందేశం పంపి తమ ఇంటి టెర్రస్ పై నుంచి దూకేసింది. బాత్రా మృతిపై ఆమె తల్లి తండ్రులు అనుమానం వ్యక్తం చేయగా భర్త, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె అత్త మామలకు ఢిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది. సింఘ్వీ దంపతులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై వచ్చేనెల 2న విచారణ జరగనున్నందున అప్పటి వరకు వారిని అరెస్టు చేయరాదని ఢిల్లీ పోలీసులకు స్పష్టం చేసింది.