విద్యార్థినిపై వేట కొడవలితో దాడి

 

హైదరాబాద్ శివార్లలోని బండ్లగూడ అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థి మరో విద్యార్థినిపై కొడవలితో దాడి చేసి గాయపరిచాడు. తనను ప్రేమించడం లేదనే సాకుతో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రవళిపై ప్రదీప్ అనే ఉన్మాది కత్తితోదాడి చేశాడు. దాడి చేసిన తర్వాత ప్రదీప్ అక్కడే విషం తాగాడు. కాలేజీలోని విద్యార్థులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో విద్యార్థినిపై పదునైన వేట కొడవలితో దాడి చేసి అక్కడే విషం తాగిన యువకుడు ప్రదీప్ మరణించినట్టు సమాచారం. దాడికి గురైన విద్యార్థిని రవళి చికిత్స పొందుతోంది. రవళి ప్రమాదం నుంచి బయటపడినట్టు సమాచారం.