విశాఖలో విప్రోకి 3 ఎకరాలు

విశాఖజిల్లాలో విప్రో కంపెనీకి 3.1 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పల్లె రఘునాధ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇచ్చిన 7 ఎకరాలతోపాటు, 3.1 ఎకరాలకు ఎన్ వో సీ జారీ చేసినట్లు ఆయన చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 7 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని విప్రో హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. హిందూపూర్ లో సంతూప్ సోప్ పరిశ్రమకు 50 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిందని చెప్పారు. మెడికల్ టెక్నీషియన్స్ తోపాటు, అంగన్ వాడీల శిక్షణకు శిక్షణ సంస్థల ఏర్పాటుకు విప్రో ముందుకొచ్చిందని అన్నారు.