వయసు పై బడిన పోలీసులకు ఏపీ లో ఊరట!

క్షేత్రస్థాయిలో 55 సంవత్సరాలు పైబడిన పోలీస్ సిబ్బంది, ఇంకా హృదయ, శ్వాస, మధుమేహం సమస్యలతో బాధ పడుతున్న పోలీసు ఉద్యోగులను క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంచాలని డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. వారందరికీ పోలీస్ స్టేషన్, ఆఫీస్, కంట్రోల్ రూం లలో మాత్రమే విధులు కేటాయించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. గడిచిన పదిహేను రోజులుగా వివిధ ప్రాంతాల్లో కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ఎదురైన ఆరోగ్య సమస్యలను దృష్టి లో ఉంచుకుని, రాష్ట్ర డి జి పీ గౌతమ్ సవాంగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.