సమానంగా అభివృద్ధి చేస్తా... చంద్రబాబు

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని, అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైతుల రుణమాఫీ కోసం రూ. 7 వేల కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. 42 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం... లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. రెండు నెలల్లో రూ. 10 వేల రూపాయలు చొప్పున డ్వాక్రా సంఘాలకు ఆర్ధిక సాయం అందిస్తామని అన్నారు.