ఇక ఏపీలో నిఖార్సయిన మద్యం!

ఆంధ్రప్రదేశ్ మద్యం ప్రియులకు శుభవార్త. ఇకపై మీరు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ లాంటి దిక్కుమాలిన బ్రాండ్స్ తాగి పేగులు కాల్చుకోనక్కర్లేదు. ఈనెల 14 నుంచి నాణ్యమైన, నిఖార్సయిన మద్యాన్ని ఆస్వాదించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ మీద ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చలు జరిగాయి. ప్రస్తుతం వున్న మద్యం పాలసీని రద్దు చేపి కొత్త పాలసీని తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడున్న డిస్టలరీస్‌కి వున్న లైసెన్సులను రద్దు చేశారు. రాష్ట్రంలో వున్న 3600 మద్యం దుకాణాలకు టెండర్ సిస్టమ్ ద్వారా లైసెన్సులు ఇవ్వనున్నారు. ఇక కల్తీలేని మద్యాన్ని, పాత బ్రాండ్లను వినియోగదారులకు అందించాలని నిర్ణయించారు.  గతంలో బూమ్ బూమ్ లాంటి దిక్కుమాలిన బ్రాండ్లను ప్రజల చేత తాగించిన జగన్ ప్రభుత్వం మీద విచారణ కూడా జరగనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu