అమిత్ షా లేఖపై పవన్... బిజేపి, టీడీపీకి ఆ ఆలోచన లేదు...

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాసిన లేఖ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ లేఖపై స్పందించిన చంద్రబాబు ఇప్పటికే అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ లేఖపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టిడిపి, బిజెపి దాగుడు మూతలు ఎన్నాళ్లని ఆయన ప్రశ్నించారు. హోదా ఇచ్చే స్థితిలో బిజెపి, సాధించే స్థితిలో టిడిపి లేవని అమిత్ షా, చంద్రబాబు లేఖలను బట్టి అర్థమవుతోందని... టిడిపి, బిజెపి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రత్యేకహోదా తప్ప మరోటి వినే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో కమిటీ వేసి నిధుల కేటాయింపు, ఖర్చులపై లెక్కలు తేల్చాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తాజా పరిస్థితిపై వామక్షాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.