అమిత్‌షా కొడుకు అవినీతి సంగతేంటి...


బీజేపీ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఇప్పటికే బీజేపీ పై టీడీపీ నేతలు... టీడీపీ పై బీజేపీ నేతలు దుమ్మెత్తిపోసుకుంటూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు గుప్పించుకోవడమే సరిపోతుంది. దీనిపైన చంద్రబాబు స్పందించి బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంపై, తనపై అవినీతి కేసులు పెట్టాలనే బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తనయుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. తమపై ఇంతకాలం పాటు ఎందుకు అవినీతి గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రం బెదిరింపులకు తలొగ్గేది లేదని చంద్రబాబునాయుడు ఘాటుగానే స్పందించారు.