7వ వేతన సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం...

 

కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫారసులకు ఆమోదం తెలిపింది. ఈరోజు దీనిపై చర్చించిన కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ.. 7వ వేతన సంఘం సిఫారసులకు ఆమోద ముద్ర వేసింది. అయితే నివేదికను యథాతథంగా అమలుచేస్తుందా.. లేక ఏమైనా మార్పులు చేసిందా అనే సంగతి మాత్రం ఇంకా తెలియలేదు. ఒకవేళ యథాతథంగా అమలు చేస్తే ఉద్యోగుల ఫిట్‌మెంట్ 2.57 నుంచి 2.7కు పెరగనుంది. అంటే కొత్తగా చేరినవారి జీతం రూ. 18,000 నుండి రూ.23,000 వరకూ చేరుతుంది.  సుమారు 47 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షర్లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 1 నుంచి కొత్త వేతనాలను అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.