డ్రైవర్ మాట వినుంటే 50 మంది బ్రతికేవారు

 

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 50 కి పైగా చేరింది.. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్‌ కూడా మృతి చెందాడు.. తీవ్ర గాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. అయితే ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది.. బస్సు ప్రమాదంపై డ్రైవర్ శ్రీనివాస్ బంధువులు స్పందించారు.. బస్సు ఫిట్‌నెస్ లేదని శ్రీనివాస్ ముందే చెప్పాడని అన్నారు.. డ్యూటీకి వెళ్లేది లేదని డ్రైవర్ శ్రీనివాస్ మారాం చేశారని ఆవేదనగా చెప్పారు.. అయినా విధులకు హాజరు కావాలని డిపో మేనేజర్ ఆదేశించారని మండిపడ్డారు.. బస్సు ఫిట్‌నెస్ లేదని డ్రైవర్ చెప్పిన మాటను డిపో మేనేజర్ వినుంటే ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకునేవారు కాదుగా.. ఇదేనా ప్రజల ప్రాణానికి మీరిచ్చే విలువ అంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.