వైసిపి నుండి ఆహ్వానం వచ్చింది : వట్టి

 

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తనకు ఆహ్వానం వచ్చిందని రాష్ట్ర మంత్రి వట్టి వసంత కుమార్ వెల్లడించారు. గత రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలియచేసారు.

 

తనతో పాటు, మంత్రి పితాని సత్యనారాయణ కూడా తమ పార్టీలో చేరుతున్నారంటూ ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే, తాను విద్యార్ధి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, తనకు ఇంత గుర్తింపు, మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన పార్టీని వదలి రాలేనని వారితో అన్నానని ఆయన అన్నారు.

 

ఇది సభ్యత ఉన్నవాళ్ళు చేసే పని కూడా కాదని వట్టి వ్యాఖ్యానించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను ఆ పార్టీలో చేరానని వారితో అన్నానని మంత్రి అన్నారు. పదవుల కోసం పాకులాడే వారితో జగన్ పార్టీ నేతలు ఆటలాడుకుంటున్నారని వట్టి అన్నారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయ గందరగోళానికి కూడా కారణమవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజ శేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు.