ఉరీ దాడి మా పనే...
posted on Oct 25, 2016 4:55PM
జమ్ముకశ్మీర్లోని ఉరీ సైనిక స్థావరంపై దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రకటన చేసింది. 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఉరీ ఘటనకు తామే బాధ్యులమని పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా స్పష్టంచేసింది. గత నెలలో ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఉరీ ఘటనలో మరణించిన ఓ ఉగ్రవాది కోసం లష్కరే తోయిబా మాతృ సంస్థ అయిన జమత్-ఉద్-దవా(జేయూడీ) పాకిస్థాన్లోని పంజాబ్లో గుజ్రాన్వాలా ప్రాంతంలో ప్రార్థనలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్లలో భారత ఆర్మీ క్యాంప్పై దాడి చేసి ఎల్ఈటీకి చెందిన మహ్మద్ అనాస్ అలియాస్ అబు-సరఖా అమరుడయ్యాడని ఉర్దూలో పేర్కొన్నారు. ఈ పోస్టర్ల ప్రకారం ఎల్ఈటీ ఉగ్రవాదులు 177 మంది భారత సైనికులను చంపారట. మరి దీనిపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.