తెలంగాణ నోట్ పై షిండే సంతకం పెట్టారు
posted on Oct 3, 2013 5:34PM
తెలంగాణ నోట్ మధ్యాహ్నం కొంత గందరగోళంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి షిండే సాయంత్రానికి నోట్ పై సంతకం చేశారు. హోంశాఖ నోట్ కు సోనియాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కేబినెట్ నోట్ మీద సంతకం చేశారు. అనంతరం తెలంగాణ నోట్ లను కేంద్రమంత్రులకు పంపించారని తెలుస్తోంది. దీంతో ఉదయం నుండి తెలంగాణ నోట్ మీద నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయినట్లే. కాగా సీమాంద్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పల్లంరాజులు క్యాబినెట్ నోట్ పై ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా ఉంది. మరో మంత్రి కిశోర్ చంద్రదేవ్ తన తల్లి మరణం కారణంగా ఆయన డిల్లీలో లేరు. ఈ ఇద్దరు మంత్రులు వ్యతిరేకమైనా, పెద్ద ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఈ నెల ఇరవై లోపు శాసనసభకు ఈ తీర్మానం రావచ్చని అంటున్నారు.