షీలా దీక్షిత్ కు ఏసీబీ సమన్లు..


వాటర్ టాంకర్ల కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ కుభంకోణంపై వివరణ ఇవ్వాలని ఆమెకు ఏసీబీ సమన్లు జారీ చేసింది. వాటర్ మీటర్ కుంభకోణంపై ఆమెను విచారించేందుకు, ఆమె అందించే వివరాలను విచారణాధికారులు రికార్డు చేసేందుకు వీలైన స్థలాన్ని సూచించమంటూ కోరింది. షీలా దీక్షిత్ ఢిల్లీ జల బోర్డ్ (డీజేబీ) ఛైర్ పర్సన్ గా ఉన్నసమయంలో వాటర్ మీటర్ కుంభకోణం ఆరోపణలు చోటు చేసుకోవడంతో ఆమెకు సమన్లు జారీ చేసినట్లు ఏసీబీ స్పెషల్ పోలీస్ కమిషనర్ ఎం కె మీనా తెలిపారు.