కాంగ్రెస్ పార్టీలో ముసలం.. పొంగులేటి రాజీనామా..

 

ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది నేతలు అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మరో సీనియర్ నేత కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసి తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి పంపించారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నానని.. తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధానమిస్తూ అందలం ఎక్కించుకుంటుందని.. పనిచేసే వారికి పదవులు ఇవ్వరా అని లేఖలో పేర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేత షబ్బీర్ అలీలు రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు. సీనియర్లను పక్కన పెట్టమని, అందరికీ అవకాశమిస్తామని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.