తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ఉండదు: మనోహర్..!

 

 

 

తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ ఉందని..బిల్లులోని సవరణలపైనే మాత్రమే ఓటింగ్ ఉంటుందని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈనెల పదవతేది మధ్యాహ్నం ఒంటిగంటలోగా క్లాజులవారీగా సభ్యులు సవరణ ప్రతిపాదనలు ఇవ్వాలని బీఎసీలో సూచించారు. సభ్యలకు ఫార్మాట్లను అందుబాటులో ఉంచుతామని..ఎలాంటి లెటర్ హెడ్స్, అఫిడవిట్లు తీసుకోమన్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్, బీహార్ వెళ్లి పదమూడేళ్ల క్రితం ఏర్పడ్డ కొత్త రాష్ట్రాలపైన అధ్యయనం చేసిన స్పీకర్... అందరూ ఇదే పద్దతిని పాటించారని తెలిపారు.