సీఎం గా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు..

 

రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పుత్రరత్నం తేజ్ ప్రతాప్ యాదవ్ సీఎం అయ్యారు.  బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈయన సీఎం ఎప్పుడయ్యారనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈయన సీఎం అయింది రియల్  లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. అసలు సంగతేంటంటే.. బీహార్ లో లాలూ, ఆయన సతీమణి రబ్రీదేవిలు సీఎంలుగా కొనసాగిన కాలంలో ఆ రాష్ట్రంలో జరిగిన వరుస కిడ్నాప్ లను ఆధారం చేసుకుని భోజ్ పురిలో ‘అపహరన్ ఉద్యోగ్’ పేరిట ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రతాప్ యాదవ్ సీఎంగా నటించనున్నారంట. అయితే తన పాత్ర చాలా చిన్నదైన.. చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. మొత్తానికి తన సీఎం కోరికను ఈ రకంగా తీర్చుకున్నారు తేజ్ ప్రతాప్ యాదవ్.