పురుగుల మందు తాగిన ఎమ్మెల్యే

 

 

 

వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తన సర్పంచ్ లను కౌన్సెలింగ్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఈ ఘటనకు పాల్పడ్డారు. వైకాపా కార్యకర్తల వేధింపులకు నిరసనగా రామచంద్రరెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట భైఠా౦యి౦చారు. కారణం లేకుండానేతన అనుచరులను వేధింపులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించి కిందపడిపోయారు. దీంతో అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైకాపా నేతలు రాయదుర్గం బంద్ కు పిలుపునిచ్చారు.