కష్టాల్లో ఇంగ్లండ్.. 103/5


విశాఖలో భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా 455 ప‌రుగులు చేసి ఆలౌట్ అవ్వగా... అనంతరం బ్యాటింగ్ కు దిగిన బ్యాటింగ్ కష్టాల్లో పడింది. ఆది నుండే వరసు వికెట్లు కోల్పోయి సతమతమవుతుంది. 80 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కుక్ (2), హ‌మీద్ (13), డ‌కెట్ (5), మొయిన్ అలీ (1) విఫ‌ల‌మవ్వగా అనంతరం బరిలోకి దిగిన జో రూట్  హాఫ్ సెంచ‌రీ చేసి కాస్త గట్టెక్కించాడు. దీంతో ఈరోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల‌కు 103 ప‌రుగులు చేసింది.  భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్ 2, ష‌మి, జయంత్ యాదవ్ చెరొక వికెట్ తీసుకున్నారు.