ఎంహెచ్ 17 విమానం: మృతుల్లోడచ్ పౌరులే ఎక్కువ
మలేసియా విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల్లో అత్యధికులు నెదర్లాండ్కి చెందిన వారని తెలుస్తోంది. కూలిపోయిన విమానంలో వున్న మొత్తం 298 మంది మరణించారు. వారిలో 154 మంది నెదర్లాండ్ పౌరులు. చనిపోయిన వారిలో 27 మంది ఆస్ట్రేలియా, 23 మంది మలేషియా,11 మంది ఇండోనేషియా, 6 బ్రిటన్, 4 జర్మనీ, 4 బెల్జియం, 3 ఫిలిప్పీన్స్, ఒకరు కెనడా పౌరుడు. అయితే మిగతా 47 మంది మృతులు ఏ దేశానికి చెందిన వారనే విషయాన్ని ఇంకా గుర్తించాల్సి వుంది. ఈ దుర్ఘటన గురించి నెదర్లాండ్స్.లోని మలేషియా స్పందిస్తూ, విమాన ప్రమాదం వార్త విన్న వెంటనే తీవ్ర ఆందోళనకు గురయ్యానని అన్నారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ చరిత్రలో ఇది అతి పెద్ద విపత్తు అని డచ్ దేశ ప్రధాన మంత్రి మార్క్ రుట్టీ వ్యాఖ్యానించారు.