ఉదయగిరి గడ్డ కాకర్ల సురేష్‌ అడ్డ! ఉద‌య‌గిరి కోట‌పై టీడీపీ జెండా!

రాయలవారి కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఉదయగిరి జ‌గ‌న్ పాల‌న‌లో కళావిహీనంగా మారింది.  పట్టణ ముఖ ద్వారంలోని  ఉదయగిరి ఆనకట్ట చెరువు ఆధునికీకరణ పనులు నిధులులేక ఆగిపోయాయి. గండిపాళెం జలాశయం రూపురేఖలు కోల్పోయింది.  ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, మర్రిపాడు, కొండాపురం మండలాల్లోని ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించటానికి వీలుగా గండిపాళెం జలాశయం వద్ద ఏర్పాటు చేసిన సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు జ‌గ‌న్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోయింది. 2002లో సబ్‌ మిషన్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో 46 ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు నీటిని సరఫరా చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల మంజూరును నిలిపేసింది. దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు  పంపిన ప్రతిపాదనలు  బుట్టదాఖలయ్యాయి.  గ్రామీణ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయటానికి వీలుగా పట్టణంలోని గండిపాళెం మార్గంలో 2018 తెదేపా ప్రభుత్వ హయాంలో రూ. 2 కోట్ల నిధులతో మినీ స్టేడియం మంజూరైంది. అయితే ప్రభుత్వం మారటంతో ఈ మినీ స్టేడియం నిర్మాణ పనులకు నిధులు నిలిపేశారు. తాగునీటి సమస్య తో పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టులు  కూటమి అధికారం లోకి రాగానే పూర్తి చేస్తామ‌ని తెలుగుదేశం పార్టీ హామీనిస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తోంది.  కూట‌మి అభ్య‌ర్థి కాక‌ర్ల సురేష్ గెలుపు కోసం ఆయ‌న తల్లి మస్తానమ్మ, సతీమణి ప్రవీణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల  ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ప్ర‌జ‌లు  వారికి కర్పూర హారతులు ఇచ్చి పూలను వేదజల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు.  టీడీపీతోనే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని,  ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌ను, ఎంపీ అభ్యర్థి వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను అఖండ మెజారిటీ తో గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా వున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల తెలిపారు.  వినూత్నంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను, కాకర్ల సురేష్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు.  వైసీపీ గెలిచే అవకాశాలు లేవు కాబట్టి.. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఓట్లను వేయించుకోవాలనే కుట్రలకు అధికార పార్టీ పాల్పడుతోంద‌ని,  మద్యం, నగదు పంపిణీతో పాటు పోలింగ్‌ రోజు గొడవలతో భయోత్పాత  సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ లక్ష్మీ శ్యామల ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.   వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ త‌న దైన స్టైల్‌లో ప్ర‌చారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూట‌మికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ స‌ర్వేల్లో తేలిపోయింది.  ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.

నెల్లూరు విజయసాయికి అందని ద్రాక్షే.. దేశం కూటమిలో జోష్.. జగన్ శిబిరంలో నైరాశ్యం!

వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు.  ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు. ఎన్నికల కమిషన్ తమ పథకాలను నిలిపివేస్తోందనీ, తమకు మద్దతుగా ఉన్న అధికారులపై బదలీ వేటు వేసి.. అధికారులెవరూ అధికార పార్టీకి సహకరించకుండా చేస్తోందనీ వ్యాఖ్యానించి. అటువంటి అనుచిత సహకారం లేకపోతే గెలుపు సాధ్యం కాదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఇక తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికలలోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోయింది. ఆయన ప్రచారానికి జనం సంగతి పక్కన పెడితే సొంత పార్టీ క్యాడర్ కూడా పెద్దగా రావడం లేదు. సొమ్ములిచ్చి రప్పించుకున్న వారు కూడా ఇలా కనిపించి అలా మాయమై పోతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి తన ఓటమి తానే ఓప్పుకునేలా చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను సైతం నైరాశ్యంలో ముంచేశాయి. ఇంతకీ ఆయన సమాజిక మాధ్యమం వేదికగా ఏమన్నారంటే.. నిజాయితీగా పని చేస్తున్న అనంత రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని, అనంతపురం డీజీపీని ఎన్నికల కమిషన్ బదిలీ చేసేసింది. ఇదేక్కడి న్యాయం. వాస్తవానికి తెలుగుదేశం కదిరి అభ్యర్థి కందికుంట ప్రసాద్ కారులో  రూ. 2 కోట్ల భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నందుకు పోలీసులు వారిని అభినందించాలి అని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఎన్నికల సంఘం అనంత పోలీసు అధికారులను బదిలీ చేయడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని పేర్కొన్నారు.   సాధారణంగా ఇలాంటి బేల మాటలు.. ఓటమి బాటలో ఉన్నప్పుడే నేతల నోట వస్తాయని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో గత ఎన్నికలలో ఎన్నికల సంఘం తీరును అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు విమర్శించిన సందర్భంలో చంద్రబాబు ఓటమి భయంతో  మాట్లాడుతున్నారంటూ ఇదే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   అదలా ఉంచితే విజయసాయి రెడ్డి జగన్ సర్కార్ లో, వైసీపీలో అత్యంత కీలకమైన నాయకుడు. వరుసగా రెండు సార్లు జగన్ ఏరి కోరి ఆయనను రాజ్యసభకు పంపారు. అయితే ఇప్పుడు తన సొంత జిల్లా అంటూ చెప్పుకుని తగదునమ్మా నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి జిల్లాకు చేసింది మాత్రం శూన్యం.  కూటమి తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక పోటీదారుగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి విజయసాయి తాను స్థానికుడిననని ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా సొంత పార్టీలోని కీలక నేతలే ఆయనకు మద్దతుగా నిలవడం లేదు. నుంచి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి స్థానిక అభ్యర్థి అయినప్పటికీ ఆయనకు కీలక నేతలు, ప్రజల నుంచి గట్టి మద్దతు లేదు. ఇటీవలే జగన్ తో విభేదించి వైసీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి మద్దతుగా   చాలా వరకూ వైసీపీ క్యాడర్ ఆయనతో పాటే తెలుగుదేశం వైపు వచ్చేసింది.  

దూసుకెళ్తున్న బాలశౌరి ... ఎన్నికల ప్రచారంలో బందరు పోర్టు  కీలకాంశం 

రాజ‌కీయంగా సీనియ‌ర్ కూడా అయిన మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్లభ‌నేని బాల‌శౌరి త‌న మార్కు రాజ‌కీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం ఉంది. ముఖ్యంగా ప్రజ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ ఆయ‌న నేర్పుగా ముందుకు సాగుతార‌నే పేరు తెచ్చుకున్నారు.గత  ఎన్నిక‌ల్లో మ‌చిలీప‌ట్నం నుంచి  ఎంపీగా పోటీ చేసి గెలిచిన వ‌ల్లభ‌నేని బాల‌శౌరి ఇక్కడి నుంచి  వ‌రుసగా రెండోసారి విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో  టీడీపీ నాయ‌కుడు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ను ఓడించి విజ‌యం ద‌క్కించుకున్న బాలశౌరి త్రి కూటమి అభ్యర్థిగా మచిలీ పట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  ఆ వెంట‌నే ఆయ‌న కార్యరంగంలోకి దిగిపోయారు.బందరు పోర్టు విషయంలో బాలశౌరి  రాజీ లేని పోరాటం కొనసాగిస్తున్నారు. స‌మ‌స్యలున్న చోట తాను ఉన్నానంటూ నిరూపించుకుంటున్నారు. కీల‌క బందరు ప్రాజెక్టు విషయంలో బాలశౌరికి  మంచి పేరు తెస్తోంది. కృష్ణా జిల్లా వాసుల చిరకాల కల అయిన బందరు పోర్టు విషయంలో ఆయన హాయంలోనే  కదలిక వచ్చింది. గత  ఏడాది ఆగస్టులో పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వైకాపా  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పోర్టు నిర్మాణంపై జిల్లావాసుల్లో ఆశలు సన్నగిల్లాయి. పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మంత్రులు ప్రకటిస్తూ వచ్చినా దానిపై స్పష్టత లేకుండాపోయింది.  తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవ తీసుకోవడంతో కెనరా బ్యాంకు పోర్టు నిర్మాణానికి రుణ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కెనరా బ్యాంకు ఎండీ ఆర్‌ఏ శంకర్‌నారాయణను బాల‌శౌరి స్వయంగా తీసుకువ‌చ్చి.. సీఎం జగన్‌ను సచివాలయంలో కలిసేలా ఏర్పాటు చేశారు. వీరి నడుమ సుమారు అరగంటకుపైగా భేటీ జరిగింది. ఈ భేటీలో బాలశౌరి కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. బందరు పోర్టు నిర్మాణానికి సుమారు రూ.4వేల కోట్ల రుణసాయం చేసేందుకు కెనరా బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది.   పోర్టు నిర్మాణం త్వరలో మొదలవుతుందని వ‌ల్లభ‌నేని బాల‌శౌరి స్పష్టం చేస్తున్నారు.  దీంతో బందరు పోర్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురించినట్లయింది. దీని వెనుక బాల‌శౌరి క‌ష్టం ఉండ‌డంతో వైకాపాలో ఉన్న ఆయ‌న అనుచ‌రులు హ‌ర్షం వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, రెండు నెల‌ల కింద‌ట కూడా రాష్ట్ర స‌మ‌స్యల‌ను కేంద్రానికి వివ‌రించ‌డంలోను, లేఖలు రాయ‌డంలోనూ వల్లభనేని బాల‌శౌరి దూకుడు ప్రద‌ర్శించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. పోర్టుకు సుదీర్ఘ చరిత్ర ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా కేంద్రమైన మ‌చిలీప‌ట్నం ఒక‌ప్పుడు బ్రిటిష్ హ‌యంలో పెద్ద తీర ప్రాంత ప‌ట్ట‌ణం. ఇక్కడనుంచి ఎన్నో ఎగుమ‌తులు, దిగుమ‌తులు జరిగేవి. అంతకు ముందే రెండు వేల సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరిగేవి. మచిపలీట్నం లోక్‌సభ నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి పలవురు సీనియర్ రాజకీయ నేతలు ఎంపీగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైన సత్తా చాటాలని ప్రధాన పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో మచిలీపట్నం ఒకటి. అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, పామర్రు (ఎస్ సి), పెడన, పెనుమలూరు, మచీలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్న పలువురు నేతలు ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీల హవా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,518,826మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 737,936కాగా.. మహిళలు 780,825మంది ఉన్నారు. మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం చరిత్రను గమనిస్తే.. 1952లో తొలిసారి ఎన్నికలు జరగ్గా.. సీపీఐ నుంచి పోటీచేసిన సనక బుచ్చికోటయ్య గెలిచారు. 1957లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మండలి వెంకట కృష్ణారావు విజయం సాధించారు. 1962లో మండలి వెంకటస్వామి ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలుపొందడం విశేషం. 1967లో కాంగ్రెస్ నుంచి వై.అంకినీడు ప్రసాద్ విజయాన్ని అందుకున్నారు. 1971లో కాంగ్రెస్ నుంచి మేడూరి నాగేశ్వరరావు గెలిచారు. 1977లో కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి అంకినీడు విజయం సాధించారు.. 1980లో తిరిగి ఆయనే గెలిచారు. 1984, 1989, 1991లో కాంగ్రెస్ నుంచి కావూరి సాంబశివరావు విజయం సాధించారు. 1996లో కైకాల సత్యనారాయణ (నటుగు) తెలుగు దేశం పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన సముద్రతీరం ఉండడంతో దానిని ఆసరాగా చేసుకుని అభివృద్ధి చేయాలని వరుసగా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. కానీ, ఆచరణ మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు. సుదీర్ఘ చరిత్ర కలిగిన మచిలీపట్నంలోని పోర్టు నిర్మాణం రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్న చందంగా కనిపిస్తోంది. పోర్టు నిర్మాణానికి నవయుగ కంపెనీతో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2007లో చేసుకున్న ఒప్పందాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రద్దు చేశారు.  ఏపీలో ఇప్పటికే పోర్టుల ఆధారంగా ఎగుమతులు ఊపందుకున్నాయి. కరోనావైరస్ మహమ్మారి తర్వాత విశాఖ, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల ద్వారా ఎగుమతులు పెరిగాయి. ఉదాహరకు కాకినాడ పోర్ట్ నుంచి 2020-21తో పోలిస్తే 2021-22 లో బియ్యం ఎగుమతులు 25 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2019లో వల్లభనేని బాలశౌరి విజయం 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన వల్లభనేని బాలశౌరి గెలిచారు. ఆయన 60వేలకుపైగా మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుపై విజయం సాధించారు. వల్లభనేని బాలశౌరి వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచినా.. రెండు నెలల క్రితం పార్టీకి దూరమయ్యారు. ఆయన వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు.. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉండటంతో మచిలీపట్నం టికెట్ జనసేన పార్టీకి దక్కింది. . సిట్టింగ్ ఎంపీ బాలశౌరి మరోసారి జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం గెలుస్తారని ప్రచారం జరుగుతోంది.ఇటు వైఎస్సార్‌సీపీ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావును మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా నియమించింది. వైకాపా కార్యకర్తలు ఇటీవల జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడి చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా వ్యవహరిస్తోంది. వైకాపా అరాచకాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైందని జనసేన నేత వాడ వీర ప్రతాప్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఏపీ ఎన్నికల ప్రచారానికి నాని.. వైసీపీకి టిట్ ఫర్ టాట్!

గదిలో బంధించి కొడితే పిల్లి కూడా  పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.  సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు. వీరిలో నేచురల్ స్టార్ నానిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. గతంలో జగన్ సర్కార్ సినిమా టికెట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించిన కారణంతో నానిని జగన్ సర్కార్ నానా విధాలుగా ఇబ్బందులకు గురి చేసింది. ఆయన సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించంది. సినీ పరిశ్రమ మేలు కోసం అంటూ వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు, సర్కార్ నిర్ణయం సినీ పరిశ్రమకు మేలు కాదు కీడు చేస్తుందంటూ చెప్పినందుకు  నానిపై పలువురు వైసీపీ నాయకులు నానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్ని విమర్శించడానికి నాని స్థాయి ఏమిటంటూ నిలదీశారు.  అంతే కాకుండా అప్పట్లో ఆయన సినిమా శ్యాం సింగరాయ్ విడుదల సమయంలో అనేక అడ్డంకులు సృష్టించారు. అప్పటికి మౌనంగా ఉన్న నాని..నానిపై అకారణ ద్వేషాన్ని పెంచుకుని ఆయనను నానా ఇబ్బందులకు గురి చేసిన వైసీపీకి ఇప్పుడు నాని సరైన బదులిచ్చినట్లైంది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట, అదీ వైసీపీ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్న వేళ నాని తన గళం విప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ముందుకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమన్న సంకేతం ఇస్తూ తన ప్రచారానికి తానే బెస్టాఫ్ లక్ చెప్పుకున్నారు. పవన్ కల్యాణ్ ను పొగడ్తలలో ముంచెత్తారు.  దీంతో నాని నాడు వైసీపీ తనను వేధించిన తీరుకు టిట్ ఫర్ టాట్ అన్న చందంగా రిటార్డ్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన సనిమా శ్యాం సింగరాయ్ విడుదల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరుకు ఇప్పుడు సరైన బదులిచ్చినట్లైందని అంటున్నారు.  

భాగ్యనరకం!

చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి  ఏటా వానాకాలంలో భాగ్యనగర  వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది. విశ్వనగరం అంటూ ఘనంగా చెప్పుకునే హైదరాబాద్ నగరం విశ్వనరకంగా మారిపోయింది.   లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. వాహనాలు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. గత కొన్ని రోజులుగా మండే ఎండలు, వడగాల్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరౌతున్న హైదరాబాదీయులు మంగళవారం సాయంత్రం ఆకాసం మబ్బుపట్టి వర్షం కురవడంతో హమ్మయ్యా అని ఆనందపడ్డారు. అయితే నిముషాల వ్యవధిలోనే వారి ఆనందం ఆవిరైపోయింది. మెల్లిగా మొదలైన వర్షం కుండపోతగా మారింది.  జనాలకు నరకం చూపించింది. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కార్యాలయాలు వదిలి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో మొదలైన వాన ఏకధాటిగా రెండు గంటలకు పైగా కురిసింది.  దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మెట్రో రైళ్లు సైతం కిక్కిరిసిపోయాయి. భారీ వర్షం కారణంగా చూపుతూ కొంత సేపు మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి.  ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ కు వానకష్టాలు మాత్రం తీరడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   చిన్నపాటి వర్షానికే   రోడ్లు జలమయం కావడం, ట్రాఫిక్ జామ్ కావడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి నరకయాతన హైదరాబాదీయులకు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

కాళేశ్వరం కుంగింది అందుకే...నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి  ప‌లు సూచ‌న‌లు చేసింది.  1) మొత్తం 85గేట్లలో 77 గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, మిగిలిన ఎనిమిది గేట్లలో మాత్రం సాంకేతిక , మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని , వీటిని చక్కదిద్దేందుకు ఏ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలో అధికారులు నివేదికలో పేర్కొన్నారు.   2) మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో 15నుంచి 22 పిల్లర్లు దెబ్బతినడంతో వాటిని రిపేర్ చేసేందుకుగాను గేట్లను పైకి ఎత్తివేయాలని సూచించారు. 3) 20, 21 నెంబర్ గేట్లను ఓపెన్ చేయడానికి వీలు లేనందున వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని,  రిపేర్ లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టెక్నికల్ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.   4) బ్యారేజ్ ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి దఫా వరదతో, మేడిగడ్డలోని ఏడో బ్లాక్ లో సమస్యలు తలెత్తాయని, వాటిని అప్పుడే గుర్తించి మరమ్మత్తులు చేపట్టి ఉంటే, మిగతా పిల్లర్లకు ఎలాంటి సమస్యలు ఉండేవి కావని అధికారులు నివేదిక‌లో రాశారు.  మరమ్మత్తుల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. 5) 8 గేట్ల ప్రాంతంలో బ్యారేజీ మీదనున్న శ్లాబ్ కుంగిపోవడంతో కొత్త శ్లాబ్ వేయాలని పేర్కొన్నారు.   6) ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లకు మాత్రమే కాకుండా మిగిలిన వాటికీ ప్రమాదం లేదనుకోలేమని స్పష్టం చేశారు. కాళేశ్వరం మరమ్మత్తులపై గైడ్ లైన్స్ ను డ్యాం సేఫ్టీ అధికారులు జారీ చేశారు.  7)  ప్లానింగ్, డిజైన్, క్వాలీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో నిర్ల‌క్ష్యం వ‌ల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింద‌ని డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికలో తెలిపింది. 8) డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని నివేదికలో పేర్కొంది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడిందని నివేదికలో వెల్లడించింది. పిల్లర్లు కుంగిపోవటానికి బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవటం వలనేనని తెలిపింది.   మ‌రో వైపు మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను  జ్యుడీషియల్‌ కమిషన్‌ సందర్శించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై న్యాయ విచారణలో భాగంగా బరాజ్‌లోని కుంగుబాటుకు గురైన 19, 20, 21వ పియర్లలతోపాటు ఏడో బ్లాక్‌లో వంతెనపై కాలినడకన వెళ్లి జ్యుడీషియల్‌ కమిషన్‌ క్షుణ్ణంగా పరిశీలించింది.  ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్ల ప్రాంతాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. బరాజ్‌లో కుంగిన పియర్ల పగుళ్లను పరిశీలించారు. కుంగుబాటుకు గల కారణాలను, ఇతర సాంకేతిక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ మాట్లాడుతూ.. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక  అందిందని, దాన్ని అధికారుల సమక్షంలో సమీక్షిస్తున్నట్టు తెలిపారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

పవన్ కాలికి గాయం.. ఆందోళనలో కూటమి నేతలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.  అయితే ఆయన కాలికి గాయం కావడం కూటమి నేతలు, శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. నిర్విరామంగా పర్యటిస్తూ బహిరంగ సభలలో ప్రసగింస్తున్న పవన్ కల్యాణ్ కు అభిమానుల తాకిడీ విపరీతంగా ఉంది. ఎలాగైనా సరే ఆయనతో సెల్ఫీ దిగాలన్న వారి అత్యుత్సాహం కారణంగానే పవన్ కాలికి గాయమైందని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని నరేంద్ర మోడీ సభలలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశారు. అయితే ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ తో సెల్ఫీ కోసం అభిమానులు, పార్టీ శ్రేణులూ తహతహలాడిన సందర్భంలో జరిగిన స్వల్ప తొక్కిసలాటలో పవన్ కాలికి గాయమైంది. సాధారణంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది ఆయనకు రాక్షణగా ఉంటారు. అయితే ప్రధాని పర్యటన కావడంతో వారు పవన్ కు రక్షణగా ఉండే అవకాశం లేకపోయింది. అనకాపల్లి సభ అనంతరం సెల్ఫీల హడావుడిలో ఎవరో పొరపాటును పవన్ కాలిని తొక్కి ఉంటారనీ, అందుకే గాయమైందని చెబుతున్నారు.   ఆయన రేణిగుంట విమానాశ్రయంలో కాలికి బ్యాండేజితో కనిపించారు. కాలికి గాయమైన ఆయన లెక్క చేయకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తిరుమతిలో చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. 

మోడీ కూడా అనేశారు.. జగన్ దింపుడు కళ్లెం ఆశలూ గాయెబ్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే  తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి. అయినా ఏదో దింపుడు కళ్లెం ఆశ.. పేరుకు తెలుగుదేశం, జనసేనలతో బీజేపీ జట్టు కట్టినా అది బీజేపీ రాష్ట్ర క్యాడర్ ను సంతృప్తి పరచడానికే తప్ప.. మరేమీ కాదనీ, బీజేపీ అధినాయకత్వం ఆశీస్సులు తనకే ఉన్నాయనీ ఆయన భ్రమల్లో మునిగి తేలారు. అందుకు అనుగుణంగానే నరసాపురం ఎంపీ టికెట్ ఆర్ఆర్ఆర్ అంటే రఘురామకృష్ణం రాజుకు ఇవ్వవద్దంటూ తాను చేసిన వినతిని బీజేపీ అధినాయకత్వం మన్నించడంతో బీజేపీ ఏ కూటమిలో ఉన్నా.. ఆ పార్టీ అగ్రనాయకత్వం మద్దతు సంపూర్ణంగా తనకే అని గట్టిగా నమ్మేశారు. అందుకే బీజేపీ రాష్ట్ర నేతలు, కొందరు జాతీయ నేతలూ కూడా తన ప్రభుత్వంపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా జగన్ కానీ, ఆయన పార్టీ నేతలు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు.  ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత కూడా జగన్ సర్కార్ కోడ్ ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడుతున్నా ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించకపోవడంతో తనకు ఎదురే లేదన్న భావన జగన్ లో వ్యక్తం అయ్యింది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు వచ్చి చిలకలూరి పేటలో కూటమి తొలి సభలో ప్రసంగించారు. ఆ సభ సందర్భంగా శాంతి భద్రతల విషయంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైనా.. ఎన్నికల సంఘం డీజీపీపై చర్య తీసుకోకపోవడంతో.. బీజేపీ పైకి కూటమితో ఉన్నా.. తనకు సహకారం అందించే విషయంలో రెండో ఆలోచనే ఆ పార్టీ అధినాయకత్వానికి లేదని జగన్ మాత్రమే కాదు , ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, చివరాఖరికి కూటమిలోని తెలుగుదేశం, జనసేన శ్రేణులూ కూడా భావించాయి. నిజమే చిలకలూరిపేట బొప్పూడి సభలో.. జగన్ సర్కారును పల్లెత్తు మాట అనని మోదీ వైఖరిపై, కూటమిలో అసంతృప్తి వెల్లువెత్తింది. ఆ తర్వాత డీజీపీ-సీఎస్-టీటీడీ ఈఓ బదిలీలపై ఈసీ మౌనంపైనా అనుమానం తొంగిచూసింది. జగన్ ఒత్తిడి కారణంగానే ఎంపి రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం టికెట్ ఇవ్వలేదన్న చర్చ జరిగింది. ఈ క్రమంలో బొప్పూడి సభలో మోదీ ఏపీ సీఎం జగన్‌పై, విమర్శలకు దూరంగా ఉండటం సహజంగానే అనుమానాలు పెంచినట్లయింది.  అయితే హఠాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటి వరకూ ఎవరేమన్నా జగన్ ను ప్రధాని మోడీ మాత్రం పన్నెత్తి విమర్శించిన పాపాన పోలేదు. కానీ కాకినాడ, అనకాపల్లి లో ఆయన ప్రసంగాలలో జగన్ సర్కార్ పై విమర్శల వాడి పెరిగింది. మోడీ కూడా జగన్ సర్కార్ అవినీతిపై విమర్శలు గుప్పించారు. మూడు రాజధానులంటూ ఒక్క రాజధానిని కూడా నిర్మించలేదనీ, కానీ ఆ పేరు చెప్పి భయంకరమైన దోపిడీకి పాల్పడ్డారనీ ఎలాంటి శషబిషలూ లేకుండా చెప్పేశారు. అంతే కాదు.. ఎపీలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి రాబోయేది కూటమి ప్రభుత్వాలేనని చెప్పారు. చంద్రబాబు విజన్ పై పొగడ్తలు కురిపించారు.  కూటమి అభ్యర్థులకు ఓటేస్తే రాష్ట్రానికి చంద్రబాబు పాలన అందుతుందని చెప్పారు.  ఏపీలో ఉన్నది అవినీతి సర్కారు, అసమర్థ సర్కార్ అని ప్రకటించారు. మారిన మోడీ వైఖరితో అప్పటి వరకూ కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలీపై ఉన్న అనుమానాలు పటాపంచలైపోయాయి.  అంతే కాదు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిజాయతీపరుడైన దార్శనికుడు. అందుకే ఆయనతో కలిశాం అని చెప్పడం ద్వారా జగన్ సర్కార్ అవినీతిమయం అని తేల్చేశారు. ప్రధాని  వైఖరి కూటమిలో  ఉత్సాహాన్ని నింపింది.   బీజేపీ-, వైసీపీ తెరచాటు బంధం  అనుమానాలను  పటాపంచలు చేసింది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సర్కారుపై, ప్రధాని నరేంద్రమోదీ చేసిన మాటల దాడితో వైసీపీ డీలా పడిపోయింది.     

ఎదురుదాడికి జగన్ కు ఇక మిగిలింది ఎన్నికల సంఘమే!

ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు. పాపం ఆయనకు ఎన్నికలు తను అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకూ సన్నగిల్లిపోతోందట. 2019లోనే ఎన్నికలు కూడా ఆయన కోరుకున్న విధంగా సక్రమంగా జరిగాయి. అప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంతా తాననుకున్నట్లే, తనకు కావలసినట్లే ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా తనకు కావలసిన విధంగా ఎన్నికలు సక్రమంగా సజావుగా జరగడం లేదు. రాష్ట్రంలో మెజారిటీ అధికారులు తాను చెప్పిందల్లా చేస్తుంటే.. ఈ ఎన్నికల సంఘానికి ఏం వచ్చింది. ఇష్టారీతిన అధికారులను మార్చేస్తోంది. అదీ విపక్ష కూటమి నేతల ఫిర్యాదులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం ఆయనకు సుతరామూ నచ్చడం లేదు. అందుకే ఆయన ఎన్నికలలో విజయంపైనా నమ్మకం కోల్పోయారు. ఎన్నికలు సజావుగా జరుగవన్న నిశ్చయానికీ వచ్చేశారు. ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తోందంటూ విమర్శలకు దిగారు.   తన ఐదేళ్ల పాలనలో తన విధానాలు వేలెత్తి చూపే, గొంతెత్తి ప్రశ్నించే వారిపై వేధింపులు, ఎదురుదాడే అస్త్రంగా సంధించి వారి గొంతులను అణిచివేసిన జగన్. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై కూడా ఎదురుదాడే అస్త్రంగా ముందుకు సాగారు. ఇప్పటి వరకూ ప్రత్యర్ధులపై ఎదురుదాడినే అస్త్రంగా నమ్ముకున్న జగన్..  ఇప్పుడు ఎన్నికల సంఘంపైనా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తనకు అనుకూలంగా వ్యవహరించే డీజీపీ, ఏడీజీ, ఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లు, డీఎస్పీలపై వేటుతో వణికిపోతున్న జగన్.. ఎన్నికల సంఘంపై రుసరుసలాడుతున్నారు. యథా నాయకా, తథా అనుచరులు అన్నట్లుగా జగన్ బాటలోనే  వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు,  నేతలు నడుస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో అధికారుల బదిలీలు, పథకాల నిలిపివేతపై జగన్ నుంచి ఎమ్మెల్సీల చేస్తున్న ఎదురుదాడి వారిలో విజయం పట్ల కొరవడిన నమ్మకానికి నిదర్శనంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   గత ఎన్నికల సమయంలో అప్పటికి విపక్ష నేతగా ఉన్న జగన్ అప్పటి అధికార పార్టీపై ఎన్నికల సంఘానికి ఎన్ని ఫిర్యాదులు చేశారు. ఆయన, ఆయన చేసిన ప్రతి ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఎలా ఆఘమేఘాల మీద స్పందించిదీ అన్నది గుర్తు చేస్తూ, చేసుకుంటూ జనం నవ్వుకుంటున్నారు.  గత ఎన్నికల ముందు.. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్లో, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అండ్‌కో  ఫిర్యాదుల మేరకు ఎలాంటి జాప్యం లేకుండా అప్పటి సర్కార్ లోని ఐఏఎస్, ఐపీఎస్ , డీఎస్పీలను ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టిన సంగతి తెలిసిందే.   ప్రధానంగా నాటి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా, డీజీపీ , ఇంటలిజన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు ఎస్పీ, కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆఘమేఘాల మీద మార్చేసింది.  ఈ విషయాలను ఇప్పడు అధికారంలో ఉన్న వైసీపీ కన్వీనియెంట్ గా మర్చిపోతే పోవచ్చు కానీ, జనానికి ఐదేళ్ల కిందటి సంగతులన్నీ ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వచ్చేస్తున్నాయి. వైసీపీ తీరు గురువింద గింజ సామెతగా ఉందని ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పింఛన్ల పంపిణీ నుంచీ, ఎన్నికల వేళ నిధుల విడుదల కోసం అభ్యర్థనలు పంపడం వరకూ ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి జగన్ రెడ్డి పాలనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా, ఎన్నికల సంఘం ఇంకా ఆయనపై ఎందుకు వేటు వేయలేదని ఆశ్చర్యపోతున్నారు.   ఏది ఏమైనా ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్య వైసీపీ నేతలు, కేడర్, చివరాఖరికి అభ్యర్థులు కూడా ఓటమి ఖరారైపోయిందన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. దీంతో వారు సరిగ్గా ఎన్నికల వేళ కాడె వదిలేసినట్లు కనిపిస్తోంది. జగన్ సభలు జనం లేక వెలవెల బోతుండటమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగనే ఓటమి భయంతో వణికి పోతుంటే.. తామెంత అనుకుంటున్న వైసీపీ అభ్యర్థులు ఎన్నికలలో సొమ్ములు ఖర్చు పెట్టడం వృధా అన్న భావనకు వచ్చి జగన్ సభలకు కూడా జనసమీకరణ చేయడానికి ప్రయత్నించడం లేదు.  మొత్తంగా  ఎన్నికలు సక్రమంగా జరగవేమోనంటూ జగన్ చేసిన  వ్యాఖ్యలు, వైసీపీ అభ్యర్ధుల మనోస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. ఎ ఆ ప్రభావం వైసీపీ ప్రచారంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 

హైదరాబాద్ లో రిటైనింగ్ వాల్ కూలి ఏడుగురు మృతి 

వర్షాకాలం ప్రారంభం కాకమునుపే హైదరాబాద్ లో శిథిలావస్థలో ఉన్న భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయోనన్న ఆందోళన ఎక్కువైంది. ఎండలతో మండిపోతున్న హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షం చేదు అనుభవాన్ని మిగిల్చింది.  మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం ప్రభావంతో బాచుపల్లిలో గోడ కూలి ఏకంగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. మంగళవారం కురిసిన వర్షానికి గోడ కూలిపోయింది. శిథిలాల కింద ఏడు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల పేర్లు రామ్‌ యాదవ్‌ (34), గీత (32), హిమాన్షు (4), తిరుపతిరావు (20), శంకర్‌ (22), రాజు (25), ఖుషిగా గుర్తించారు.కాగా గోడ కూలిందన్న సమాచారం అందుకున్న అధికారులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మొత్తం ఏడు మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.   కాగా మృతులంతా రేణుక ఎల్లమ్మ కాలనీలో ఓ భవన నిర్మాణంలో సెంట్రింగ్ పని చేస్తున్న కార్మికులుగా తెలుస్తోంది. కార్మికులు ఉంటున్న షెడ్‌పై రిటైనింగ్ వాల్ కూలి పడడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులంతా ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. కాగా హరిజన్ డెవెలపర్స్ కన్స్ట్రక్షన్స్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది.  

తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు ...నాలుగు రోజుల పాటు వర్షాలు!

 తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.  తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎండలు దంచికొడుతున్నాయి. అధిక వేడి ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఏదైనా పని ఉండి బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లతో రిలీఫ్ పొందుతున్నారు. ఇక మండుటెండల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ద్రోణి ప్రభావంతో రేపు అనగా మంగళవారం నాడు ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, అల్లూరి, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తక్కిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడిమి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనం కలుగనున్నది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.మంగళవారం సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల భారీ, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల రాకతో ప్రజలకు మండే ఎండల నుంచి రిలీఫ్ కలుగనున్నది.

తప్పులు చేయడం.. చంద్రబాబుపై నెపం వేయడం.. జనం నమ్మేస్తారా జగన్?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎస్పీలపై బదిలీ వేటు వేసిన ఈసీ తాజాగా డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిపై కూడా   బదిలీ వేటు వేసింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై సైతం బదిలీ వేటు పడింది. వీరి స్థానంలో కొత్తవారికి ఈసీ బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల సమయంలో తమకు మేలు చేస్తారని భావించిన అధికారులు ఒక్కొక్కరిపై బదిలీ వేటు పడుతుండటంతో జగన్ తో పాటు ఆయన శిబిరంలో భయం మొదలైంది. దీంతో జగన్ మోహన్ రెడ్డి విపక్షాలపై ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదని తనలోని ఓటమి భయాన్ని జగన్ బయట పెట్టారు. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీకి కార్యకర్తల్లా పనిచేసే అధికారులతో విపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ మోహన్ రెడ్డికి ఈసీ నిర్ణయాలు మింగుడు పడటం లేదు. దీంతో తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ప్రజల ముందు ఏడుపు మోహం పెట్టి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలను జగన్ షురూ చేశారు. ఎన్నికల నియమావళిలో భాగంగా ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు జగన్ మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాల అమలుపై ఈసీ ఆంక్షలు విధించడం సర్వసాధారణం. కోడ్ అమల్లోకి వచ్చేలోపే అధికార పార్టీలు ప్రభుత్వ పథకాల ఫలాలను లబ్ధిదారులకు చేరవేస్తుంటాయి. కానీ జగన్ మోహన్ ప్రభుత్వం కావాలనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఆన్ గోయింగ్ స్కీంలు అంటూ పలు పథకాల డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసేందుకు ప్రయత్నాలు చేసింది. వీటికి ఈసీ అడ్డుకట్ట వేసింది. ప్రభుత్వ పథకాల  నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బు జమ చేయొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు నాయుడుపై ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తూ తమ బేల తనాన్ని బయటపెట్టుకుంటున్నారు. పథకాల డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయడం ఆపాలని ఈసీకి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది.  ఆన్ గోయింగ్ పథకాలకు బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లో వెళ్లలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి బటన్ ఎప్పుడు నొక్కాడు.. ఎప్పుడు డబ్బులు వెళ్లలేదనేది ప్రజలకు మాత్రం వైసీపీ నేతలు చెప్పడం లేదు. దీనిలో ఓ మతలబు కూడా ఉంది. అదేమిటంటే ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మార్చి 1వ తేదీన రూ.610 కోట్లకు వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మార్చి 16 వ తేదీన. మార్చి 1వ తేదీన బటన్ నొక్కితే ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు   లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉంది. ఇక్కడ రెండు విధానాలుగా వైసీపీ డ్రామాలను అర్ధం చేసుకోవచ్చు. డబ్బులు లేకపోయినా వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కి లబ్ధిదారులను మోసం చేసింది. అలాకాకుంటే.. డబ్బులు ఉంటే ఉద్దేశపూర్వకంగా అవి లబ్ధిదారుల ఖాతాలలో వేయకుండా  పోలింగ్ కు వారం రోజులు ముందు ఆ  డబ్బులు వేసి  ఓటర్లను ప్రలోభ పెట్టి లబ్ధి పొందాలని చూసింది.  ఇవన్నీ ప్రజలకు తెలియకుండా వైసీపీ అధినేత జగన్, వైసీపీ నేతలు వాళ్లు చేసిన తప్పును చంద్రబాబుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము డబ్బులు వేశాం.. కావాలనే ఈసీకి ఫిర్యాదు చేసి మీకు రావాల్సిన డబ్బులు రాకుండా చంద్రబాబు ఆపించారని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదారిపట్టించి ఓట్లు వేయించుకోవటం జగన్ మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది. గత ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య ఘటనలతో ప్రజల్లో సానుభూతి పొంది, ఆ నెపాలను చంద్రబాబు, ఆయన అనుచరులపైకి నెట్టేసి జగన్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తరువాత జగన్ చెప్పినవన్నీ అబద్ధాలని ప్రజలకు స్పష్టత వచ్చింది. మళ్లీ తాను చేసిన తప్పులన్నీ చంద్రబాబుపైకి నెట్టేసి ప్రజల్లో చంద్రబాబును విలన్ గా చిత్రీకరించాలన్నది వైసీపీ కుట్రగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ అనుకూల అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాలకు కూడా విలువ నివ్వకుండా పింఛన్ల పంపిణీని క్లిష్టతరం చేశారు. తద్వారా పలువురు  వృద్ధులు ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యారు. పెన్షన్లు పంపిణీ చేయడంలో అధికారులు వైఫల్యాన్ని సైతం  చంద్రబాబుపైకి నెట్టే ప్రయత్నం జగన్ చేశారు. తాజాగా వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను గుర్తించి ఈసీ బదిలీ వేటు వేస్తుంటే వారి బదిలీ చంద్రబాబు కుట్రలో భాగమని జగన్ చెబుతుండటం గమనార్హం. తాజాగా ఇన్ ఫుట్ సబ్సిడీ, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల పంపిణీ నిలిపివేతలోనూ ఈసీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని జగన్ అండ్ వైసీపీ నేతలు, ఆ నెపాన్ని సైతం చంద్రబాబుపై నెట్టి ఎన్నికల్లో పబ్బంగడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పులు చేసేది జగన్.. ఆ నెపాన్ని చంద్రబాబుపైకి నెట్టడం జగన్ మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది. అయితే, గత  ఎన్నికల్లో జగన్ కుట్రలను తెలుసుకోలేక మోసపోయిన ప్రజలు.. ఈసారి జగన్ కుట్రలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఓటు ద్వారా బుద్ది చెప్పేందుకు సిద్ధమయ్యారు.

వెండి తెరపై ఝాన్సీరాణి.. రాజకీయ రణంలో విదూషకమణి!

కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా  ఆమె నటనకు ప్రతి సందర్భంలోనూ నూటికి నూరు మార్కులు పడ్డాయి. సినీ రంగం నుంచి ఆమె రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అయితే సినిమాలలో బ్రహ్మాండమైన గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ కు రాజకీయ రంగంలోనూ గుర్తింపు వచ్చింది. సినిమా రంగంలో ఆమె ఝాన్సీ లక్ష్మీబాయ్ లా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్ర వేస్తే రాజకీయ రంగంలో అందుకు భిన్నంగా ఒక విదూషక మణిగా జనం దృష్టిలో నవ్వుల పాలయ్యారు. అవగాహనా రాహిత్యం, తెలియని విషయాలపై కూడా సమగ్ర పరిజ్ణానం ఉన్నదన్నట్లు చేస్తున్న ప్రసంగాలూ ఆమెను ప్రజల దృష్టిలో నవ్వుల పాలు చేస్తున్నాయి.  ఏదో సినిమాలో లాయర్ తన వాగ్ధాటి నంతా ప్రయోగించి సొంత క్లయింట్ కు శిక్ష పడేలా చేసిన విధంగా కంగనా రనౌత్ తన ప్రసంగాలలో సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించేస్తున్నారు.  తెలుగు రాష్ట్రాలలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రసంగాలకు ఎలాగైతే అభిమానులు ఉన్నారో.. ఉత్తరాదిలో అలాగే కంగనా రనౌత్ ప్రసంగాలంటే చెవి కోసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభిమానులూ తయారయ్యారు. అయితే ఆమె ప్రసంగాలు విని ఆమె రాజకీయ పరిజ్ణానానికి ముగ్ధలై వారు ఆమెకు అభిమానులుగా మారలేదు. ఆమె అజ్ణానంతో చేస్తున్న తప్పుల తడకల ప్రసంగం విని పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుని ఆమె కు అభిమానులుగా మారిపోయారు. తెలుగు రాష్ట్రాలలో పాల్ ను కూడా జనం ఆయన వినోదం పంచే తీరుతోనే అభిమానులుగా మారిపోయారన్నమాట. సర్కస్ లో జోకర్ ను చూసి ఎంతలా నవ్వు వస్తుందో రాజకీయాలలో కంగనా రనౌత్ ప్రసంగాలు విన్న వారికి అంతకు మించి నవ్వు వస్తుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యకు మద్దతుగా ప్రచారం చేసిన ఆమె పొరపాటున బీజేపీ అభ్యర్థిపైనే విమర్శల వర్షం కురిపించేశారు. సొంత పార్టీ అభ్యర్థి పేరు తేజస్వి సూర్య అయితే.. ఆమె పొరపాటుగా ఆర్జేడీ నేత తేజస్వి ప్రసాద్ గా భావించి విమర్శల వర్షం కురిపించేశారు. స్వయంగా తాను నవ్వుల పాలు కావడమే కాకుండా సొంత పార్టీ బీజేపీనీ, ఆ పార్టీ అభ్యర్థి తేజస్వి సూర్యనూ నవ్వుల పాలు చేసేశారు.  బీజేపీ కంగనా రనౌత్ ను పార్టీలో చేర్చుకుని పార్టీ టికెట్ ఇచ్చిన నాటి నుంచి ఆమె కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. తప్పుల తడకలతో సాగే ఆమె ప్రసంగాలు జనాలను నవ్విస్తూనే ఉన్నాయి. ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేసే నియోజకవర్గం ఎన్నిక చివరి దశలో అంటే ఏడవ దశలో జూన్ 1న జరగనుంది.  

పోస్టల్ బ్యాలెట్ కు ఈ నెల 9 వరకు గడువు 

 సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు  రోజులు  మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం  ఉంది. దీన్ని   ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు ఆపేయాలని ఎన్నికల సంఘం చెప్పలేదని అన్నారు. కొంతకాలం తర్వాత ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసిందని వివరించారు.  ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. మొత్తం 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్లలో 3.30 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లు వినియోగించారని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. కొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందని, సెక్యూరిటీ విధులకు వెళ్లిన వారికి ఈ నెల 9 వరకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సొంత సెగ్మెంట్లలోని ఫెసిలిటేషన్ సెంటర్లలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చని స్పష్టత నిచ్చారు.  ఒంగోలులో కొందరు ఉద్యోగులు ప్రలోభాలకు గురైనట్టు గుర్తించామని, కొందరు తమకు ఆఫర్ చేసిన మొత్తాన్ని తిప్పి పంపారన్న విషయం కూడా వెల్లడైందని వివరించారు. ఒంగోలులో ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపుతున్న వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు.  పోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబుల్  ను సస్పెండ్ చేశామని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. పల్నాడులో హోలోగ్రామ్ ద్వారా కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, పల్నాడు ఘటనపైనా విచారణ చేపడుతున్నామని చెప్పారు. చిన్న మొత్తం కోసం ఆశపడితే ఉద్యోగానికే ప్రమాదం అని హెచ్చరించారు. డబ్బులు తీసుకున్న ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.

తెల్లోడి పెత్తనంపై తెలుగు తేజం తిరుగుబావుటా అల్లూరి సీతారామరాజు

భారత స్వాతంత్ర్య  సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి  భరతమాత దాస్యశృంఖలాల  విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు.  సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం  వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు. పరిమిత వనరులతో   సూర్యుడస్తమించని బ్రిటీషు సామ్రాజ్య పునాదులనే కదిలించేసిన మహావీరుడు.  తాను మరణించినా వేలాది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారన్న నమ్మికతో ప్రాణాలు అర్పించి చరిత్రలో అమరుడిగా మిగిలాడు. అటువంటి అల్లూరి సీతారామరాజు వర్ధంతి నేడు.  తూర్పు గోదావరి జిల్లాలోపాండ్రంగి జన్మించిన అల్లూరి సీతారామరాజు  ఆరేళ్ల వయస్సు నుంచేే చుట్టుపక్కల  కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవీ పేట మొదలైన ప్రాంతాల్లో తిరుగుతూ జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. సాహిత్యం బాగా చదివేవాడు. చిన్నప్పటినుండి సీతారామరాజులో ఉన్న నాయకత్వ లక్షణాలు, సామాజిక అంశాలపై అవగాహన అనేక ప్రాంతాలు తిరిగేలా చేసింది. 1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద కొంతకాలం ఉన్నాడు.  లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్ మొదలైన ప్రదేశాలు చూసి తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. దేశంలో మారుతున్న పరిస్థితులు ఆయనను స్థిరంగా ఉండనియ్యలేదు. 1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి బస్తర్, నాసిక్, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి ఇంటికి చేరాడు. ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని ప్రోది చేసి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు అల్లూరి సీతారామరాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేశాడు.  పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. ఆయుధ సంపత్తి పెంచుకోవడం కోసం అనేక పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామమునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు. మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ వచ్చాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని ప్రకటించాడు. రాజు ఆచూకీ కోసం మన్యం ప్రజలను నానా హింసలకు గురచేశాడు. ప్రజలు పడుతున్న బాధలను చూసి చలించిపోయిన సీతారామరాజు లొంగిపోవాలని నిశ్చయించుకుని తన ప్రాణాలనుభారతమాత విముక్తి కోసం తృణప్రాయంగా అర్పించాడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.  1924 మే 7న  అల్లూరి సీతారామరాజు మరణించాడు.  సీతారామరాజు మరణం దేశవ్యాప్తంగా  సంచలనం సృష్టించింది. ఆ తర్వాత స్వాతంత్య్ర పోరాటం తీవ్ర రూపం దాల్చి తెల్లవారిని తరిమికొట్టింది. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న స్వతంత్య్రభారతావని చరిత్రపుటల్లో  సీతారామరాజు పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది.   అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా...

కూటమికి చిరు మద్దతు.. జగన్ కు మైండ్ బ్లాక్!

కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు.  అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు. అంతకు ముందే తన సోదరుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు. ఇప్పుడు తాజాగా తన సోదరుడు పవన్ కల్యాణ్ కు ఓటు వేసి ఓ నిస్వార్థ సేవకుడిని గెలిపించాలని కోరుతూ పిఠాపురం ప్రజలను ఓ వీడియో ద్వారా కోరారు. ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చేశారు. మరో ఐదు రోజులలో రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కూటమికే రాష్ట్రంలో మొగ్గు కనిపిస్తోందంటూ పలు సర్వేలు తేల్చేశాయి. జగన్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి సభలకు జనం పోటెత్తుతుండటం, మరో వైపు వైసీపీ ప్రచారానికి స్పందన కనిపించకపోవడంతో వైసీపీ శిబిరం డీలా పడింది. ఈ తరుణంలో చిరంజీవి కూటమికి మద్దతు పలికడం కచ్చితంగా వైసీపీకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారుతుందనడంలో సందేహం లేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు రానున్న రెండు మూడు రోజులలో చిరంజీవి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అలా కలవడం  అంటే చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ప్రకటించినట్లేనని భావించాల్సి ఉంటుంది.  ఇక తాజాగా జనసేనానికి మద్దతుగా అన్నయ్య చిరంజీవి వీడియో సందేశం అందరినీ కదిలిస్తోంది. హృదయాలకు హత్తుకునేలా ఉంది. కుటుంబంలో చివరివాడిగా పుట్టిన పవన్ కల్యాణ్ సమాజానికి మేలు చేయడంలో మాత్రం ముందువాడిగా నిలిచాడని పేర్కొన్నారు.  చిరంజీవి పిలుపు పిఠాపురంలో ఏమూలో వైసీపీకి మిణుక్కు మిణుక్కు మంటున్న గెలుపు ఆశలను ఆవిరి చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చిరంజీవి చంద్రబాబుతో భేటీ అయితే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే జగన్ సహా ఆ పార్టీ నేతలంతా ఓటమి బెంగతో డీలా పడ్డారు.  చిరు ఎంట్రీతో  ఆ పార్టీ అధినేత మరింత దుర్బలంగా మారడం ఖాయమంటున్నారు. ఎందుకంటే చిరంజీవి చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజలలో ఆయనకు ఉన్న గుర్తింపు, గౌరవం మాత్రం చెక్కు చెదరలేదు. ఆయన మద్దతు నిస్సందేహంగా కాపు సామాజికవర్గ ఓటర్లను తెలుగుదేశం కూటమివైపు ఆకర్షిస్తుంది.  సరిగ్గా ఎన్నికల వేళ తెలుగుదేశం కూటమికి చిరు మద్దతుగా రావడం జగన్ కు మింగుడుపడని అంశమే. గతంలో సినిమా టికెట్ల తగ్గింపు చిరంజీవి జగన్ ను కలిసిన సందర్భంలో  ఎదురైన పరాభవానికి సరైన సమయంలో  ఎదురైన పరాభవానికి చిరంజీవి సరైన సమయంలో దీటైన బదులిచ్చినట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆ ఎమ్మెల్యే మాకు వద్దే.. వద్దు..! కాకరేపుతున్న సూళ్లురుపేట రాజకీయం!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం సూళ్లురుపేట.  తమిళనాడు,  ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వుండే ఈ సెగ్మెంట్‌లో రెండు ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలు  వుంటాయి.  భారత అంతరిక్ష పరిశోధనా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్  ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో వున్న సూళ్లూరుపేట,  జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. సూళ్లూరుపేట నియోజకవర్గం మొదటిలో కాంగ్రెస్‌కు ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 5 సార్లు  మరియు వైసీపీ రెండు సార్లు గెలిచాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కిలివేటి సంజీవయ్య టీడీపీ అభ్యర్ధి పారాస వెంకట రత్నంపై 61,292 ఓట్ల భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే సూళ్లూరుపేట వైసీపీలో అంత‌ర్గ‌త విభేధాలు ఆ పార్టీకి త‌ల‌నొప్పిగా మారాయి. ప్ర‌స్తుత ఎమ్మెల్యే , వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య సమక్షంలోనే వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం గొడ‌వ ప‌డుతూనే వున్నారు. వర్గ విభేదాలు,  వీధి కొట్లాటలతో వైసీపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది.  స్థానిక ప్ర‌జ‌లు తాగునీటి సమస్యతో బాధ‌ప‌డుతున్నారు. జగన్ పరిపాలనలో మంచినీటి సమస్య తీరలేదని ప్రజలు వాపోతున్నారు.  పట్టణవాసులైతే డ్రైనేజీ సమస్యలతో అల్లాడుతున్నారు. డ్రైవర్ కాలనీ అంతా డ్రైనేజీ కాలనీగా మారిపోయింది. డ్రైనేజీ కోసం కాలువ తవ్వి ఐదేళ్లుగా అలా వదిలేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మురుగు కాల్వల నుంచి కాపాడమని ప్రజలు వేడుకుంటున్నారు.  ఐదేళ్ల క్రితం కాలువ కడతామని అక్కడ తవ్వి వదిలేశారు. అది అలాగే ఉండిపోయింది. ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. డంపింగ్ యార్డు ఒకటి ఊరికి దరిద్రంగా మారింది. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ జాతీయ రహదారి పక్కనే వేసేస్తున్నారు. 15 ఏళ్లుగా డంపింగ్ యార్డు దుర్గంధంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆ దుర్వాసన ఊరంతా వ్యాపిస్తూ ఉంటుంది. వర్షాకాలమైతే చెప్పలేం. దీని కారణంగా అంటు రోగాలు వ్యాపిస్తున్నాయని అంటున్నారు.  దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో,  ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  మ‌రో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీనిలో భాగంగా  విజయశ్రీకి సూళ్లూరుపేట టికెట్ ను కేటాయించారు. అభ్య‌ర్థి త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించ‌డానికి ప్ర‌త్యేకంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామల ను టీడీపీ అధిష్టానం పంపింది. సూళ్లూరు పేట‌, ఎస్సీ రిజర్వ్‌డ్ సీటు కావ‌డంతో,  శ్రీల‌క్ష్మీ శ్యామ‌ల‌కు ప్ర‌త్యేకంగా ప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించారు. విజయశ్రీ గెలుపే ల‌క్ష్యంగా శ్యామ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.  టీడీపీ కూటమి  హామీల్ని ప్రజలలోకి తీసుకెళ్ళుందుకు ఆమె గట్టిగా ప్రయత్నిస్తున్నారు.  ఏపీలో వైసీపీ కథ ముగుస్తుందంటూ,  వైసీపీ ఐదేళ్ల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, మే 13న తమ తీర్పు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారని ఆమె చెబుతున్నారు.  కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.   చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరమన్నారు.  అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్ చంద్రబాబు అని  విజయశ్రీ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.  నియోజకవర్గంలో జగన్ పాలనపై వున్న తీవ్ర వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆమె చెబుతున్నారు.   అధికార వైసీపీ ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత ఐదేళ్లుగా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఒకవైపున శ్రీహరికోట, మరోవైపు పారిశ్రామిక వాడ శ్రీ సిటీ అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో అన్నచందంగానే సూళ్లూరు పేట మారింది. సూళ్లూరుపేటలో వరుసగా రెండు సార్లు  గెలిచిన కిలివేటి సంజీవయ్య పరిస్థితి కూడా నియోజకవర్గంలో అంత ఆశాజనకంగా లేదు. తనకి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య నలిగిపోతున్నారు.  నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 31 వేల 638 మంది ఉన్నారు. మహిళలు 1 లక్షా 17 వేల 850 మంది ఉంటే, పురుషులు 1 లక్షా 13 వేల 736 మంది ఉన్నారు.  నియోజకవర్గంలో ఎస్సీలు అధికంగా ఉంటారు, తర్వాత బీసీలు, ఆ తర్వాత ఓసీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికి రెడ్ల పెత్తనం ఎక్కువ. గెలిచిన ఎమ్మెల్యేలు వారి కనుసన్నల్లోనే ఉంటారు.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌ 

జనసేనానికి నేచురల్ స్టార్ నాని మద్దతు

నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే నటుడు, రచయత అయిన పోసాని కృష్ణ మురళి వైసీపీ తరఫున మీడియా సమావేశాలలో మాట్లాడుతున్నారు. వైసీపీలోనే ఉన్న కమేడియన్ అలీ మాత్రం అసలు ప్రచారం వైపు చూసిన దాఖలాలు లేవు. ఇక పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగా హీరోలతో పాటు బుల్లి తెర నటులు ఆది, సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ వంటి వారు ప్రచారం చేస్తున్నారు. అంతకు మించి సినీ పరిశ్రమ  నుంచి పెద్దగా ఎవరూ బయటకు వచ్చినట్లు కనిపించదు. అయితే ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చిన తరుణంలో ఒక్కరొక్కరుగా సినీ ప్రముఖులు బయటకు వచ్చి తమ మొగ్గు ఎవరివైపో చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి తన సోదరుడికి ఓటేయాలంటూ పిఠాపురం ప్రజలకు వీడియో ద్వారా పిలుపునిచ్చారు. అలాగే అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు ఓటేయాలంటూ కోరారు. తాజాగా  పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతుగా నేజురల్ స్టార్  నాని  రంగంలోకి దిగాడు. సోషల్ మీడియా వేదికగా జనసేనానికి మద్దతు ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఎదుర్కోబోయే పెద్ద రాజకీయ యుద్ధంలో విజయం సాధించాలని కోరుతూ ట్వీట్ చేశారు. మీరు కోరుకున్నది సాధించి, మీ వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు. సినిమా కుటుంబ  సభ్యుడిగా పవన్ కల్యాణ్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ ట్వీట్ లో నాని పేర్కొన్నారు.   గతంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను బాగా తగ్గించిన జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా నాని  తన స్వరం వినిపించాడు. రాజకీయాల్లో లేనప్పటికీ ధైర్యంగా టికెట్ ధరల అంశంపై స్పందించిన నానికి.. అప్పట్లో పవన్ అండగా నిలిచాడు. ఇప్పుడు ఎన్నికల వేళ జనసేనాని కి నాని మద్దతు పలకడం పట్ల  పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.