మామిడి కాయల గురించి మీకు తెలియని నిజాలివే!

పండ్లలో రారాజు మామిడి పండు. వేసవి వస్తోందంటే పిల్లా పెద్దలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు మామిడి పండ్ల కోసం.. ఇప్పుడు మార్కెట్లో మామిడి పండ్ల హడావిడి సాగుతోంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మామిడి పండ్ల సొంతం. పచ్చిగా ఉన్న మామిడి కాయలను పచ్చళ్ళు, పప్పు, కూరలు వండుతారు, పండిన వాటితో పానీయాలు, స్మూతీలు, షేక్ లు చేస్తుంటారు. ఎక్కువ మంది పండిన మామిడి కాయలు తినడానికి ఇష్టం చూపుతారు. కానీ పండిన మామిడి కంటే పచ్చి కాయను తినడమే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలింతకూ ఈ రెండింటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి?? రెండింటిలో ఏది బెస్టు.. ఆరోగ్యానికి ఏది మంచిది?? వివరంగా తెలుసుకుంటే.. పండిన మామిడి.. పండిన మామిడిలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ, బి మొదలైనవి కూడా సమృద్ధిగా ఉంటాయి. పండిన మామిడిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మలబద్దకం, విరేచనాలు, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిస్తుంది.  ఇది గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదే విధంగా థైరాయిడ్ సమస్యను దూరం ఉంచడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా పచ్చి మామిడి కాయ బెస్ట్ అంటున్నారు.. పచ్చి మామిడి తింటే.. పచ్చిమామిడి కాయలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలో పండిన మామిడి కంటే పచ్చి మామిడి బెస్ట్. సహజంగా గర్భవతులు పచ్చి మామిడి అంటే ఇష్టం చూపిస్తారు. ఇది వాంతులు, వికారం అరికట్టడంలో సహాయపడుతుంది. వేసవిలో ఎదురయ్యే వడదెబ్బ భయానికి పచ్చి మామిడి చాలా బెస్ట్. పచ్చి మామిడిని ఉడికించి చేసే ఆమ్ పన్నా.. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కనీసం పచ్చి మామిడి ముక్కలమీద కాసింత ఉప్పు చల్లుకుని తింటే శరీరంలో ఐరన్, సోడియం క్లోరైడ్ వంటి ఖనిజాలు బయటకు వెళ్లకుండా ఉంటాయి. వేసవిలో పచ్చి మామిడి తీసుకోవడం వల్ల శరీరం నీరసానికి లోను కాకుండా శరీరంలో తేమ శాతం తగ్గకుండా  హైడ్రేట్ గా ఉండచ్చు. రెండు రకాల మామిడి పళ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ పచ్చి మామిడిని ప్రయోజనాలు ఎక్కువ. అలాగే పండిన మామిడిని అతిగా తీసుకుంటే వచ్చే సమస్యలూ ఎక్కువే..                                ◆నిశ్శబ్ద.

వేసవి కాలంలో తమలపాకు జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో తెలుసా?

భారతీయ సంస్కృతిలో తమలపాకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడి పూజలలోనూ, శుభకార్యాలలోనూ ఇది లేకుండా పని జరగదు. తమలపాకు  చరిత్ర చూస్తే  సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే తమలపాకు ఉనికిలో ఉంది. హృదయం  ఆకారంలో ఉండే ఈ ఆకు పురాణాలలోనూ,  మత గ్రంథాలలోనూ  కనిపిస్తుంది. తమలపాకులతో  అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు  ఉన్నాయి. ఇది ఆయుర్వేదంలో కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది.  తమలపాకు జ్యూస్  తాగితే ఎన్నో లాభాలు పొందొచ్చు. అవేంటో తెలుసుకుంటే.. తమలపాకు ప్రయోజనాలు.. జ్వరం, జలుబు, ఛాతీ రద్దీ,  శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడానికి తమలపాకులను పురాతన కాలంలో ఉపయోగించారు. శ్వాస సమస్యలు ఉన్నవారు తమలపాకులతో పాటు లవంగాలను నీళ్లలో వేసి బాగా మరిగించి తాగాలి. దీని వల్ల  చాలా వరకు ఉపశమనం పొందుతారు. గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా ఈ ఆకు ఎంతో మేలు చేస్తుంది. దీని రసాన్ని తాగడం వల్ల గుండె జబ్బులకు చాలా మేలు జరుగుతుంది. తమలపాకును తినడానికి ఇష్టపడే వారు సాధారణ తమలపాకులను తినాలి,  తీపి ఆకులను తినకూడదు. ఇది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. తమలపాకుల జ్యూస్  జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. దీంతో ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. సాంప్రదాయకంగా తమలపాకులను భోజనం తర్వాత తీసుకుంటారు. ఇది మౌత్ ఫ్రెష్‌నర్‌గా మాత్రమే కాకుండా ఆహారం జీర్ణం కావడానికి కూడా సహాయపడుతుంది. తమలపాకులో  యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.  ఇవి నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా కావిటీస్,  చిగుళ్ల వ్యాధి వంటి దంత సమస్యలను నివారిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు తమలపాకులలో ఉంటాయి.  ఇది కీళ్ల నొప్పి,  వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం తమలపాకును తీసుకోవడం వల్ల శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.                                                 *నిశ్శబ్ద.

అరటిపండుతో కలిపి ఈ ఆహారాలు అస్సలు తినకూడదు..

అరటిపండ్లు చిన్నా పెద్ద అందరికీ ఇష్టం. అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉంటాయి. ఫలానా సీజన్ లోనే దొరుకుతాయనే బెంగ ఉండదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగినా, దేవుడి ముందు నైవేద్యం పెట్టాలన్నా పెద్ద పీట అరటిపండ్లకే ఉంటుంది. చాలామంది ప్రతిరోజూ అరటిపండ్లు తింటూంటారు. డైట్ మెనూలో భాగం చేసుకుని ఉంటారు.   వీటిలో పొటాషియం, ఫాస్పరస్, పెప్టిన్, గ్లూకోజ్, ప్రక్టోజ్, విటమిన్-సి, విటమిన్-బి6, ఫైబర్, ప్రోటీన్ మొదలైనవన్నీ ఉంటాయి. ఈకారమంగా ఇది మంచి పోషకాహార పండుగా పరిగణింపబడుతుంది. కానీ కొన్ని ఆహారాల కాంబినేషన్ ఆరోగ్యానకి మంచిది కాదని వైద్యులు చెప్పినట్టు.. అరటిపండుతో ఈ కింది ఆహారాలు తినడం అస్సలు మంచిది కాదు. ప్రూట్ సలాడ్ లో భాగంగా అరటిపండుతో పాటు బోలెడు పండ్లు తింటారు. అయితే వీటిలో సిట్రస్ పండ్లు ఉంటే మాత్రం కొంప మునిగినట్టే. అరటి పండును సిట్రస్ పండ్ల కాంబినేషన్ తో ఎప్పుడూ తినకూడదు. దీనివల్ల కడుపులో గందరగోళం, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా నిమ్మ, స్ట్రాబెర్రీ, దానిమ్మ వంటి పండ్లతో అరటిని అవాయిడ్ చేయాలి. చాలామంది అరటిపండును బ్రెడ్ తో తింటుంటారు. బ్రెడ్ స్టైసెస్ మీద అరటిపండు ముక్కలు పెట్టి తేనె లేదా చాక్లెట్ సిరప్ వేసి పిల్లలకు కూడా అందిస్తుంటారు. కానీ అరటిపండ్లు, బేకింగ్ చేసిన ఆహారాలు కలిపి తినడం ఎంతమాత్రం మంచిది కాదు. బేక్ చేసిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం, అరటిపండ్లు జీర్ణం కావడానికి తక్కువ సమయం పడుతుంది. రెండూ కలిపి తింటే జీర్ణాశయ సామర్థ్యం తగ్గిపోతుంది. భోజనం తిన్నతరువాత చాలామంది పండు తింటూంటారు. ఎక్కువగా అరటిపండుకే ప్రాముఖ్యత ఇస్తారు. అయితే మాంసాహారం తో అరటిపండు తిన్నా, మాంసాహారం తిన్నవెంటనే అరటిపండు తిన్నా అది చాలా చెడు చేస్తుంది. మాంసంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది అరటిపండుకు విరుద్దమైన ఆహారం. పైపెచ్చు మాంసాన్ని వండటానికి మసాలాలు కూడా ఉపయోగిస్తారు. మిల్క్ షేకులు ఈ కాలపు ఫెవరెట్ డ్రింకులు. శీతలపానీయాల వల్ల ఆరోగ్యం పాడవుతుంది, అందుకే మేము  ఆరోగ్యంగా ఉండేందుకు మిల్క్ షేక్ లు తాగుతాం అని బడాయి పోయేవారు ఈ విషయం వింటే షాకవుతారు. అరటిపండును ఎక్కువగా మిల్క్ షేక్ లలో వాడతారు. కానీ పాలు , అరటిపండు కలిపి తినడం జీర్ణాశయానికి అస్సలు మంచిది కాదు. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. టాక్సిన్ లు విడుదల చేస్తుంది. ఫుడ్ పాయిజన్ కు కారణమవుతుంది. జీర్ణసంబంధ సమస్యలకు దారితీస్తుంది.           *నిశ్శబ్ద.  

వేసవిలో విరివిగా లభించే మామిడి ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

పండ్లలో రారాజుగా మామిడిని చెప్పుకుంటారు.   ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల మామిడిపండ్ల రకాలు  ప్రసిద్ధి చెందాయి. మామిడి పండ్లు  రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం మామిడి పండ్లు మాత్రమే కాదు.. మామిడి చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యపరంగా మంచిదే..  మామిడి ఆకులు కూడా  ఆరోగ్యానికి  అంతే ముఖ్యమైనవి. శాస్త్రీయంగా మామిడి ఆకులను మాంగిఫెరా ఇండికా అంటారు. భారతీయులు మామిడి ఆకులను పండుగలు, శుభకార్యాలలో తోరణాలు కట్టడానికి ఉపయోగిస్తారు. అయితే ఆయుర్వేదం మాత్రం మామిడి ఆకులను ఆరోగ్యం కోసం కూడా ఉపయోగిస్తుంది. అసలు మామిడి ఆకులలో ఉండే పోషకాలేంటి?  మామిడి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే.. మామిడి ఆకులలో పోషకాలు.. మామిడి ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఎ,  విటమిన్ బి వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో స్టెరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, రైబోఫ్లావిన్, థయామిన్, ఫినాలిక్, బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ మొదలైన సమ్మేళనాలు ఉంటాయి. మామిడి ఆకులలో టెర్పెనాయిడ్స్,  పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి  శరీరంలోని వ్యాధి నుండి రక్షణ కల్పిస్తాయి.  మంటతో పోరాడుతాయి. ప్రయోజనాలు.. మామిడి ఆకుల సారం చర్మం మీద సన్నని గీతలు, వృద్ధాప్య సంకేతాలు, చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇది ముఖం నుండి ముడతలు,  ఫైన్ లైన్లను తగ్గిస్తుంది. మామిడి ఆకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు  ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా వల్ల కలిగే చర్మ ఇన్ఫెక్షన్లు,  చికాకులకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్ బ్యాలెన్స్ చేయడంలో మామిడి ఆకులు సహాయపడతాయి. ఈ ఆకులలో ఆంథోసైనిడిన్ అనే టానిన్ ఉంటుంది. ఇది  మధుమేహం మొదటి దశలో ఉన్నప్పుడు  చికిత్సలో సహాయపడుతుంది. ఎలా ఉపయోగించాలంటే..  ఒక కప్పు నీటిలో 10-15 మామిడి ఆకులను వేసి మరిగించాలి. తర్వాత ఆ నీటిని రాత్రంతా చల్లారనిచ్చి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. దీన్ని గాల్,  కిడ్నీ స్టోన్స్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో,  మూత్రం ద్వారా వాటిని  శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతుంది. ఎలా ఉపయోగించాలంటే.. కొన్ని మామిడి ఆకులను తీసుకుని వాటిని పొడి చేయాలి. ఈ పొడిని  నీటిలో కలపాలి. ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. శరీరంలో నిల్వ ఉండే కొవ్వు స్థాయిని తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.                                       *నిశ్శబ్ద.  

వేసవిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు ఆకులు తింటే ఏం జురుగుతుందో తెలుసా?

  బిల్వపత్రి లేదా మారేడు ఆకులు దేవుడి పూజకు విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పరమేశ్వరుడి పూజకు మారేడు దళాలు ఎంతో ముఖ్యం.  ఎటువంటి ఆడంబరాలు లేకపోయినా బిల్వదళం అర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని అంటారు. అయితే బిల్వదళం కేవలం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిది.  వేసవికాలంలో ప్రతిరోజూ ఉదయమే బిల్వదళం ఖాళీ కడుపుతో తింటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలుంటాయని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అసలు బిల్వదళంలో ఉండే పోషకాలేంటి? దీన్ని వేసవిలో రోజూ ఉదయమే తీసుకుంటే కలిగే లాభాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే.. పోషకాలు.. బిల్వదళాలలో కాల్షియం,  ఫైబర్ వంటి పోషకాలు,  విటమిన్లు A, C, B1,  B6 పుష్కలంగా ఉంటాయి. ప్రయోజనాలు.. బిల్వపత్రం వేసవిలో ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే  ఉదర సంబంధ సమస్యలు ఏమున్నా అన్నీ సెట్ అవుతాయి.  గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.  మరీ ముఖ్యంగా  ఖాళీ కడుపుతో తీసుకుంటే ఫైల్స్ సమస్య ఉన్నవారికి చాలామంచిది. మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బిల్వదళాలను తీసుకుంటే అందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు  గుండెను వ్యాధుల నుండి రక్షిస్తాయి. అలాగే అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బిల్వపత్రి ఆకుల స్వభావం చల్లగా ఉంటుంది. వీటిని తీసుకుంటే శరీరం రోజంతా చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో వీటిని తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో  బిల్వ పత్రి ఆకులు తీసుకుంటే నోటిలో  పుండ్లు సమస్య తగ్గుతుంది.   డయాబెటిక్ పేషెంట్లు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో  బిల్వ పత్రి ఆకులను తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్,  ఇతర పోషకాలు మధుమేహ రోగులకు చాలా మంచివి.  అలాగే ఖాళీ కడుపుతో బిల్వ పత్రి  తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.                                          *నిశ్శబ్ద.

బ్లీడింగ్ డిజార్డర్స్ గురించి మీకెంత తెలుసు? దీని కారణాలు, రకాలేంటంటే!

మనిషి శరీరంలో ప్రాణం రక్తంలోనే ఉంటుందని అంటారు. ఏ చిన్న గాయం తగిలినా రక్తం బయటకు వస్తుంది. అయితే ఈ రక్తానికి సంబంధించి  కొన్ని  రుగ్మతలున్నాయి. వీటిని బ్లీడింగ్ డిజార్డర్స్ అని అంటారు.  బ్లీడింగ్ డిజార్డర్స్ అనేది మనిషి శరీరంలో రక్తం సరిగ్గా గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు. రక్తస్రావం జరిగిన ప్రదేశంలో రక్తం గడ్డ కట్టకుండా అధిక రక్తస్రావం జరుగుతుంది. ఈ రుగ్మతల గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రుగ్మతలు  జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.   తీవ్రమైన రక్తస్రావం రుగ్మతలలో ప్రాణాంతక రక్తస్రావం కూడా కలిగిస్తాయి. రక్తస్రావం రుగ్మతల రకాలు.. హీమోఫిలియా: హీమోఫిలియా అనేది VIII లేదా IX గడ్డకట్టే కారకాల లోపం వల్ల ఏర్పడే జన్యుపరమైన రుగ్మత. హేమోఫిలియాలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి.  హేమోఫిలియా A (కారకం VIII లోపం)     హేమోఫిలియా B (కారకం IX లోపం). వాన్ విల్‌బ్రాండ్ వ్యాధి..  వాన్ విల్‌బ్రాండ్ వ్యాధి (VWD) అనేది రక్తం గడ్డకట్టడానికి సహాయపడే వాన్ విల్‌బ్రాండ్ కారకం  లోపం లేదా పనిచేయకపోవడం వల్ల కలిగే అత్యంత సాధారణ  రక్తస్రావం రుగ్మత. ప్లేట్‌లెట్ ఫంక్షన్ డిజార్డర్స్..  రక్తస్రావాన్ని ఆపడానికి ప్లేట్‌లెట్స్ సరైన ప్లగ్‌ని ఏర్పరచలేకపోవడం ద్వారా ఈ రుగ్మతలు వర్గీకరించబడతాయి. రక్తస్రావం రుగ్మతల లక్షణాలు.. చిన్న కోతలు లేదా గాయాల నుండి అధిక రక్తస్రావం. తరచుగా ముక్కు నుండి రక్తం కారుతుంది. మహిళల్లో అధిక ఋతు రక్తస్రావం. సులభంగా గాయాలు కావడం. కీళ్ళు లేదా కండరాలలో ఎటువంటి గాయం లేకుండా రక్తస్రావం మూత్రం లేదా మలంలో రక్తం. చికిత్స ఎంపికలు... నివారణ చర్యలు..   రక్తస్రావం రుగ్మతలు లేదా విపరీతంగా రక్తస్రావం అయ్యే ప్రవృత్తి ఉన్న రోగులలు  గాయం లేదా ఆకస్మికంగా, కాంటాక్ట్ స్పోర్ట్స్/ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్లు,  గాయాలకు  దూరంగా ఉండాలి. పునఃస్థాపన చికిత్స..  తప్పిపోయిన గడ్డకట్టే కారకాలు లేదా రక్త భాగాలను భర్తీ చేయడం. డెస్మోప్రెసిన్ (DDAVP).. నిల్వ చేయబడిన వాన్ విల్లెబ్రాండ్ ఫ్యాక్టర్,  ఫ్యాక్టర్ VIII విడుదలను ప్రేరేపించే సింథటిక్ హార్మోన్. యాంటీఫైబ్రినోలైటిక్ మందులు..  రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. ఐరన్ సప్లిమెంట్స్.. అధిక రక్తస్రావం వల్ల కలిగే ఐరన్ లోపం అనీమియా చికిత్సకు ఉపయోగిస్తారు. శస్త్రచికిత్సా విధానాలు..  తీవ్రమైన కేసులకు లేదా సమస్యల చికిత్సకు ఇవి అవసరం కావచ్చు.                                               *నిశ్శబ్ద.

చల్లటి నీరు ఆరోగ్యానికి మంచిదేనా?

వేసవికాలం లో ఎండా వేడిమి తట్టుకోడానికి కాస్త ఏదైనా చల్లగా తాగాలని అందరూ అనుకుంటారు. అప్పుడే దాహం తగ్గుతుందని అనుకుంటారు.ఇంకొందరికి చల్లటి మంచినీళ్ళు అన్ని కాలాలలో తాగడం అలవాటు. చల్లటి నీళ్ళు అంటే కుండలో నీళ్ళు తాగడం కాదు,లేదా కొందరు ఐస్ ముక్కలు నీళ్ళలో వేసుకుని తాగితేనే తృప్తి అయితే ఎర్రటి ఎండలో కూల్ వాటర్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యుక్తవయస్సులో దాని ప్రభావం పెద్దగా ఉండదు కాని వయస్సు పెరిగే కొద్ది ఖచ్చితంగా దీని ప్రభావం లివర్ మీద ఉంటుందని అలాగే చల్లటి కూల్ డ్రింక్స్,కూలింగ్ లో ఉన్న ఆహార పదార్ధాలు తీసుకుంటే హార్ట్ ఎట్టాక్ కి దారి తీస్తుందని జపాన్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు జపాన్ శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో ఈ అంశాన్ని వెల్లడించారు. ఎండాకాలం లో చల్ల చల్లగా కూల్ డ్రింక్స్,బీర్లు,ఐస్ క్రీంలు,కూల్ కాఫీ,ఇవి చాలా ప్రమాదకర కరమైనవి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లని నీరు తాగడం వల్ల వచ్చే అనర్ధాలు... మన శరీర ఉష్ణోగ్రతకు సరిపడా సమాన మైన నీటిని మాత్రమే తాగాలి. గోరు వెచ్చటి నీటిని౩7 డిగ్రీల నీరు తాగాలి అలాకాకుండా కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగడం వల్ల అది పొట్టలోకి చేరి పొట్టలో ఉన్న జఠరాగ్ని చల్ల బరుస్తుంది.జఠరాగ్ని చల్ల బడిందో మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు ఈకారణం గానే పొట్టలో సమస్యలు వస్తాయి ఒక ఉదాహరణగా చెప్పాలంటే బాగా మండుతున్న పొయ్యిమీద అన్నం ఉడుకుతుంటే మధ్యలో అనిప్పులమీద నీళ్ళు పోస్తే ఏమౌతుంది పొయ్యి ఆరిపోతుంది అన్నం సరిగా ఉడకదు.జఠరాగ్ని మీద చల్లటి కూల్ కూల్ ఐస్ వాటర్ పోస్తే జఠరాగ్ని చల్లబడడమే కాదు తీసుకున్న ఆహారం అరగక పోగా శరీరం లోని అన్ని అవయవాలు పొట్టతో అనుసంధానించాబడి ఉంటాయి కాబట్టి శరీరము చల్లబడిపోతుంది అయితే సహజంగా శరీరంలో వాతావరణానికి అనుగుణంగా ఏ వేడిమి కి అయినా అడ్జెస్ట్ చేసుకుంటూ ఎదుర్కునే వ్యవస్థ ఉంది శరీరం చల్ల బడి పోకూడదు ఒక్కో సారి శరీరం చల్లబడిందా మళ్ళీ వేడిని పుట్టించాలి. కృత్రిమంగా మళ్ళీ వేడి పుట్టించాలి. చల్లటి నీళ్ళు త్రాగడం వల్ల శరీరం లో శరీరంలో మార్పులు ఏవిధంగా ఉంటాయి అంటే చల్లటి నీరు తాగిన తరువాత కడుపు చల్లని నీటి వేడి చేయాలంటే ప్రయత్నం చేస్తుంది దీనికోసం అదనపు శక్తి కావాలి.అదనపు శక్తి దానికి రక్తం నుండి లభించాలి.అంటే శరీరం లోని మిగతా అవయవాల లోని రక్తం అంత పొట్టమీద కేంద్రీకరించ బడుతుంది అంటే కొద్ది సేపు ఆయా భాగాలలో రక్త సరఫరా తగ్గుతుంది.గుండె యొక్క రక్తం పొట్టను చేరితే అప్పుడు గుండె పరిస్థితి ఏమిటి?రక్త ప్రసారం మెదడుకు రక్తం అందక పోతే ఆక్సిజన్ అందక సమస్య తీవ్రత మరింత పెరుగుతుంది. ముఖ్యంగా చల్లటి నీళ్ళు కూల్ డ్రింక్స్ తాగితే విరేచనం కాకపోగా మలబద్దకం వంటి సమస్యకు దారి తీస్తుంది.ఆతరువాత మల ద్వారం పూర్తిగా కుంచించుకు పోతుంది.అంతే కాక గ్యాస్టిక్, డయాబెటిస్, లివర్ సమస్యలు కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే చల్లటి కూల్ వాటర్ తాగక పోవడం ఐస్ ముక్కలు నీళ్ళలో వేసుకుని తాగడం ఐస్ క్రీం తినవద్దని అలాచేస్తే శరీరం సర్వనాశనం కావడం గ్యారంటీ.మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చల్లటి నీరు ఐస్ క్రీమ్ల జోలికి వెళ్ళకండి తీసుకునే ముందు దాని ప్రభావం ఏమిటో ఒక్కసారి గమనించండి.బీ హ్యాపీ బీ హేల్తీ.                                

మంజిస్టాతో రక్త శుద్ధి...

మంజిస్టా అసలు నామధేయం రుబియా కార్డిఫోలియా పెరెన్నెల్ క్లైంబర్  దీని తో  లింఫ్ ను కదిలిస్తుంది.రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం లింఫ్ అంటే రస మరియు రక్త అంటే మొదటి టిష్యూ శరీరం ఇరుకుగా కదలలేని స్థితి లో ఉంటుంది.ఎందుకు అంటే డెటొక్షిఫయింగ్ ప్రాపర్టీ అలాగే  తదనంతరం ఇతర ఇదు రకాల కణ జలాలను తీవ్ర ప్రభావితం చేయకముందే ప్రాధమిక స్థాయిలో శరీరం లోని కణజాలాలు వారసత్వంగా ఆయుర్వేదంఎందుకు ఉన్నత స్థానం ఇవ్వబడిందో లింఫ్ ఫ్లోయింగ్ లింఫ్ ఒక సీట్ లాంటిది ఇమ్మ్యున్ సిస్టమ్  ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యం గా  కనిపిస్తారు.శరీరం లోని  చర్మం పని తీరు మెరుగు పడుతుంది.శరీరంలో చర్మం పెద్ద అవయవం అది డిటోక్షిఫై చేసే అవయవం. మంజిస్ట మొక్క  చర్మం అంతా విస్థరించ గలదు. చాలా ప్రభావవంతం గా  ఆర్టిరియల్,సర్క్యు లే టరీ   సిస్టమ్,చర్మం    పై పని చేస్తుంది. మంజీస్టాదీని పేరు సాహిత్యం పరం గా దీని  అర్ధం ఎర్రటి ఎరుపు. అందుకే దీని వేరు ఎర్రగా ఉంటాయి. దీనిని ఆయుర్వేదంలో దీనిని లింఫ్ -మూవింగ్  ఈ మొక్కలో క్లీసింగ్ ప్రాపర్టీ ఇతర మొక్కల్లో ఎర్ర వెళ్ళు సీనో దస్ అమెరికనుస్ ను రెడ్ రూట్ గా పిలుస్తారు.దీనిని ఇది హై లింఫ్ మూవేర్స్ గా ఆయుర్వేదం లో  ఉన్నత స్థానం ఉందని అంటారు ఆయుర్వేద వైద్యులు.మంజీస్టా సహజంగా గుత్తి రూపం లో ఉంటుంది. దీనిని ధాతువుగా చూస్తారు. కణ జాలం అలాగే శరీరంలో ఎక్కువగా ఉన్న పిత్త తత్వాన్ని, కఫంని నిలువరిస్తుంది. మీ శరీరంలో పిత్త తత్వాన్ని సారి చేస్తుంది. ప్రత్యేకంగా రక్తం పెంచు తుంది.పిత్త తత్వాన్ని బాలన్స్ చేయడం లో మంజిస్టా ప్రతిభ లేదా  స్త్రీలలో వచ్చే నెల సరి  సమస్యల పరిష్కారం చేయడం లో స్త్రీలకు సహాయ పడుతుంది మంజీష్టా.స్త్రీలలో వచ్చే రెప్రోడక్టివ్  సిస్టమ్  ముఖ్యం గా పిల్లాల పుట్టుక లింఫ్, మంజీస్ట ను ఉత్తమ మైన మూలికగా చర్మానికి పని చేస్తుంది.చర్మం లో వచ్చే దద్దుర్లు ఇతర సమస్యలు శరీరంలోని పూర్తిగా పునర్నిర్మిస్తుంది.

హోళీ పండుగ కావాలంటే!

  హోళీకి రసాయనాలతో చేసిన మందులు వాడవద్దు, వీలైనంతవరకూ సహజసిద్ధంగా దొరికే మందులనే వాడండి. పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త, బెలూన్లను వాడవద్దు, పిల్లలని ఓ కంట గమనించుకోండి... అంటూ రకరకాల సూచనలు వినిపిస్తూ ఉంటాయి. మనం వాటిని పాటించినా, నలుగురిలోకి వెళ్లి హోళీ ఆడేటప్పుడు రసాయనాల రంగులతో ముద్ద కాక తప్పుదు. అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకుని తీరాల్సిందే... ఇలాంటి బట్టలు హోళీ అడేటప్పుడు పాతబట్టలు వేసుకున్నామో లేదో గమనిస్తామే కానీ... అవి రంగుల నుంచి ఏమేరకు అడ్డుగా నిలుస్తాయో పట్టించుకోము. హోళీ అడేటప్పుడు ఒంటిని వీలైనంత కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. అవి కూడా కాటన్ దుస్తులైతే మరీ మంచిది. ఎందుకంటే పాలిస్టర్ బట్టల మీద పడిన రంగులను అవి పీల్చుకోవు సరికదా... వాటి మీద మరోసారి నీటిని కుమ్మరించగానే ఆ రంగులన్నీ మళ్లీ ఒంటి మీదకి జారతాయి. శరీరానికి తగినంత తేమ పొడబారిన చర్మం మీద పడే రంగుల చర్మరోగాలకు దారితీస్తాయి. అందకనే చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. అందుకోసం ఒంటినిండా కాస్త నూనెని పట్టించడం మేలు. అది మరీ అతిగా కనిపిస్తుందనుకుంటే... అందుబాటులో ఉన్న మాయిశ్చరైజింగ్ లోషను ఏదన్నా రాసుకోవచ్చు. జుట్టు పాడవకూడదనుకుంటే, తలకి మాత్రం నూనె పట్టించాల్సిందే! ఇక హోళీ ఆడేముందు వీలైనంత మంచినీరు తాగడం వల్ల చర్మం లోపలినుంచి తేమగా ఉంటుంది. అదే పనిగా తిరగొద్దు హోళీ ఆడిన తరువాత చాలామంది అవే రంగులతో గంటల తరబడి కాలక్షేపం చేస్తుంటారు. కానీ వీలైనంత త్వరగా ఆ రంగులను వదిలించుకోవడమే మేలంటున్నారు. పైగా ఒంటినిండా రంగులతో ఎండలో కనుక తిరిగితే వాటిలోని రసాయనాలు మన చర్మానికి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... హోళీ ఆడిన వెంటనే నేస్తాలకు గుడ్బై చెప్పేసి స్నానం చేసేయమంటున్నారు. నయనం ప్రధానం కాపర్ సల్ఫేట్, మెర్యురీ, లెడ్, క్రోమియం.... ఇలా హోళీ రంగుల కోసం వాడే రసాయనాల జాబితా చాలా పెద్దది. ఇవి నోట్లోకి వెళ్లినా, కంట్లో పడినా కూడా హాని జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. అందుకనే కళ్లజోడు పెట్టుకుని హోళీ ఆడితే మంచిది. అలా కుదరని పక్షంలో కంట్లో ఏవన్నా రంగులు పడినప్పుడు, వెంటనే వీలైనంత నీటితో కంటిని కడుక్కోవాలి. కళ్లని శుభ్రం చేసుకున్న తరువాత కూడా కళ్లు మండుతున్నా, కళ్ల వెంబడి నీరు కారుతున్నా, దృష్టి మసకగా ఉన్నా... వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాల్సిందే! స్నానం ఇలా హోళీ ముగిసిన తరువాత చేసే స్నానం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒంటి మీద పడిన రంగులను తక్షణం శుభ్రం చేసుకునేందుకు చాలామంది పెట్రోల్, కిరసనాయిల్ వంటి పదార్థాలు వాడతారు. వీటితో చర్మం మరింత పొడిబారిపోతుంది. వీలైతే మామూలు సబ్బుతో కాకుండా పిల్లల సబ్బుతో రుద్దుకోవడం మంచిదంటారు. స్నానం ముగిసిన తరువాత కూడా మరోసారి ఒంటికి మాయిశ్చరైజింగ్ లోషను పట్టిస్తే మరీ మంచిది. - నిర్జర.

హోలీ రంగుల వల్ల పొంచి ఉన్న ప్రమాదం!

హోళీ ఓ రంగుల పండుగ. కానీ అజాగ్రత్తగా ఉంటే, అవే రంగుల ఇతరుల జీవితాలలో చీకటిని నింపుతాయని హెచ్చరిస్తున్నారు. పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచీ అంతా కలుషితం అయిపోతున్న ఈ రోజులలో, హోళీ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ చవకగా దొరికే రంగుల గురించి చెప్పేదేముంది. మరి హోళీలో వాడే రంగులలో ఎలాంటి రసాయనాలు ఉంటాయో, వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలో ఆలోచించాల్సిందే రంగు – ఆకుపచ్చ ఉపయోగించే రసాయనం – కాపర్ సల్ఫేట్. విషప్రభావం – కొంట్లో పడితే చాలా ప్రమాదకరం. కళ్లు నీరుకారడం, ఎర్రబడటం, వాయడం జరగవచ్చు. ఒకోసారి తాత్కాలికంగా చూపు కూడా కనిపించకుండా పోవచ్చు. రంగు – ఎరుపు ఉపయోగించే రసాయనం – మెర్క్యురీ సల్ఫేట్. విషప్రభావం – చర్మం మీద ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకోసారి చర్మ కేన్సర్కు కూడా దారితీయవచ్చు. గర్భిణీల శరీరంలోకి కనుక ఇది చేరితే వారి కడుపులో ఉన్న శిశువు ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఒకోసారి ఆ శిశువుకి ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఈ రసాయనం. రంగు – నీలం ఉపయోగించే రసాయనం – ప్రష్యన్ బ్లూ. విషప్రభావం – మాడు మీదా చర్మం మీదా దద్దుర్లు. రంగు – సిల్వర్ ఉపయోగించే రసాయనం – అల్యూమినియం బ్రొమైడ్. విషప్రభావం – చర్మం, ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావం. కేన్సర్ కారకం. రంగు – నలుపు ఉపయోగించే రసాయనం – రెడ్ ఆక్సైడ్. విషప్రభావం – మూత్ర పిండాల మీద ప్రభావం. గర్భస్రావం అయ్యే ప్రమాదం. చాంతాడంత జాబితా! గులాల్ పొడులలో లెడ్, క్రోమియం, కాడ్మియం, నికెల్, జింక్, సిలికా, మైకా... వంటి నానారకాల రసాయనాలూ కలుస్తాయని తేలింది. వీటిలో ఒకో రసాయనానిదీ ఒకో దుష్ఫ్రభావం! ఇక హోళీ రంగులు మెరిసిపోతూ ఉండేందుకు వాటిలో గాజుపొడి కలుపుతారన్న ఆరోపణమూ వినిపిస్తున్నాయి. పేస్టు లేదా ద్రవరూపంలో ఉండే రంగులది మరో సమస్య. వీటిలో ఇంజన్ ఆయల్ వంటి చవకబారు ద్రవాలను కలిపే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలతో ఆరోగ్యం ఎలాగూ దెబ్బతింటుంది. హోళీ రోజున అవి నీటిలోనూ, నేలమీదా పడితే పర్యావరణం కూడా దెబ్బతింటుంది. కొత్త పోకడలూ ప్రమాదమే! ఇప్పుడు కొత్తగా హోళీ రంగులను చల్లుకునేందుకు చైనావారి పిచికారీలు దొరుకుతున్నాయి. వీటికి తోడు రంగులతో నింపిన బెలూన్లు కూడా లభిస్తున్నాయి. అసలే రసాయనాలు... ఆపై వాటిని వేగంగా చల్లేందుకు పరికరాలు. దీంతో ఏ రంగు ఎవరి కంట్లో పడుతుందో, అది ఎవరి జీవితాన్ని చీకటి చేస్తుందో తెలియని పరిస్థితి. ఒక్కసారిగా మీదపడే బెలూన్ల వల్ల ఒకోసారి వినికిడి కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రంగుకీ ఓ  ప్రత్యామ్నాయం హోళీలో ఇతరులు చల్లే కృత్రిమమైన రంగుల నుంచి జాగ్రత్తపడటం ఒక ఎత్తు. మనవరకు మనం అలాంటి రంగుల జోలికి పోకుండా సహజసిద్ధమైన రంగులు వాడటం మరో ఎత్తు. ప్రతి ఇంట్లోనూ దొరికే పసుపు, కుంకుమ, చందనం, బొగ్గు లాంటి రంగులు పదార్థాలు ఎలాగూ బోలెడు రంగలకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇక ఆకుకూరలు, గోరింట పొడి, బీట్రూట్, కరక్కాయలు, మందారపూలు, నేరేడు పండ్లు లాంటివాటితో చాలా రంగులే సిద్ధమవుతాయి. కాస్త ఓపిక చేసుకుంటే తేలికగా అమరిపోయే సహజసిద్ధమైన రంగులను వదిలేసి ఏరికోరి రసాయనాలు కొనితెచ్చుకోవడం ఎందకన్నదే పెద్దల ప్రశ్న! - నిర్జర.  

రోజూ రెండు సార్లు దంతాలు శుభ్రం చేసుకోవాలా? అలా చేయకుంటే ఏం జరుగుతుందంటే!

  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఓ సామెత ఉంది. అదే విధంగానే నోటి ఆరోగ్యం బాగుంటే శరీరం కూడా చాలా వరకు ఆరోగ్యంగానే ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నోటి ఆరోగ్యం గురించి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. నోటి దుర్వాసన, పంటి నొప్పి, చిగుర్ల సమస్యలు వంటివి ఎదురైనప్పుడు, పళ్లు చాలా సున్నితంగా మారిపోయినప్పుడు తప్ప చాలామంది దంతవైద్యులను సంప్రదించడం, దంత సంరక్షణ తీసుకోవడం చేయరు.  అయితే నోటి ఆరోగ్యం, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే  రోజూ రెండుసార్లు పళ్లు తోముకోవాలని అంటున్నారు దంత సంరక్షణ నిపుణులు. ఈ అలవాటు వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. కావిటీస్ ..   రోజూ రెండు సార్లు  పళ్ళు తోముకోవడం వల్ల చెడు బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశాలు తగ్గుతాయి. అదేవిధంగా ఆహారం తీసుకున్నప్పుడు  దంతాల మధ్య ఇరుక్కున్న  ఆహారం తాలూకు అవశేషాలు తొలగించడంలో సహాయపడుతుంది. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారం నమూలాలు చెడు బ్యాక్టీరియాను, ఈ చెడు బ్యాక్టీరియా యాసిడ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది దంతాల ఎనామిల్‌ను క్షీణింపజేస్తుంది. ఇది దంత క్షయానికి కారణమవుతుంది. చిగుళ్ల వ్యాధి..   రెగ్యులర్ గా రోజుకు రెండుసార్లు బ్రషింగ్ చేయడం వల్ల చిగుళ్ళలో మంట,  ఇన్ఫెక్షన్ కలిగించే ఫలకం,  బ్యాక్టీరియాను తొలగించడం సాధ్యమవుతుంది. ఇవి  చిగుళ్ల వ్యాధిని నివారించడంలో సహాయపడతాయి. చిగుళ్ల వ్యాధి చికిత్స చేయకుండా వదిలేస్తే దంతాలకు నష్టం వాటిల్లి  తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్..   ఇప్పట్లో చాలామంది  ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌తో బ్రష్ చేస్తుంటారు.  మాన్యువల్ టూత్ బ్రష్‌తో పోల్చితే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు నోటిని పూర్తిగా శుభ్రపరచడంలో మరింత ప్రభావవంతంగా ఉంటాయి. సాధారణ దంత పరీక్షలు.. రెగ్యులర్ గా రోజుకు రెండు సార్లు  బ్రషింగ్ చేయడం నోటి పరిశుభ్రతను పెంచుతుంది. అలాగే  మొత్తం దంత ఆరోగ్యాన్ని  కాపాడుతుంది. దంతసంరక్షణలో భాగంగా అప్పుడప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉంటే దంతాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు అయినా ముందుగానే తెలుసుకుని వాటికి తగిన నివారణా చర్యలు తీసుకోవచ్చు. దంతాల నష్టం .. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ద్వారా దంతాల మీద ఏర్పడే  ఫలకం,  బ్యాక్టీరియాను క్రమం తప్పకుండా తొలగించడం సాధ్యమవుతుంది. దీనివల్ల  క్షయం లేదా చిగుళ్ల వ్యాధి కారణంగా దంతాలకు కలిగే  నష్టాన్ని నివారించవచ్చు. దంతాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, దంతాలకు కలిగే నష్టాన్ని ముందుగానే తెలుసుకుని నివారించాలన్నా నోటి శుభ్రత, నోటి సంరక్షణ చర్యలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం.                                                        *నిశ్శబ్ద.

కొవ్వు పదార్థాలు గుండెకి మంచిదేనా?

నూనె పదార్ధాలు,బాగా కొవ్వు ఉన్న పదార్ధాలు తింటే హై బిపి గుండె జబ్బులకు దారి తీస్తుందని.అందరికీ తెలుసు.అసలు ఎలా ఏర్పడుతాయో తెలుసా? మనం తీసుకునే ఆహారం లోనే కొవ్వు కడుపులోకి చేరుతుంది,కలిసి పోతుంది. అది రాక్తనాలాలకు చేరుతుంది.కొన్నాళ్ళు గడిచాక రాక్తనాళా లలో చేరి నిలువ ఉంటుంది కొవ్వు రక్త నాళాల లోపలి గోడల మీద పేరుకుంటుంది. ఇలా పేరుకు పోవడం మూలంగా రక్తనాళాల లోపలి మార్గం ఇరుకుగా ఉండి దీనితో రక్త నాళం లో రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడి అది హై బిపి కి దారి తీస్తుంది. ముఖ్యమైన అవయవాలకి చేరాల్సిన రక్త ప్రవాహానికి అవరోదం ఏర్పడే సరికి రకరకాల జబ్బులు ఏర్పడతాయి ఆజబ్బులు ఈ క్రింది రకాలుగా వుంటాయి. గుండెకు రక్తాన్ని తీసుకు పోయే రక్త నాళాలు ఇరుకుగా ఉండడం తో చాతిలో నొప్పి వస్తుంది. గుండెకు రక్తాన్ని తీసుకు పోయే రక్త నాళం ఏదైనా పూర్తిగా పూడిపోతే పక్షవాతం వస్తుంది. శరీరంలోని ఏదైనా అవయవానికి రక్తాన్ని తీసుకుపోయే నాళం పూడుకుపోయినా గాంగ్రీన్ ఏర్పడుతుంది. ఆయా కుటుంబాలలో ఎవరికన్నా గుండెజబ్బులు లేదా హై బిపి లాంటివి వున్న వాళ్ళు తాము తీసుకునే ఆహారంలో కొవ్వు తక్కువ వుండేట్లు గా చూసుకోవడం చాలా అవసరం. గుండె కవాటం మూలంగా,లేదా గుండే కవాటం లోపం మూలంగా కూడా రక్త నాళాలలో సమస్యలు రావచ్చు.

కాలి పిక్కల నొప్పికి కారణాలు..

  మీ కాళ్ళ లో పిక్కలలో నొప్పులు ఉంటె అది పెరిఫెరల్ హార్ట్ డిసీజ్ అని మీకు తెలుసా?... మీ కాళ్ళలో క్రామ్ప్స్ వస్తే అది ప్యాడ్ కావచ్చు స్ట్రాన్ ఫర్డ్ కు చెందిన ఒక ప్రముఖ నటుడు జాసన్ గ్రే హస్రత్ ఫైల్యూర్ అయ్యింది. గిన్నెలు శుభ్రం చేస్తున్న ఒక వృద్ధురాలికి గుండె ఏమైంది. దీనికి కారణం ఏమిటి ఈ అంశం పై మరింత సమాచారం మీకోసం. మీ కాళ్ళలో క్రామ్ప్స్ వస్తున్నాయా? మీరు వ్యాయామం చేస్తున్న ప్పుడు మీ కాళ్ళు మరింతగా నొప్పికి గురి అయ్యుంది అంటే అది ప్యాడ్ అని అంటున్నారు నిపుణులు. ప్యాడ్ అంటే... ప్యాడ్ అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ దీనిని తక్షణం పరీక్షించుకోవాలి.అని నిపుణులు సూచిస్తున్నారు.పెరిఫెరల్ హార్ట్ డిసీజ్ రావడానికి కారణం మీ ఆర్టరీ లో ఫ్లాక్స్ వృ ద్ది కావడమే. అలా మీ కాళ్ళలో ఫ్లాక్స్ ఉంటె అది మీ రక్త ప్రసారానికి నియంత్రిస్తుందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వృద్ధులు 6౦ -నుండి 7౦ సంవత్సరాల వారి పై దీని ప్రభావం 1౦ %మాత్రమే  ఉంటుంది.ప్యాడ్ తీవ్రంగా ఉన్న కేసుల్లో ఫ్లాక్స్ లేదా క్లాట్స్ వల్ల ఒక్కోసారి కాలు తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. అని అంటున్నారు  పెంస్ట్ ల్ కు చెందినా డాక్టర్ మేత్యుస్ సిం డ్రిక్ వ్యాస్క్యులర్ సర్జన్. ఈ విషయం స్పష్టం చేసారు. ప్యాడ్ -లక్షణాలు... ప్యాడ్ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ తోలిదశలో లక్షణాలు కనపడవు. సహజంగా తరచుగా కాళ్ళలో నొప్పి వస్తూ ఉంటుంది.కారణం మీ కండరానికి సరిపడా ఆక్సిజన్ లేదా న్యుట్రీ షియన్  అందకపోయి ఉండవచ్చు. ప్యాడ్స్ బాగా వృద్ది చెందితే చాలా తీవ్రంగా ఉంటుంది. ఫ్లాక్స్ ఒక కాలు,లేదా రెండు కాళ్ళ లోనూ రావచ్చు.వ్యాయామం  చేస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు తీవ్రంగా నొప్పి రావచ్చు. కారణం మీ కండరాలకు ఆక్సిజన్ అందక పోవడమే అది మరింత వృధీ చెందితే అక్కడ గాయాలు మొదలు అవుతాయి. ఆప్రదేశంలో గడ్డలు ఫ్లాక్స్ ఏర్పడతాయి. లేదా పాదాలలో గాయం మానదు. అదే పనిగా కాళ్ళలో నొప్పులు వస్తే లేదా కాళ్ళ లో స్పందన లేకపోవడం తిమ్మిరి పట్టింసట్లుగా ఉంటె అది గ్యాంగ్రిన్ కావచ్చు. వ్యాస్క్యులర్ సమస్యలు పెరుగుతూ పోతాయి.సరైన నిర్ధారణ డయాగ్నోసిస్ లేకుండా రోగులకు గాయాలు అయినవారికి పదాలలో వచ్చే గాయాలు మానవు. ఈ అంశం పై సిండ్రిక్ పెన్ స్టేట్ విడుదల చేసింది. ప్యాడ్ ను సత్వరం గుర్తించిన వెంటనే దానిని మధ్యలోనే చికిత్స చేయాలి.ప్యాడ్ కు సంబందించిన లక్షణం కనపడగానే మీరు మీ డాక్టర్ ను సంప్రదించాలి. అది మీరు తీసుకునే ఆహారం లో మార్పులు వ్యాయామం మందులు పద్దతులు ఉపయోగించి బ్లాక్  అయిన  ఆర్టరీ కి చికిత్స చేస్తారు. ప్యాడ్ లో మీ జన్యుపరమైన అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి 5 గురిలో 4 గురికి ప్రమాదం లో ఉన్నట్లే. పొగ త్రాగడం హై బిపి కొలస్త్రాల్ హై బ్లడ్ షుగర్ డయాబెటీస్ ఉంటె ప్రామాదమే అని అంటున్నారు. నిపుణులు. పొగ తాగారో అది మీ కాళ్ళ నొప్పులు ఫ్లాక్స్ ను దగ్గరుండి మరీ నడిపిస్తుంది. ప్యాడ్ ఉన్న వారిలో ఒక వేళ రక్త ప్రవాహం నిలిచిపోతే వ్యాయామం చేయడం ముఖ్యం . ఈ సమస్యనుండి బయట పడడానికి డాక్టర్ ను సంప్రదించాలి శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే దీర్ఘకాలిక ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. కాళ్ళ నొప్పులే కదా అని నిర్లక్ష్యం చేసారో భారీ మూల్యం తప్పదు.                                      

మూడ్‌కి ఆహారానికి సంబంధం ఏమిటి?

మనిషి ఒక్కో సారి ఒక్కో మూడ్ లో ఉంటాడు. గురువుగారు మంచి  మూడ్ లో ఉన్నారు. లేదా మూడ్ బాగాలేదు అని సహజంగా వింటూ ఉంటాం.అయితే వ్యక్తి మూడ్ లో ఉండాలంటే  ఆహారమే కీలకం అని అంటున్నారు నిపుణులు. మనిషిని మూడ్ లో ఉంచేది అవుట్ అఫ్ మూడ్ కు తీసుకు పోయేది ఆహారమే అంటున్నారు. మన మూడ్ ను సరి చేసేది మనం తీసుకునే ఆహారామే అంటున్నారు నిపుణులు. అసలు ఆహారానికి మూడ్ కు సంబంధం ఏమిటి?అన్నదే ప్రశ్న? మీరు ఎప్పుడైనా ఆకలిగా ఉందని భావించారా? ఉదయం కాని,సాయంత్రం కాని,రాత్రి కాని  ఆకలి వేసి ఉండవచ్చు.అసలు మనిషికి ఆకలి లేని వారు అంటూ ఉండరు. చివరి సారి మీరు ఏమి తిన్నారు?అన్న విషయం చాలా ఆసక్తిగా ఆలోచిస్తారు.? అలా అనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి,అవి పాస్తా,కావచ్చు,కేక్ కావచ్చు,క్యాండి  కావచ్చు.క్యాండీ మిమ్మల్ని ఎప్పుడూ మూడ్ లో ఉంచదు.అయితే మీ ఒక్కరేకాదు. ఒక పరిశోదన ప్రకారం కొన్ని ఆహార పదార్ధాలు తినాలని అనిపిస్తాయి.కొన్ని మనల్ని భయ పెడతాయి. కొన్ని ఆహార పదార్ధాలుకార్బన్లు  తీసుకోవడం వల్ల చక్కెర శాతం పెంచుతాయి.మనం దానిపై దృష్టి  పెట్టం కొన్ని సందర్భాలలో ఆహారం తీసుకున్నాక అలిసి పోయేట్లు చేస్తాయి.ఇక అసలు విషయం  ఏమిటి అంటే  పెరుగు మన మూడ్ ను పెంచుతుంది అంటారు. మరో పరిశోదనలో పళ్ళు తినడం ద్వారా కూరగాయలు శాఖాహారం తీసుకోవడం వల్ల ప్రోటీన్  శాతం తగ్గడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మరో పరిశోదనలో మీరు తీసుకునే పెరుగు వల్ల సెరొటోనిన్ న్యూరో ట్రాన్స్ మీటర్ గా పనిచేస్తుంది.దీని ప్రభావం తో  మన ఫీలింగ్స్ భావాలు వ్యక్తం అవుతాయి.దీనివల్ల ఆనందం ఆరోగ్యం గా ఉంటాయి. మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటారో అది అలాంటి ప్రభావం చూపిస్తుంది.అనే విషయాన్నీ దీనివల్ల వచ్చే ప్రభావం  12 రోజుల్లో చూడవచ్చు. మన శరీరంలో ఆహారం  వల్ల వచ్చే ప్రభావం ఉంటె మీ ఆహారం లో మార్పులు చే సుకోవచ్చు. ఆహారం వల్ల  మనం ఎదుర్కునే సవాళ్ళు... మీ భోజనం లో ఆహారం తీసుకునే సమయం నుంచి మూడ్ ట్రాకింగ్ జర్నల్ లో రాయండి మీరు ఏమి తీసుకున్నారో ఏమి తీసుకోలేదో  ప్రతి రోజూ అది కొన్ని నిమిషాలు మాత్రమే  మా ఆహారంలో ఉండే చాయిస్ మీకు అవగాహన కల్పిస్తుంది.అసలు మనం ఏం తింటున్నాం? ఎందుకు తింటున్నాం?అన్న విషయం తెలుస్తుంది.అవగాహన కలుగుతుంది. ఈ అంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మీరు వేసుకోండి. మీరు ఏం తింటారు?భోజనం తరువాత మీరు తీసుకునే స్నాక్స్ అల్పాహారం ఏం తీసుకుంటారు? ఒక వేళ మీరు తినేంత సమయం లేకుంటే ఒక ఫోటో తీసుకుని రికార్డ్ చేయండి.అది మీకు కొంత మేర  మీకు సహకరిస్తుంది.అన్న విషయాన్ని ఒక జర్నల్ గా లేదా నోట్ యాప్,ఫుడ్ ట్రాకర్ ను మీ ఫోన్ లో తయారు చేసుకోండి తినక ముందు మీ  ఫీల్ ఏమిటి? ఎలా ఉన్నారు? ఏ సమయంలో మీకు ఆకలి వేసింది.?ఒంటరిగా ఉండాలని అనిపించింది?.ఒత్తిడికి గురి అయ్యారా? అలా ఉండడానికి మీరు తీసుకున్న ఆహారం కావచ్చు. అది మిమ్మల్ని ప్రభావితం చేసి ఉండవచ్చు,లేదా మీరు ఆహారం తీసుకున్నప్పుడు అలసటగా భావించారా? మీరు ఏ అహారాం థేసుకున్నప్పుడు తీపి పదార్ధాలు స్వీట్స్ ఇతర పదార్ధాలు మీ పంటిని ప్రభావితం చేసాయి. ఒత్తిడికి గురికావడానికి ఉప్పు పదార్శాలు చిప్స్,వేపుళ్ళు,వంటి పదార్ధాలు మీ ఫీలింగ్స్ గుర్తించ వచ్చు. ఫీలింగ్స్ కి ప్రవర్తనకి సంబంధం ఉందా ఇది మార్పుగా భావించాలి. తిన్న తరువాత మీరు ఎలా ఫీల్ అవుతారు... ఉదాహరణకి మీరు తీసుకున్న ఆహారం మీకు శక్తి నిచ్చిందా?లేక స్వాంతన చేకురిందా, త్రుప్తి నిచ్చిందా? అనందం కలిగించిందా?మీ మూడ్ ను ఆహారం ఏరకం గా ప్రభావితం చేసింది. దీనిప్రభావం వల్ల భవిష్యత్తులో తెలివైన నిర్ణయం తీసుకోగల నిర్ణయానికి సహకరిస్తుంది. కొంత మంది నిపుణులు  నిర్వహించిన సర్వేలో మనం తీసుకునే ఆహారం మనమూడ్ ను  ప్రభావితం చేస్తాయని నిర్ధారించారు.

ఈ గడ్డి రసం రోజూ తాగితే..

ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి జబ్బులు దరిచేరవు అంటూ పరిశోధకులు, ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రజల్లో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెరిగింది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది గోధుమగడ్డి.   ఇంటిల్లిపాదికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేది గోధుమ గడ్డి. గోధుమగడ్డి జ్యూస్ రోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రక్తహీనతను చాలా వేగంగా తగ్గిస్తుంది. అంతే కాదు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్ని గ్రీన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. గింజల్లో కన్నా మొలకెత్తిన గింజల్లో పోషకాలు ఎలా ఎక్కువ శాతంలో ఉంటాయో అదే విధంగా  గోధుమ గడ్డిలో మిగతావాటి కంటే చాలా రెట్లు ఎక్కువగా పోషకాలు ఉంటాయి. వెజిటబుల్ సూప్ లో కన్నా గ్రీన్ గోధుమ గడ్డి రసంలో రక్తవృద్ధికి తోడ్పడే పోషకాలు 8-9 రెట్లు ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.   గోధుమ గడ్డిని ఇంట్లో పండించుకోవడం చాలా సులభం. అందుకు కావాల్సింది కొబ్బరి పొట్టు, వర్మికంపోస్ట్ లేదా కొద్దిగా మట్టి కంపోస్టు, కలిపిన మిశ్రమం. మూడు నాలుగు అంగుళాల లోతు ఉన్న చిన్న ప్లాస్టిక్ గిన్నెలు, డబ్బాలు, ట్రేల్లోనూ పెంచుకోవచ్చు. వారం పది రోజుల్లో గోధుమగడ్డి కావలసిన ఎత్తు పెరిగి జ్యూస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రోజూ వరుసగా ఒక్కొక్క ట్రేలో గోధుమ గింజలు చల్లుతూ ఉంటే పది రోజుల తర్వాత రోజూ గోధుమ గడ్డి కోతకు వస్తుంది. గింజలు రాత్రంతా నానబెట్టి తేమ ఆరిపోకుండా ఉండేలా అవసరం మేరకు నీళ్లు చిలకరిస్తే చాలు. ఇంకో విషయం ఏంటంటే గోధుమ గడ్డికి  ఎండ అసలు తగలకూడదు. నీడలోనే పెంచుకోవచ్చు. ఐదు లేదా ఆరు అంగుళాల ఎత్తు పెరిగిన గోధుమగడ్డి ని కత్తిరించి మిక్సీలో వేసి రసం తీసి తాగాలి. అన్ని వయసుల వారు దీన్ని తాగొచ్చు.

ఉల్లి తో ఇన్ని లాభాలా?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న నానుడి ఎలా వచ్చిందో తేలియదు గాని ఉల్లి వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఉల్లి కేవలం ఆహారంలో భాగం మాత్రమే కాదు పోష కలా భాలు ఉన్నాయి . అంటున్నారు నిపుణులు. ఉల్లి కేవలం ఆహారం లో భాగం మాత్రమే కాదు సంపూర్ణ పోషకాలు ఉన్నాయని అంటున్నారు. వితమిన్ సి...ఉల్లి అందరూ అంగీకరించినట్లుగా ఇది మంచి పోశాకమని శరీరానికి అవసరమైన విటమిన్ సి అందిస్తుందని తద్వారా మనం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. శరీరంలోని రక్త నాళాల ఇతర భాగాలాకు సరిగా పనిచేసేవిధంగా చేస్తుంది. యాంటి ఆక్సిడెంట్ పని చేస్తుంది. రాడికల్స్ పై పోరాడే గుణం ఉల్లికిఉంది ఏ మాలిక్యుల్స్ అయితే కొన్ని సార్లు నాశనం చేస్తాయో అప్పుడు నిపుణులు విటమిన్ సి మిల్లి గ్రాములలో సూచిస్తారు. అది ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒక్క ఉల్లి పాయలో 1% నుండి 18 % వరకు ఉంటుంది. పీచు పదార్థము...ఉల్లిపాయలో రెండు రకాల పీచు పదార్దాలు ఉంటాయి. డై టెరీ ఫ్రీ బయోటిక్ ఒక కప్పులో 12% 2 1 నుంచి 38 గ్రా మీకు రోజూ అవసరం. అవుతుంది.పీచు పదార్ధం శరీరంలో ప్రతిరోజూ బౌల్ కదలికలు ఉండడం అవసరం. మీకు కడుపు నిండి నప్పుడు చాలా తక్కువగా తింటారు. అప్పుడు మీకు ఊబ కాయం తగ్గుతుంది. ఉల్లిలో ఫ్రీ బయోటిక్ మీ గత ను బ్యాక్టీరియా ను కలిగిఉంటుంది.యాంటి ఆక్సిడెంట్...అన్ని ఉల్లిపాయాలలో క్వార్ స్టాన్ ఫ్లావోనాయిడ్స్ లేదా యాంటి ఆక్సిడెంట్ కాంపౌండ్ క్వార్టిన్ లో యాంటి ఇంఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి శరీరానికి సహకరిస్తాయి. విటమిన్ ఇ సంరక్షిస్తుంది. క్యాన్సర్ ప్రతి ఉల్లి పాయనుంచి ఆక్సిడెంట్ ఎరుపు,పసుపు తెల్ల ఉల్లిపాయాలలో పూర్తి పోషకాలు ఉంటాయని అంటున్నారు. విటమిన్ బి 6 ఒక మీడియం ఉల్లిపాయాలో 8% ప్రతిరోజూ విటమిన్ బి6 శరీరానికి సహకరిస్తుంది. ఉల్లి తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ది ప్రోటీన్ నిరోదిస్తుంది. ఉదయం సాయంత్రం వేళ లో స్త్రీలు ఎదుర్కొనే సిక్ నెస్ నుండి బయట పడడానికి సహకరిస్తుంది. పచ్చి ఉల్లిపాయా ఆరోగ్యకరం... పచ్చి ఉల్లిపాయ ను తినడం వల్ల లాభాలు ఉన్నాయి. సలాడ్ లో ఆమ్లెట్ లేదా సాంద్ విచ్ లో గుండ్రంగా కోసిన ఉల్లిపాయాలు చాలా నెమ్మదిగా కొరికి తినడం వల్ల మంచి పీచు పదార్ధము ఉంటుంది. వండినా లేదా  వేయించిన ఉల్లిపాయాలు చెడుపు చేస్తాయి. అందులో పోషకాలు ఉండవని అంటున్నారు నిపుణులు. ఎర్ర ఉల్లి పచ్చడి... సన్నగా కోసిన ఎర్ర ఉల్లి పాయాను రెడ్ వైన్ లో లేదా వెనిగర్ లో కొంచం ఉప్పువేసి 15 ని మిషాలు ఉంచి ప్రతి 5 నిమిషాలు కట్ చేయండి. బర్గర్స్ లో సలాడ్స్ లో కొన్ని కొన్ని ఆహారాలలో ముఖ్యంగా బకింగ్ ఐటమ్స్ లో బాగుంటాయి. మీకిష్టమైన వాటితో ఫిల్ చెయ్యండి... సన్నగా తరిగిన ఉల్లిపాయలు. వాటిపై కొంచం మిరియాల పొడి మీకు నచ్చిన ప్రోటీన్ ఆయిల్ కొంచం సోడియం సోయా, బ్రౌన్ రైస్ సల్సా సోర్ కరీం బోనస్ గా పచ్చి ఉల్లిపాయాని గ్యుకమోల్ తో కలిపి తింటే ఆ రుచివేరు అంటారు ఆహారా ప్రియులు.  నాన పెట్టి తినాలి... ఉల్లిపాయా కోసినప్పుడు కంటినుంచి నీటిని తెప్పిస్తుంది. అది పచ్చి ఉల్లిపాయ కోసినప్పుడు చాలా ఘాటుగా అనిపిస్తుంది.వాటిని సనాగా కోసి చల్లని నీటిలో చల్లని ప్రదేశంలో 3౦ నిమిషాలు ఉంచండి వాటి ఘాటు పవర్ తగ్గి దానిఅసలు మూలం పోకుండా ఉంటుంది. ఉల్లిని ఎలా నిల్వచేయాలి... మీరు మీ ఇంట్లో ఉల్లిని నిల్వ చేసినప్పుడు చల్లటి ప్రదేశంలో ఉంచండి. కాస్తగాలి ఉండే ప్రదేశంలో ఉల్లిని నిల్వ ఉంచండి.ఒకాసారి కోసిన చీల్చిన వాటిని మాత్రమే ఫ్రిజ్ లో ఉంచండి 7 నుండి 1౦ రోజులు ఆలు కు దూరంగా ఉంచండి. అన్నిటికన్నా ప్రసస్తంగా ఉండాలంటే పురుషుల లో సామార్ధ్య్సాన్ని పెంచేది ఈ ఉల్లే. కాబట్టి అన్నిరాకల ఆరోగ్య విలువలు ఉన్న ఉల్లి సర్వాత్రా మేలు చేస్తుందనేది నిపుణులు చెపుతున్న మాట.  

మధుమేహం ఉన్నవారు ఈ ఒక్క కూరగాయను డైట్ లో ఉండేలా చూసుకుంటే చాలు!

ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడతాయి.. వీటిలో ఎన్నోరకాల విటమిన్లు, ఖనిజాలు మరియు పోషకాలు ఉంటాయి, ఇవి తీవ్రమైన జబ్బుల నుండి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే కొన్ని కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. మధుమేహం యొక్క సమస్యలను తగ్గించడంలో  కూరగాయలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి కూరగాయలలో ఎంతో శక్తివంతమైనది బెండకాయ. డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా బెండకాయ తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఈ కూరగాయలలో కేలరీలు, కొవ్వు రెండూ తక్కువగా ఉంటాయి, ఇది మధుమేహానికి ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్నవారు బెండకాయ తీసుకుంటే..  రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిచడం బెండకాయ వల్ల ఎంతో సులువు. కాల్చిన బెండకాయ విత్తనాలు మధుమేహం చికిత్సకు టర్కీలో చాలా కాలంగా ఉపయోగించబడుతున్నాయి. రక్తంలో చక్కెరను తగ్గించడంలో కూడా ఇది సానుకూల ప్రభావాలను చూపుతుంది. బెండకాయ మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎందుకు మంచిదంటే.. బెండకాయలో  ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారాలు జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా ఆకలి బాధలను తగ్గించి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల, బెండకాయలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. బెండకాయలు రక్తంలో గ్లూకోజ్-తగ్గించే శక్తివంతమైన కూరగాయ. బెండకాయను మాత్రమే కాకుండా బెండకాయ విత్తనాలను పొడిగా చేసి తీసుకోవడం వల్ల కూడా మధుమేహం తగ్గించుకోవచ్చు.  డయాబెటిస్‌లో మాత్రమే కాకుండా బెండకాయ చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బెండకాయలో విటమిన్-ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి క్యాన్సర్, డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.  ఇది కండరాలు, నరాల పనితీరును మెరుగుపరిచి అవి ఆరోగ్యంగా ఉండటంతో సహాయపడుతుంది. కాబట్టి బెండకాయను వీలైనంతగా ఆహారంలో భాగం చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.                                          ◆నిశ్శబ్ద.

దంత సంరక్షణ ఎంత ముఖ్యం?

ఉదయం లేవగానే అందరూ చేసే పని పండ్లు తోముకోవడం. చాలామంది ఉదయం లేవగానే పండ్లు తోముకోకుండా కాఫీ తాగడం చేస్తారు. మరికొందరేమో నైట్ డ్యూటీ లు గట్రా చేస్తూ నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర క్యూ కడతారు. అయితే ఉదయం లేవగానే పండ్లు తోముకోవడం అనే అలవాటు చాలా మంచిది. పండ్లు తోముకోవడం కూడా ఓ కళ అంటారు దంత వైద్య నిపుణులు. మన పండ్లను సరైన రీతిలో బ్రష్ చేసుకోవాలి. బ్రష్ ను గట్టిగా ముందుకు, వెనుకకు తోమకూడదు. అలా తోమటం వల్ల చిగుళ్ళు దెబ్బతింటాయి. ముందుగా పండ్లు తోముకోవడానికి ఉపయోగించే బ్రష్ చాలా మెత్తగా ఉండాలి. అలా ఉంటే పండ్ల చిగుళ్లు దెబ్బతినవు. ఇక పండ్లు తోముకునేటప్పుడు బ్రష్ తో పైకి, కిందికి మెల్లగా తోముకోవాలి. అలా చేయటం వల్ల చిగుళ్ళకు నష్టం వుండదు. మన పండ్లను బ్రష్ తో తోముకున్న తర్వాత చేతి వ్రేళ్ళతో చిగుళ్ళను తోముకోవాలి. అందువల్ల చిగుళ్ళు దృఢంగా తయారవుతాయి. కొంతమంది ఇటుకపొడి, బొగ్గు మొదలైన గరుకు పదార్థాలతో పండ్లను తోముతారు, కాని అలా తోమకూడదు. ఎందుకంటే అవి పండ్లపై ఉన్న ఎనామిల్ ను తొలగించి నష్టపరుస్తాయి. ఒకవేళ అవి ఉపయోగించేలా అయితే మెత్తగా పొడిని జల్లించుకోవాలి.  లేదంటే పండ్లకు మంచి టూత్ పేస్ట్ వాడటం చాలా అవసరం. ఎందుకంటే ఫ్లోరైడ్ కల్గిన టూత్ పేస్ట్ లు వాడటం వల్ల దంతక్షయం అరికట్టబడుతుంది. చిగుళ్ళు గట్టిగా, దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి.  ఎవరైనా సరే చాక్లెట్లు, పిప్పరమెంట్లు, మిఠాయిలు ఎక్కువగా తినకూడదు. తీపి పదార్థాలు పండ్ల సందులలో చిక్కుకొని సూక్ష్మక్రిములు చేరుకుంటాయి. తద్వారా పండ్లు పుచ్చిపోతాయి. ప్రతీరోజూ ఉదయం బ్రష్ చేసేటప్పుడు నాలుక గీసుకొని శుభ్రపరచుకోవాలి. నాలుక పైన రాత్రిపూట ఒక తెల్లని పూత ఏర్పడుతుంది...! నాలుకపైన పేరుకున్న ఈ తెల్లని పూతను అప్ఆర్ఇంచుకుని సుక్మాజీవుల పెరుగుతాయి. ఈ పూతను ఎప్పటికప్పుడు తొలగించకపోతే సూక్ష్మక్రిములు పెరిగిపోయి దుర్వాసన కల్గుతుంది… మనం తీసుకునే ఆహరంతో పాటు ఈ సూక్ష్మ క్రిములు శరీరంలో ప్రవేశించి చాలా రకాల  వ్యాధులు కల్గుతాయి. భోజనం చేసిన తర్వాత నీటిని పుక్కిలించి నోటిని శుభ్రపరచుకోవాలి. నోటిలో చిక్కుకున్న ఆహారపు అణువులు తొలగించటానికి ప్రతిసారి భోజనము తర్వాత నీటిని పుక్కిలించి ఉమ్మివేయాలి. అప్పుడు నోరు శుభ్రంగా, వాసన లేకుండా ఉంటుంది. సంవత్సరానికి కనీసం ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించాలి. పండ్లు అందంగా ఆకర్షవంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవటానికి సంవత్సరానికి కనీసం ఒకసారి దంత వైద్యునితో పండ్లను పరీక్ష చేయించుకోవాలి. దంత వైద్యులు చెప్పిన విషయాలను జాగ్రత్తగా పాటించాలి. సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు.                                           ◆నిశ్శబ్ద.

నిద్ర పోయే ముందు ఏదైనా స్నాక్స్ తింటే?

మీకు నిద్ర పోయే ముందు ఏదైనా స్నాక్స్ తినాలని ఉందా తినేసయ్యండి. హాయిగా నిద్ర పొండి. సుఖంగా నిద్రపోవాలంటే సహకరిస్తుంది. లేదా ఏదైనా చిరుతిండి తింటే నిద్రవస్తుందా అంటే నిద్ర వస్తుంది అంటున్నారు నిపుణులు. వాస్తవానికి మనిషి అన్న వాడు 7 నుండి 8 ఘంటలు  నిద్రపోవాలి.మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి. కాని ప్రపంచంలో 3 వ వంతు అమెరికన్లు  సరిపడా చాలినంత నిద్ర పోవడం లేదని నిపుణులు గమనించారు. అల్లా ఒక సారి నిద్ర లేమి సమస్య దీర్ఘకాలంగా ఉంటె వ్యక్తి శారీరకంగా మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది.  ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడించారు. ప్రతి రోజు నిద్రపోవడం పడుకునే ముందు టి .వి ఫోన్ ,లి మీ నిద్రను పెంచుతాయి. మీఆహారం లో కొద్ది పాటి  మార్పు చేసుకుంటే నిద్ర సరిపోతుంది ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.సాయంత్రపు గాలులు తగ్గ్గిన వెంటనే  నిద్రకు ముందు ఏదైనా స్నాక్ తీసుకుంటే నిద్ర మత్తు వస్తుంది.దీనివల్ల మీనిద్ర సమయాన్ని కొంతవరకు  మీరే స్వయంగా అలవాటు చేసుకో వచ్చు.దీనివల్ల మీరు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.  మీరు నిద్ర పోయే ముందు వెచ్చటి పాలు గ్లాసుడు తీసుకుంటే నిద్రకు సహకరిస్తుంది. అయితే  ఇది పాత పద్దతే కావచ్చు ఇది పాత బడిపోయిన సలహా అని మీరు ఎద్దేవా చేయచ్చు. వివిధ రకాల  నట్స్,సీడ్స్,బలమైన ఆహారం సేరోటో నిన్ ను ఉత్పత్తి చేస్తాయి,అమినోయాసిడ్స్నిద్ర పోయేలా చేస్తాయి. ఆల్మండ్స్ బాదం పీనుత్స్ పల్లి పప్పులు మెలటోనిన్ పదార్ధాని ఇస్తాయి. ఈ హార్మోన్ శరీరాన్ని నిద్రపోయే పద్ధతి ని అలవాటు చేస్తుంది.