మమ్మల్నీ చంపేస్తారేమో? జగన్ చెల్లెలు ఆందోళన

వైఎస్ వివేకాను చంపిన హంతకులు తమనూ లక్ష్యంగా చేసుకునే అవకాశముందంటూ ఆయన కుమార్తె సునీత ఆందోళన వ్యక్తంచేశారు. వైఎస్ వివేకా హంతకుల నుంచి తనకు, తన భర్త రాజశేఖర్ కు ముప్పు పొంచి ఉందన్నారు. అందుకే, తమకు సాయుధ రక్షణ కల్పించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత కోరుతున్నారు. గతేడాది నవంబరు 21న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాసిన సునీత... తాము ఏపీలో ఉన్నప్పుడు సెక్యూరిటీ ఇవ్వాలంలూ విజ్ఞప్తి చేశారు. 

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సునీత... తమకు రక్షణ కల్పించాలంటూ ఏపీ డీజీపీకి రాసిన లేఖను కూడా జత చేశారు. వైఎస్ వివేకాను అత్యంత క్రూరంగా హత్య చేశారు. దర్యాప్తు వేగంగా సాగడం కోసం నేను, నా భర్త పోలీసులకు సహకరిస్తున్నాం. అయినా హంతకులెవరో ఇప్పటివరకూ గుర్తించలేదు. ఈ పరిస్థితుల్లో నా భద్రతపైనా, నా కుటుంబ భద్రతపైనా భయం కలుగుతోందని సునీత హైకోర్టుకు విన్నవించుకున్నారు. 

నా తండ్రిని అత్యంత క్రూరంగా చంపిన వాళ్లు మమ్మల్నీ లక్ష్యం చేసుకునే అవకాశముందని అనుమానం వ్యక్తంచేశారు. అలాగే, ఈ కేసులో కీలకమైన శ్రీనివాస్ రెడ్డి హత్యకు గురైన నేపథ్యంలో మిగతా నిందితులైన పరమేశ్వర్ రెడ్డి, యర్ర గంగిరెడ్డి, వాచ్ మన్ రంగయ్య ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తాము భావిస్తున్నట్లు హైకోర్టుకు తెలిపారు.

Teluguone gnews banner