ఈరోజు వైజాగ్ పర్యటించనున్న జగన్

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైజాగ్ లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన సింహాచలం వెళ్లి అప్పన్నస్వామిని దర్శించుకొన్న తరువాత స్థానిక పార్టీ నేతలతో, కార్యకర్తలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత బీచ్ రోడ్డు సముద్రపు కోతకు గురయిన ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలిస్తారు. అనంతరం నగరంలోని స్వామి స్వరూపానంద ఆశ్రమంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. మళ్ళీ సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళ్లిపోతారు.

Teluguone gnews banner