రైలు ప్రమాదం.. 12 మంది మృతి

 

హర్యానాలోని హిస్సార్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. కాపలా లేని క్రాసింగ్ వద్ద వాహనాన్ని రైలు ఢీకొనడంతో 12 మంది మరణించారు. చండీగఢ్ - హిస్సార్ మార్గంలో సోమవారం ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో సర్సొడ్ గ్రామం దగ్గర కాపలా లేని రైలు క్రాసింగ్‌ని దాటుతున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ధూరి - సిర్సా ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న మొత్తం 12 మంది మరణించారు. ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మిగతా ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులందరూ ప్రమాద స్థలానికి సమీపంలోని పంఘాల్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. పొగమంచు కారణంగా వాహనం డ్రైవర్‌కి రైలు కనిపించకపోవడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

Teluguone gnews banner