Read more!

ఆయనకి ఎన్నికల కమిషన్ షాక్

 

 

 

“ఇంకా ఎన్ని రోజులురా మీ ఆగడాలు…ఈ అరాచకాలు…ఆయనొస్తున్నాడు…” అంటే... ఎవరాయన? రాజకీయ నాయకుడు ప్రశ్నిస్తే ఆయన ఎవరో కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి పుత్రరత్నం జగన్ అనే విషయం రివీల్ అవుతుంది. వెంటనే ఫ్యాన్ గుర్తు కనిపిస్తుంది. ఆ తర్వాత ఓ బొంగురు గొంతు ‘ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి.. దుమ్ము దులిపేయండి’ అని సందేశం ఇస్తూ గత కొన్ని రోజులుగా టీవీలో ప్రకటనలు హడావిడి సృష్టించాయి. అయితే సడన్ గా ఛానెళ్ళలోంచి ఈ ప్రకటన మాయమై౦ది. అయితే ఈ ప్రకటనపై ఎన్నికల కమిషన్ అభ్యంతర౦ పెట్టింది. తమ అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయకూడదని స్పష్టం చేసిందట. దాంతో వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్‌కి ఈ ప్రకటనల ప్రసారం చేయడానికి అనుమతి కోరుతూ లేఖ రాసింది. అయితే ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనల ప్రసారానికి అంగీకరింబోనని తెలిపిందట.