వైసీపీ నేతలు సైలెంట్ గా సర్దేసుకుంటున్నారా?

విషయాన్ని డైవర్ట్ చేసి తాము అనుకున్నది సైలెంట్ గా చేసుకుని పబ్బం గడిపేయడంలో వైసీపీ నేతలు డాక్టరేట్ సాధించారని చెప్పొచ్చు. ప్రతి విషయంలోనూ వారు ఒకటి చేయాలనుకుంటే.. అందుకు భిన్నంగా విపక్ష నేతలు, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకువస్తారు. అదే సమయంలో తాము చక్కబెట్టదలచుకున్న కార్యాన్ని సెలెంట్ గా చక్కబెట్టేస్తారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఇదే జరిగింది. ఆ ట్రాప్ లో విపక్షం కూడా పడిపోయింది. 

ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా వైసీపీ అలాగే చేస్తోంది. అధికారం కోల్పోవడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు నెమ్మదిగా రాష్ట్రం వదిలి వెళ్లిపోవడానికి ప్రణాళికలు రచించుకుంటున్నారు. అయితే ఆ విషయం ఎవరూ గమనించకుండా ఉండేందుకు విజయంపై ధీమా ఒలకబోస్తూ, రాష్ట్రంలో అల్లర్లను ప్రేరేపిస్తూ విపక్ష కూటమి నేతలు, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే  సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి నేతలు మీడియా ముందుకు వచ్చి ముఖంలో ఇసుమంతైనా ధీమా లేకపోయినా గెలుపు తధ్యమని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే వారిలా మీడియా ముందుకు వచ్చి విజయంపై ప్రకటనలు గుప్పించడం వెనుక అసలు కారణం మరోటి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జూన్ 4న కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడేనాటికి పార్టీలోని కీలక నేతలంతా మూటాముల్లె సర్దుకుని రాష్ట్రం దాటేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు.

అయితే అది జనం దృష్టికి, ముఖ్యంగా విపక్ష కూటమి నేతల దృష్టికీ వెళ్లకుండా రాష్ట్రంలో హింసాకాండను ప్రేరేపించడం, తెలుగుదేశం కూటమిపై విమర్శలు, అల్లర్లకు వారే కారణమంటూ నిందలు, చివరాఖరుగా ఎన్నికల సంఘంపై ఆరోపణలు. దీంతో విపక్ష నేతలంతా వైసీపీ ఆరోపణలు, విమర్శలకు సమాధానం ఇవ్వడంపై పెడుతున్న శ్రద్ధ తెరవేనుక వైసీపీ నేతలు ఏం చేస్తున్నారన్నది గమనించడంపై పెట్టడం లేదు. దీంతో సందట్లో సడేమియా అన్నట్లుగా వైసీపీ కీలక నేతలంతా మూటాముల్లె సర్దేసుకుంటున్నారు. 

అలా సర్దేసుకుంటున్నవారిలో ప్రథముడు సజ్జల అని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే సజ్జల కుమారుడు సజ్జల భార్గవరెడ్డి ఎవరికీ కనిపించడం లేదు. ఎక్కడా వినిపించడం లేదు. వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం వేసేశారు. ఎవరూ కార్యాలయానికి రానవసరం లేదని చెప్పేశారు. నెల రోజుల పాటు సెలవులు ఇచ్చామని, పూర్తిగా తీసేశామని చెబుతూ వైసీపీ సోషల్ మీడాయా వర్కర్లలో కన్ష్యూజన్ క్రికేట్ చేశారు. 

నిజంగా సజ్జల మీడియా ముందుకు వచ్చి చెబుతున్నట్లుగా విజయంపై అంత నమ్మకం ఉంటే వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళం పడదు.  ఆ సోషల్ మీడియా వింగ్ చీఫ్ సజ్జల భార్గవరెడ్డి అజ్ణాతంలోకి వెళ్లరు.  ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా, సజ్జల భార్గవ్‌పై ఈసీ ఆదేశాల మేరకు కేసు కూడా బుక్కౌంది.   ఒక్క సజ్జల అనే కాదు.. ఆ పార్టీ కీలక నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పిన్నెల్లి సోదరులైతే.. హౌస్ అరెస్టు నుంచి తప్పించుకుని, గన్ మెన్ లను సైతం వదిలేసి పరారైపోయారు. 

ఇప్పుడు వైసీపీ కీలక నేతల దృష్టంతా తమ ఆస్తులు, వ్యాపారాలు సేఫ్ జోన్‌కు ఎలా పంపించుకోవాలన్నదానిపైనే ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల అధికారంలో ఉండి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కూడబెట్టిన అక్రమాస్తుల రక్షణపైనే వైసీపీ నేతల దృష్టి ఉందని అంటున్నారు.  పెద్దిరెడ్డి వైసీపీలో క్యాష్ కింగ్‌గా పేరున్న పెద్దిరెడ్డి సైలెంట్ అయిపోయారు. అందుకు ఉదాహరణగా పెద్ది రెడ్డి అనుచరులు, అనుయాయులు అయిన పలువురు కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలను రాబట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఉదాహరణగా చూపుతున్నారు.  

మొత్తంగా ఓట్ల లెక్కింపు వరకూ రాష్ట్రంలో ఉద్రిక్తతలు చల్లారకుండా ఉండేలా కార్యకర్తలను, క్యాడర్ ను రెచ్చగొడుతున్నారనీ, తద్వారా  విపక్ష కూటమి నేతల దృష్టిని డైవర్ట్ చేసి, పోలీసుల దృష్టి మొత్తం హింసను అరికట్టడంపై కేంద్రీకృతమయ్యేలా చేసి.. తాము రాష్ట్రం దాటేసే యత్నాలలో ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Teluguone gnews banner