పవిత్ర క్షేత్రంలో రాజకీయాలు.. వివాదాస్పదంగా మారిన వైసీపీ ఫ్లెక్సీలు!

శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లు వివాదాస్పదమయ్యాయి. అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి దంపతులు ఆదివారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుడి దర్శనానికి వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ కర్నూలు కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం పేరుతో నాలుగు ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ లో శ్రీశైల దేవస్థానం లోగో, సీఎం జగన్, వైసిపి ఎమ్మెల్యేలు సాయి ప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, వై వెంకట్రామిరెడ్డి, వైసీపీ నాయకులు శివరామిరెడ్డి, సీతారామిరెడ్డి, ఫోటోలు ఉన్నాయి. సాక్షి గణపతి ఆలయం వద్ద రెండు, మల్లికార్జున సదన్ ఎదురుగా రెండు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేవస్థానం సిబ్బంది వీటి గురించి పట్టించుకోక పోగా సమాచారం అందుకున్న ఈవో అధికారుల దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఫ్లెక్సీలను తొలగించారు, అయితే శ్రీశైలం లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. పవిత్ర క్షేత్రంలో రాజకీయాలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Teluguone gnews banner