Read more!

అసెంబ్లీలో జగన్‌ని రఫ్ఫాడేసిన మంత్రులు...

 

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై చర్చ జరపాలంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న జగన్ పార్టీపై అధికార పక్షం ఫైర్ అయ్యింది. శాంతిభద్రతలపై ప్రభుత్వానికి ఎందుకు లెక్కలేదని.. మనుషుల ప్రాణాలంటే అధికార పార్టీకి లెక్కలేదని వైకాపా చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ని ఏపీ మంత్రులు రఫ్పాడించేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ మారలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజా సమస్యలు జగన్‌కు పట్టడం లేదని ఆయన అన్నారు. అలాగే మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి కూడా జగన్‌ని విమర్శల వర్షంలో తడిపేశారు.