Read more!

ఆత్యాచారానికి పాల్పడి.. ఆపై యాసిడ్ పోసి..ప్రేమించిన వాడే పొట్టన పెట్టుకున్నాడు..

చట్టాలెన్ని తెచ్చినా, కఠిన శిక్షల హెచ్చరికలు చేసినా మహిళలపై అత్యచారాలు, అఘాయిత్యాలు ఆగడం లేదు సరికదా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దగ్గరి వాళ్లు, అయిన వాళ్ల చేతుల్లోనే దారుణంగా హతమారిపోతున్నారు. తాజాగా ప్రేమించిన వాడే కాలయముడై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆపై ముఖంపై యాసిడ్ పోసి కిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

నమ్మి వచ్చిన ప్రేయసిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి, ఆపై అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన జార్ఖండ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. 20 ఏళ్ల యువతి రాంచీలోని ఓ కాలేజీలో పీజీ చదువుతోంది. కొన్ని నెలలుగా ఆమె  దీప్ అనే యువకుడూ ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. నవంబర్ 20 న ఆమె దీప్ తో కలిసి బయటికి వెళ్లింది. అప్పటి నుండి  ఆమె జాడ తెలియలేదు.

యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండ్రోజుల తర్వాత..లోహర్ దగా గ్రామానికి సమీపంలో ఉన్న రాతి క్వారీల సమీపంలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ముఖం గుర్తుపట్టకుండా యాసిడ్ పోసి కాల్చేసి.. దారుణంగా హతమార్చాడని దర్యాప్తులో తేలింది. నిందితుడు దాప్ నారాయణ్ సింగ్ అలియాస్ చర్కు ని అరెస్ట్ చేశారు.