కాంగ్రెస్ నాయకులది నీచబుద్ధి: వెంకయ్య నాయుడు
posted on May 10, 2014 @ 12:38PM
కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నీచబుద్ధిని బయటపెట్టుకునే వ్యాఖ్యానాలు చేస్తున్నారని, వారి రాజకీయాలు కూడా నీచంగా వున్నాయని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు విమర్శించారు. కాంగ్రెస్ అమ్మ సోనియా గాంధీ దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ నరేంద్రమోడీ మీద అసత్య ప్రచారం చేస్తున్నారని, నరేంద్రమోడీ ప్రధాని అవుతున్నాడన్న బాధ వారి మాటల్లో కనిపిస్తోందని వెంకయ్య అన్నారు. భారతీయ జనతాపార్టీ నాయకుల మీద ముఖ్యంగా నరేంద్రమోడీ మీద అసత్య ప్రచారం, వ్యక్తిగత విమర్శలు చేయడం మినహా కాంగ్రెస్ పార్టీకి మరో పని లేదని ఆయన దుయ్యబట్టారు. అమిత్ షా విషయంలో, స్నూప్ గేట్ వివాదంలో కాంగ్రెస్ నేతలు నోటికొచ్చిన విమర్శలు చేసి తమ చౌకబారు బుద్ధిని బయపెట్టు్కున్నారని, చివరికి నరేంద్రమోడీ కులం గురించి కూడా ప్రస్తావించిన కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పరాకాష్టకు చేరుకుందని వెంకయ్య నాయకుడు ఘాటుగా విమర్శించారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి కాకుండా ఆపడం ఎవరి తరం కాదని, భారతీయ జనతాపార్టీ మూడు వందలకు పైగా ఎంపీ స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందన్న సంపూర్ణ విశ్వాసం తమకు వుందని ఆయన చెప్పారు.