తమిళనాడు తొక్కిసలాటపై నలుగురిపై కేసు నమోదు

 

తమిళనాడు కరూర్‌లో విజయ్‌ టీవీకే వ్యవస్థాపకుడు నిర్వహించిన ర్యాలీకి అనుమతులు 10,000 మందికే తీసుకున్నట్లు డీజీపీ జి. వెంకట్రామన్‌ వెల్లడించారు. అయితే సోషల్‌ మీడియాలో తప్పుదోవ పట్టించే ప్రకటనల కారణంగా ఫ్యాన్స్ ముందుగానే భారీ సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. రాత్రి 7.30 గంటలకు విజయ్‌ రాకముందే జనసందోహం ఏర్పడి తొక్కిసలాట జరిగింది. 

అధికారులు ఈ కార్యక్రమానికి 1.2 లక్షల చదరపు అడుగుల స్థలం కేటాయించినప్పటికీ, ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని ఆయన వివరించారు. ఘటన స్థలానికి వెంటనే 2,000 మంది సిబ్బంది, సీనియర్‌ పోలీసు అధికారులను పంపించామని, ఒకే సభ్య కమిషన్‌తో దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

విజయ్‌ సహాయకులపై కేసు

ఈ ఘటనలో విజయ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌, జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ నిర్మల్‌ కుమార్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీపీ ఎస్‌. డేవిడ్‌సన్‌ ధృవీకరించారు. ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే మెగాస్టారక సినీ నటుడు చిరంజీవి ఎక్స్‌లో స్పందిస్తూ – “కరూర్‌ ర్యాలీ దుర్ఘటన బాధాకరం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి” అని పేర్కొన్నారు.

చలాన్లు పడ్డ వెంటనే అకౌంట్ నుండి డబ్బులు కట్ కావాలి : సీఎం రేవంత్‌

  ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులకు కీలక సూచన చేశారు. వాహన చలానా పడితే ఆటోమెటిక్‌గా డబ్బులు కట్ అయ్యేలా టెక్నాలజీ వాడండి అని ముఖ్యమంత్రి తెలిపారు.హైదరాబాద్ యూసుఫ్‌గూడ స్టేడియంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించలని సూచించారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలని తెలిపారు. చలాన్లు విధించడం కాదు, ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించాలని ముఖ్యమంత్రి వెల్లడించారు.  చలాన్లు విధిస్తే డిస్కౌంట్ ఇవ్వవద్దని సూచించారు. మైనర్లు ప్రమాదాలకు కారకులైతే వారి తల్లిదండ్రులపై కేసులు పెట్టాలన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం, డ్రంగ్ అండ్ డ్రైవ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఇలాంటివారిపై కఠినంగా వ్యవహరించి నివారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారణకు అవసరమైన ప్రణాళికను చేపట్టిన పోలీస్ శాఖను అభినందిస్తున్నాని తెలిపారు.   దేశంలో ప్రతీ నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. విద్యార్థి దశలోనే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు. సమాజంలో నేరాల విషయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నామని... ఆధునిక సమాజంలో సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. అందుకే సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తీవ్రమైన సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది.. యుద్ధంలో సైనికుల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.  రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు కూడా బిడ్డలను కోల్పోయి దుఃఖంలో మునిగిపోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకుని ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని..సైబర్ క్రైమ్, డ్రగ్స్, హత్యల కంటే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు అతి పెద్ద సమస్యగా మారాయిని తెలిపారు.  సిగ్నల్, ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన కల్పించి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్ఫష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణను టాప్ ప్రయారిటీగా తీసుకుని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

నారావారిపల్లె‌కు చేరుకున్నా సీఎం చంద్రబాబు

  సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. రంగంపేట వద్ద చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు  గ్రామస్తులు పార్టీ నాయకులు, కార్యకర్తలు  ఘనస్వాగతం పలికికారు. ఏటా కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునే సీఎం చంద్రబాబు...ఈ ఏడాది కూడా స్వగ్రామానికి చేరుకున్నారు.  సోమవారం మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం నారావారిపల్లెకు చేరుకున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నేతలతో కలిసి రేపు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మంగళవారం నారావారిపల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు.  ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు...శంకుస్థాపనలు మంగళవారం ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రూ.70 లక్షలతో ఎ-రంగంపేట–భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు.  నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌ స్టేషన్‌, రూ.1.4 కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక తిరుపతిలో రూ.45 లక్షలతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెంట్ అమీనిటీస్ కాంప్లెక్స్‌, ఎస్వీ యూనివర్సిటీలో రూ.7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్‌, రూ.5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.    మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు, మూలపల్లి చెరువుతో పాటు మరో 4 చెరువులకు నీటిని తరలించేలా రూ.126 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు, రూ.10 లక్షలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. ఎస్వీ యూనివర్సిటీలో పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా రూ.6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ పరిశోధన ల్యాబ్స్, విద్యా మౌలిక వసతుల్లో భాగంగా రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తుకు, రూ.2.91 కోట్లతో చేపట్టే కాపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.  నాగాలమ్మకు ప్రత్యేక పూజలు 15వ తేదీన తమ గ్రామ దేవతైన నాగాలమ్మ గుడికి కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజున నారావారిపల్లె నుంచి అమరావతికి చేరుకుంటారు.    

వచ్చే నెలలో పెళ్లి...యూఎస్ అదుపులో భారత్ నేవీ ఆఫీసర్

  వెనిజులాపై దాడి నేపధ్యంలో యూఎస్ ప్రభుతం ఆ దేశానికి రష్యా జెండాతో వెళ్తున్న మ్యారినెరా నౌకతో పాటు మరో దాన్ని సీజ్ చేసింది. మ్యారినెరా నౌకా సిబ్బందిలో ముగ్గురు ఇండియన్స్ ఉన్నట్లు రష్యా మీడియా వెల్లడించింది. వారు హిమాచల్ ప్రదేశ్, కేరళ, గోవాకు చెందిన వారు కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్‌కు చెందిన రక్షిత్ చౌహాన్ అనే మర్చంట్ నేవీ ఆఫీసర్‌కు వచ్చే నెల వివాహం జరగాల్సి ఉంది.  చౌహాన్‌ను రష్యా సంస్థ తొలిసారి సముద్రం విధులకు.. అది కూడా వెనిజులాకు పంపింది. ఆ క్రమంలో జనవరి 7న చివరిసారి చౌహాన్‌తో మాట్లాడామని ఆయన కుటుంబం వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే అమెరికా దళాలు నౌకను అదుపులోకి తీసుకున్నాయి. అది తెలిసి రక్షిత్ చౌహాన్ తల్లి రీతాదేవి తన కొడుకు వివాహాన్ని ఫిబ్రవరి 19న నిశ్చయించామని, అతను సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడండని ప్రధాని మోడీని అభ్యర్ధించింది. ఈ పరిణామాలపై ఇప్పటికే భారత విదేశాంగ శాఖ స్పందించి చర్యలు చేపడుతోంది.

రూ.547 కోట్ల సైబర్ మోసాలు... చేధించిన ఖమ్మం పోలీసులు

  ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి. విద్యావంతులు, ఉద్యోగులు కూడా సైబర్ కేటుగాళ్ల మాయలో పడి రూ. కోట్లు పోగొట్టుకుంటున్నారు. గతేడాది కేవలం 8 నెలల్లోనే సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.372 కోట్లు కాజేసినట్లు ఇటీవల పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటి కప్పుడు సూచనలు ఇస్తూ ఉన్నారు. అయినా కూడా కేటుగాళ్ల మాయలో పడి చాలా మంది మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు.  ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేయగా కేవలం ఆరుగురి ఖాతాల్లోనే రూ.547 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.   సైబర్ క్రైమ్ ద్వారా వీళ్లంతా రూ. 547 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినట్లు తేల్చారు. సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్‌కళ్యాణ్, ఉడతనేని వికాస్ ప్రధాన సూత్రధారులుగా ఈ దందా నడిచిందని గుర్తించారు.కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అలాగే.. మాట్రిమోని, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్‌ లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్.. ఇలా పలు రకాలుగా బాధితుల నుంచి ఈ డబ్బును కొల్లగొట్టినట్టు స్పష్టం అవుతోంది.  గతేడాది డిసెంబర్ లో విఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో సాయికిరణ్ అనే వ్యక్తి .. తాను సైబర్ మాయగాళ్ల చేతిలో మోసపోయినట్లు ఫిర్యాదు చేశాడు. దాంతో వీరి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, మోరంపూడి చెన్నకేశవ అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  అలాగే నిందితులకు బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన మరో 17 మందిపై కేసులు నమోదు చేశారు. వీళ్లంతా అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో జతకట్టి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఇక ఇటీవల హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్‌ భార్యకు సైబర్‌ నేరగాళ్ల టోకరా వేసిన సంగతి తెలిసిందే. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పేరుతో కేవలం పది రోజుల్లోనే ఆమె నుంచి ఏకంగా రూ.2.58 కోట్లు కొట్టేశారు సైబర్‌ కేటుగాళ్లు. 

జిల్లాల పునర్విభజనపై కమిటీ : సీఎం రేవంత్‌రెడ్డి

  తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ & క్యాలెండర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో జిల్లాల పునర్విభజన కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని...6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని కోరతామని తెలిపారు. గతంలో నాయకులు నచ్చినట్లు జిల్లాలు ఏర్పాటు చేశారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.  మండలాలు, రెవెన్యూ డివిజన్లనూ పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం తెలిపారు. మల్కాజ్‌గిరి మేం పెట్టలేదు. తీయలేదు. రాచకొండ ఒక్కటే రాజులను తలపించేలా ఉందన్నారు. సికింద్రాబాద్ పేరు ఎక్కడ ఉంది? తీసేసింది ఎక్కడ? జీహెచ్‌ఎంసీలో భాగంగా సికింద్రాబాద్ ఉంది అని రేవంత్‌రెడ్డి అన్నారు. సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని అనుకుంటున్నారని చెబుతున్నారు. మనమంతా ఒకే కుటుంబం… కుటుంబంలో కుమ్మక్కులు ఏం ఉంటాయిని సీఎం స్పష్టం చేశారు.  ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే చూడలేని వారు, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడూ ఉంటారని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. పదిన్నర లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములేని తెలిపారు.  మీరే మా సారధులు, మా వారధులు.. మీ సోదరుడిగా మీకు అండగా ఉంటాని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో మీ జీతాలు ఎప్పుడొచ్చేవి.. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో ఒకసారి ఆలోచించండని ఉద్యోగులను ప్రశ్నించారు.  సంక్రాంతి కానుకగా మీ డీఏపై సంతకం చేసి వచ్చా.. మీ ఆరోగ్య భద్రత విషయంలో పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వివరించారు. ఉద్యోగులకు ప్రమాద బీమా కోటి రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్  సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం..ఇదొక బాధ్యత.. అందరం కలిసికట్టుగా బాధ్యతను నిర్వహిస్తేనే పరిపాలన పరుగులు పెడుతుందని సీఎం రేవంత్ వెల్లడించారు.  

చిరంజీవి వరప్రసాద్ సినిమా చూస్తూ రిటైర్డ్ ఏఎస్ఐ మృతి

  హైదరాబాద్ నగరంలో ఓ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ థియేటర్ లో సినిమా చూస్తూ ఓ వ్యక్తి  మృత్యు వాత పడడంతో ఆ థియేటర్లో విషాదఛాయలు అలుము కున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా హైదరాబాదు నగరంలో ఉన్న పలు సినిమా థియేటర్ లలో విడుదల అయిన విషయం తెలిసిందే...ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన అభిమాన హిరో చిరంజీవి నటించిన సినిమా చూడడానికి వచ్చి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్‌లో  చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.  లింగంపల్లికి చెందిన ఆనంద్ కుమార్  (63) ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి 12వ బెటాలియన్ నుంచి రిటైర్ అయ్యారు. చిరంజీవి అభిమానిగా ఉన్న ఆయన ఈరోజు సోమవారం ఉదయం 11:30 గంటల షోకు కూకట్పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్‌కు వచ్చారు. సినిమా ఆసక్తిగా వీక్షిస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. క్షణాల్లోనే థియేటర్‌లో కుప్పకూలి కింద పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రేక్షకులు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది.  ప్రాథమికంగా హార్ట్‌స్ట్రోక్‌ కారణంగానే ఆనంద్ కుమార్ మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగి స్తున్నారు. సినిమా థియేటర్‌ లోనే ఈ విధమైన విషాద ఘటన జరగడం పట్ల ప్రేక్షకులు, థియేటర్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి సినిమా ఆనందంగా చూడటానికి వచ్చిన ఓ అభిమాని ఇలా ప్రాణాలు కోల్పోయిన ఘటన  నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

వెంకన్నదేవుడిని నెత్తిన పెట్టుకున్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  సనాతన ధర్మం విషయంలో పట్టుదలగా ఉంటున్న సంగతి తెలిసిందే. తనను తాను సనాతన ధర్మం ఆచరించే వ్యక్తిగా చెప్పుకోవడమే కాకుండా, వాటి విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటూ, సందర్భం వచ్చినప్పుడల్లా తాను సనాతన ధర్మం పట్ల మెగ్గు చూపుతున్న విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన తాజాగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకుని దేవదేవుని పట్ల తనకున్న భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.   ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంక్రాంతి సంబరాలను తన సొంత నియోజకవర్గం పిఠాపురం జరుపుకుంటున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం వచ్చిన సందర్భంగా తనకు   బహుమతిగా ఇచ్చిన కలియుగ దైవం వేంకటేశ్వరుడి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించి, ఆ విగ్రహాన్ని భక్తి పారవశ్యంతో తన నెత్తిన, భుజాన మోశారు. తద్వారా  తిరుమల వెంకన్నదేవుడిపై తనకున్న అపారమైన భక్తి భావాన్ని గర్వంగా ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కల్యాణ్ నిజమైన భక్తుడు అంటూ నెటిజనులు పెద్ద ఎత్తున ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.  

దివ్యాంగులకు జైపాల్‌రెడ్డి స్పూర్తి : సీఎం రేవంత్

  దివ్యాంగులకు మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్పూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైకల్యం ఉందని ఆయన మనసులో కూడా రాలేదని తెలిపారు. ప్రజా భవన్ లో 'బాల భరోసా' పథకం, “ప్రణామ్” డే కేర్ సెంటర్ల ప్రారంభించి..దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుంది. రూ. 50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రూ. 50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని  ఒక కుటుంబ సభ్యుల్లా వారికి భరోసా కల్పించేందుకు మా ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ. 50 కోట్లు కేటాయించిందని ముఖ్యమంత్రి తెలిపారు.  విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు వారి కోటాను వారికి ప్రత్యేక కోటా కేటాయిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామన్న ఆలోచన లేకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎదగాలని సీఎం ఆంక్షించారు.  రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్ జెండర్ ని కార్పొరేటర్ గా నామినేట్ చేయాలని చేస్తామని సీఎం వెల్లడించారు. తెలంగాణ కులగణన మోడల్‌ను  దేశం అనుసరిస్తోందని సీఎం తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు సామాన్యులకు ప్రవేశం లేని ప్రజా భవన్ లో ఇప్పుడు అందరికీ ప్రవేశం కల్పించామని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉంది.. ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుంద... తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.  

పోలవరం, నల్లమల సాగర్ పై పిటిషన్.. తెలంగాణకు సుప్రీం షాక్

తెలంగాణ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారణార్హత లేదని విస్పష్టంగా పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు.   పోలవరం ప్రాజెక్టును నల్లమల్ల సాగర్‌తో లింక్ చేయడం వల్ల తెలంగాణకు నష్టమని, గోదావరి నీటి కేటాయింపులు ఉల్లంఘన అవుతున్నాయని ఆయన వాదించారు. అయితే సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ, పోలవరం, నల్లమల ప్రాజెక్టు విషయంలో కర్నాటక, మహారాష్ట్రలు కూడా ముడిపడి ఉన్నాయనీ, అందుకే ఈ వ్యవహారాన్ని మీడియేషన్ లేదా సివిల్ సూట్ ద్వారా పరిష్కారం కోరవచ్చని సూచించింది. పిటిషన్ డిస్మిస్ చేయాలా? ఉపసంహరించుకుంటారా అని సుప్రీం కోర్టు పేర్కొనడంతో  తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్ ను ఉపసంహరించుకుంది.  , దీనిపై సివిల్ సూట్ దాఖలు చేస్తామని తెలపింది.  

ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ

  ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యారోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా రోణంకి గోపాలకృష్ణ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌కుమార్‌, ప్రకాశం జిల్లా జేసీగా కల్పన కుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్‌ అశోక్‌, చిత్తూరు జేసీగా ఆదర్శ్‌ రాజేంద్రన్‌, గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఎస్‌.ఎస్‌.శోబిక, కడప జేసీగా నిధి మీనా, విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి, అన్నమయ్య జేసీగా శివ్‌ నారాయణ్‌ శర్మ, పల్నాడు జేసీగా వి.సంజనా సింహను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జేసీగా నియమితులైన నిధి మీనా, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, మార్కాపురం జాయింట్‌ కలెక్టర్‌గా పి.శ్రీనివాసులు పోస్ట్‌లు ఇస్తూ ఉత్తర్వులిచ్చింది.