శ్రీవారికి చిల్లర కష్టాలు.. టన్నుకు 30 వేలు చెల్లిస్తున్న టీటీడీ
posted on Jan 28, 2020 @ 3:24PM
తిరుమల శ్రీవారిని చిల్లర కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు చలామణిలో ఉన్న నాణాలను తొలగించుకునే ప్రయత్నం చేసిన టీటీడీ ఇప్పుడు చలామణిలో లేని నాణాల పై దృష్టి పెట్టింది. 80 టన్నుల నాణాలను ఆర్బీఏ సహాయంతో కరిగించేందుకు సిద్ధమవుతోంది. టీటీడీ వద్ద ఒకటోవ శతాబ్ధం నుంచి నేటి వరకు ఉన్న నాణాలు ఉన్నాయి. ప్రస్తుతం చెల్లు బాటులో లేని వాటిని కరిగించేందుకు ప్రయత్నిస్తోంది టీటీడీ. అణా నుంచి 25 పైసల వరకు ఉన్న నాణాలను కరిగించాలని అనుకుంటోంది. అయితే అల్యూమీనియం, నికెల్, స్టీల్, రాగి, ఇత్తడి నాణాలని కరిగించేందుకు సెయిల్ కంపెనీ ముందుకొచ్చింది. దీనికోసం టన్నుకు రూ.30,000 రూపాయలను ఇచ్చేందుకు అంగీకరించింది టీటీడీ. స్వామి వారికి ప్రతినిత్యం వచ్చే హుండీ ద్వారా అటు నగదు , నాణాలకు సంబంధించి 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు కానుకలను భక్తులు సమర్పిస్తుంటారు. వీటిలో నాణాలు దాదాపు 20 లక్షల రూపాయల వరకు భక్తులు సమర్పిస్తుంటారు.