ట్రూ జెట్ విమాన సేవలని ప్రారంభించిన రామ్ చరణ్ తేజ్

 

ప్రముఖ తెలుగు సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ కి చెందిన ‘ట్రూ జెట్’ విమాన సర్వీసులు నిన్నటి నుండి ప్రారంభం అయ్యాయి. నిన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి కేటిఆర్, టర్బో మేఘా సంస్థ డైరెక్టర్లు ప్రేమ కుమార్, వి. ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రూ జెట్ విమాన సర్వీసులను రామ్ చరణ్ తేజ్ జెండా ఊపి ప్రారంభించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జూలై 12 నుండి 25 వరకు హైదరాబాద్ నుండి రాజమండ్రికి ట్రూ జెట్ ప్రత్యేక విమాన సర్వీసులు నడపబోతోంది. ఈ నెల 26నుండి ఔరంగాబాద్, మరికొన్ని ప్రాంతాలకు కు ట్రూ జెట్ సర్వీసులు నడుపబోతోంది.

Teluguone gnews banner