మువ్వన్నెల జాతీయ జెండా ఎర్రకోటపై మొదటిసారి ఎగిరింది ఆగస్టు పదహారు!

శుభకర్ మేడసాని, జర్నలిస్ట్ 

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పుడు... ఆ వేడుకలకు దూరంగా  మహాత్మ గాంధీ ఏం చేస్తున్నారు?

మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు? 

భారత స్వాతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించారు. కానీ, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినపుడు ఆ సంబరాలలో ఆయన పాల్గొనలేదు.

మహాత్మాగాంధీ స్వతంత్రం లభించిన రోజున దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు.

ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ మహాత్మాగాంధీకి లేఖ రాశారు. అందులో ఆగస్టు 15 మన మొదటి స్వతంత్ర దినోత్సవం అవుతుంది. మీరు జాతిపిత. ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి అని కోరారు.

గాంధీ ఆ లేఖకు సమాధానం ఇచ్చారు. కలకత్తాలో హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను. ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా విడుస్తా అన్నారు.

జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం 'ట్రిస్ట్ విత్ డెస్టినీ'ని ఆగస్టు 14 అర్థరాత్రి వైస్రాయ్ లాంజ్(ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుంచి ప్రసంగించారు. నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా శ్రద్ధగా ఆలకించింది. కానీ గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు. లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. కానీ, 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్‌లోని పత్రాల ప్రకారం 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేశారు.

ఆగస్టు 15 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దానిని ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారు.

ఆగస్టు 15న భారతదేశానికి విముక్తి లభించింది. కానీ దేశానికి అప్పటివరకూ జాతీయ గీతం ఏదీ లేదు. జనగణమణ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే రాసి ఉంచారు. అయితే, అది 1950లో జాతీయగీతం గౌరవాన్ని పొందింది.

ఆగస్టు 15న భారత్‌తోపాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దక్షిణకొరియా జపాన్ నుంచి 1945 ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. బహరీన్‌కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి లభించింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందింది.

మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు? 

విధితో కలయిక ఆసన్నమైందని 1947 ఆగస్టు 15వ తేదీకి కొన్ని నెలల ముందు నుంచే కనిపిస్తోంది. కానీ ఆ రోజు ఆగమనం కోసం నిరీక్షణ , చుట్టూ అలముకున్న సంతోషంలో ఏదో లోటు ఉంది.

శతాబ్దాల తర్వాత బ్రిటిష్ పాలన, బానిసత్వం భారతదేశానికి అంతం కానున్నాయి. అయినా, స్వాతంత్ర్య సంబరం ఊహించినంతగా ఆవరించిలేదు. దానికి కారణం విభజన విషాదం. విద్వేషాగ్ని కూడా దానిని బూడిదగా దహించివేయలేకపోయింది. ఈ విషాదాన్ని సజీవంగా ఉంచిన అగ్ని అది.

అధికార బదలాయింపు కొందరికి కాస్త ఊరటనిచ్చింది. కానీ అటువంటి వారిలో గాంధీ లేరు. ఎన్నో సత్యాన్వేషణలతో ప్రయోగాలు చేసి, 78 ఏళ్ల వయసులో ఉన్న గాంధీ ఆలోచన మునుపటికన్నా ఎక్కువగా బలపడింది. కానీ ఆయన శరీరం శక్తికోల్పోయింది. ఆయన సంకల్ప బలానికి సరితూగటంలో శరీరం విఫలమవుతోంది. తనకు ఎదురవుతున్న భీకర సవాళ్లను దృష్టిలో పెట్టుకున్న గాంధీ దీనిని అంగీకరించలేకపోయారు.

1947 ఆగస్టుకు కొన్ని నెలల ముందు నుంచీ 1948 జనవరి వరకూ ఆయన తరచుగా పర్యటనలు చేసింది అందుకే. ఎక్కడ అల్లర్లు జరిగితే అక్కడి ప్రజల బాధలు, విషాదాలను పంచుకోవటానికి గాంధీ వెళ్లేవారు. విద్వేషాగ్ని కీలలను ప్రార్థనలు, సందేశాల ద్వారా చల్లార్చేందుకు ప్రయత్నించేవారు. భవిష్యత్తులో సాన్నిహిత్యం కొనసాగించటానికి మార్గాలను సూచించేందుకు ప్రయత్నించారు.

ఆర్ యస్ యస్ మతమౌఢ్యం, ఆర్ యస్ యస్ ఉన్మాదం నుంచి మానవతా మార్గం చూపటానికి తన మనసు లోతుల్లోనుంచి కృషిచేశారు.

ఆయన రావాలని ఆకాంక్షించిన ప్రదేశాలన్నిటికీ, ఆయనను చూడాలనుకున్న క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరినీ గాంధీ చేరుకోలేకపోయారు. ఒక చోట ఉంటూ ఇతర ప్రాంతాలకు శాంతి సందేశాన్ని, దూతను పంపేవారు. పరిస్థితులు మరింత ఎక్కువగా సంక్లిష్టంగా మారుతున్నాయి.

అవిభాజ్య భారతదేశం విస్తృతి కూడా చాలా విస్తారమైనది. కరాచీ ప్రభావం బిహార్‌లో కనిపించింది. నౌఖోలీ ప్రభావం కలకత్తా మీద కనిపించింది. విధ్వంసం చాలా ప్రాంతాల్లో కనిపించింది. విద్వేషాగ్ని ప్రతి చోటా ప్రజ్వరిల్లుతూ ఉండింది. ప్రతి ఒక్కరికీ గాంధీ మీద ఫిర్యాదు ఉండింది. విద్వేషాగ్నిని విస్తరించే వారు, దాని నుంచి ప్రయోజనం పొందేవారు ప్రతి ఒక్కరికీ గాంధీ మీద ఫిర్యాదు ఉండింది. ఎందుకంటే వారి ఆకాంక్షలు ఇతరుల ఆకాంక్షలకన్నా భిన్నమైనవి.

హిందువులు లేదా ముస్లింలు లేదా సిక్కులు ఎవరి ఊచకోత జరిగినా.. గాంధీకి అది తన సొంత శరీర భాగాలను దహనం చేయటం లాంటిది. దీనిని ఆయన తన వైఫల్యంగా పరిగణించారు. అది ఆయన కలలకు వ్యతిరేకమైనది. ఆయను కుంగదీసింది. ’వామనుడి’ లాగా అవిభాజ్య భారతదేశాన్ని గాంధీ రెండు మూడు అంగల్లో కొలవాలనుకున్నారు కానీ కొలవలేకపోయారు. అది ఆయన విధి. విషాదభరిత విధి.

ఆగస్టు పదిహేనో తేదీ అర్థరాత్రి భారతదేశపు విధిని రూపొందించటంలో దిల్లీ తలమునకలైవుంది. అప్పటికి మూడు దశాబ్దాలుగా స్వతంత్ర సంగ్రామం విధానాన్ని, సంకల్పాన్ని, నాయకత్వాన్ని నిర్ణయించే మహాత్మా గాంధీ తన వారసులైన భావి దేశపు నిర్మాతలను ఆశీర్వదించటానికి అప్పుడక్కడ లేరు.

1947 ఆగస్టు 26న ముస్లింల పండుగ ఈద్-ఉల్-ఫితర్ నాడు కలకత్తా మైదానంలో ప్రార్థనా సమావేశంలో గాంధీ ప్రసంగం వినటానికి లక్ష మంది హిందువులు, ముస్లింలు హాజరయ్యారు

ఆయన దిల్లీ సరిహద్దులకు మైళ్ల దూరంలో కలకత్తా లోని ‘హైదరీ మహల్’లో ఉన్నారు. మైనారిటీ హిందువులు దారుణ ఊచకోతకు గురైన నౌఖోలీలో పర్యటించటానికి ఆయన వెళ్లారు. ఆయన కలకత్తాలో రెండు మూడు రోజులు ఉండాల్సి వచ్చింది. ఇక్కడ మైనారిటీ ముస్లింలు ఫిర్యాదు చేస్తున్నారు. నౌఖోలీలో విద్వేష జ్వాలలను నివారించటానికి కలకత్తాలో అగ్నిని చల్లార్చాల్సిన అవసరం ఉందని గాంధీ భావించారు.

కలకత్తాలో ముస్లింలకు భద్రతలేకుండా వదిలేస్తే, నౌఖోలీలోని హిందువులను ఎలా రక్షించగలనని ఆయన భావించారు. ఇక్కడ మైనారిటీలను పరిరక్షించాల్సిన బాధ్యత తనదని గాంధీ భావించారు. అది నౌఖోలీలోని మైనారిటీల హక్కులను పరిరక్షించటానికి ఆయనకు నైతిక మద్దతును కూడగట్టింది. కలకత్తాలో ఘోరకలి అనదగ్గ ప్రాంతంలో ఉండాలని గాంధీ కోరుకున్నారు.

ఒక ముస్లిం వితంతువుకు చెందిన ‘హైదరీ మహల్’ అందుకు తగిన స్థలం. అది హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతం. సమీపంలో మియా బాగాన్ అనే బలహీన వర్గానికి చెందిన ముస్లింల ఆవాస ప్రాంతముంది. అది కాలువకు అవతల ఉంటుంది. మియా బాగాన్‌లో ఎంతగా విధ్వంసం సృష్టించారంటే.. తమ దైన్యం గురించి చెప్పటానికి ఏ ఒక్కరూ అక్కడ లేకుండాపోయారు.

ఈ ‘హైదరీ మహల్’లో బస చేయటానికి గాంధీ ఒక షరతుతో ఒప్పుకున్నారు. సుహ్రావర్దీ కూడా అక్కడ ఉండాలన్నది ఆయన షరతు. అప్పటికి ఏడాది కిందట తన ‘ప్రత్యక్ష చర్య’తో వందలాది మంది హిందువులను చంపి, వేలాది మందిని నిరాశ్రయులను చేసిన సుహ్రావర్దీ . హిందువుల పట్ల ద్వేషానికి అపకీర్తి పొందిన సుహ్రావర్దీ తన నేరాన్ని అంగీకరించి, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయటానికి అక్కడికి రావటానికి అంగీకరించారు.

గాంధీ మరో షరతు పెట్టారు: కలకత్తాలోని ముస్లిం లీగ్ నేతల్లో అతివాదులు నౌఖోలీలోని తమ ‘జనాని’కి వైర్ సందేశం పంపి, అక్కడి హిందువులను రక్షించేలా చేయటం, అక్కడ శాంతి వాతావరణం నెలకొల్పేలా చేసేందుకు తమ కార్యకర్తలను పంపించటం.

గాంధీ షరతులకు అంగీకరించారు. కలకత్తా జనం తమ అభిప్రాయాలను వ్యక్తం చేయటం కొనసాగించారు. కానీ ఆర్ యస్ యస్ హిందూ మహాసభకు చెందిన యువతలో భ్రమలు అలాగే ఉండిపోయాయి. వారు గాంధీని కేవలం ముస్లింల సమర్థకుడిగా మాత్రమే భావించారు. హిందువులు కష్టాల్లో ఉన్నపుడు ఎందుకు రాలేదని, హిందువులు పారిపోతున్న ప్రాంతాలకు ఎందుకు వెళ్లలేదని వారు ఆయనను ప్రశ్నించేవారు. గాంధీని ‘హిందువుల శత్రువు’ అని వారు అభివర్ణించారు.

పుట్టుకలో, ఆచారంలో, జీవనశైలిలో, నమ్మికలో, విశ్వాసంలో పూర్తిగా హిందువు అయిన ఒక వ్యక్తి మీద చేసిన ఆరోపణ ఇది. !  దీనికి స్పందిస్తూ గాంధీ కూడా అదే చెప్పారు. గాంధీని హిందువుల శత్రువుగా ఆరోపించటం తీవ్రంగా బాధించేది.

ఆగస్టు పదిహేనును గాంధీ ఒక ’గొప్ప ఘటన’గా పరిగణించేవారు.  ఉపవాసం, ప్రార్థనలు, పశ్చాత్తాపంతో ఆహ్వానించాలని ఆయన తన అనుచరులకు చెప్పారు. ఆయన స్వయంగా ఆ మహా పర్వ దినానికి అదే రీతిలో స్వాగతం పలికారు.

కలకత్తాలో గాంధీ విజయవంతమయ్యారు. శాంతియుత వాతావరణం అక్కడ విస్తరించటం మొదలైంది. మహాత్ముడి ఆదర్శాల ప్రభావం సైనిక శక్తి కన్నా బలమైనది. అందుకే.. చివరి వైశ్రాయ్, మొదటి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ వైర్ సందేశంలో ఆయనకు ఇలా అభినందనలు తెలిపారు: ‘‘పంజాబ్‌లో మనకు యాభై ఐదు వేల మంది సైనికులున్నారు. కానీ అల్లర్లు అదుపుకాలేదు. బెంగాల్‌లో మన సైన్యానికి చెందని ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. అక్కడ సంపూర్ణ శాంతి నెలకొంది.’’

నౌఖోలీకి వెళ్లటానికి ముందు కలకత్తాలో కొన్ని రోజులు ఉండాలని గాంధీ భావించారు. కానీ ఆయన నెల రోజుల పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది. తుపాకీమందు గుట్ట మీద ఉండి ఒక్క అగ్గిరవ్వ తగిలితే విస్ఫోటనానికి సిద్ధంగా ఉన్న ఆ నగరం గాంధీని వెళ్లనివ్వలేదు. ఆ తుపాకీమందు మండే స్వభావాన్ని గాంధీ ధ్వంసం చేశారు. అగ్గిరవ్వ కూడా ఆరిపోయింది.

నాటికి కేవలం ఏడాది కిందట హిందువులను తీవ్రంగా వ్యతిరేకించిన సుహ్రావర్దీ ఇప్పుడు ఒక కొత్త ఆదర్శం. ఆయన ప్రతిజ్ఞను చూసి జనం ఆశ్చర్యపోయారు. అల్లర్లకు పాల్పడుతున్న హిందూ యువత కూడా పాశ్చాత్తాప పడింది.

దిల్లీ గాంధీని పిలుస్తోంది. వేడుక వాతావరణం నిరర్థకమైంది. ఇప్పుడు దిల్లీకి గాంధీ అవసరముంది. దిల్లీ మరోసారి కలకత్తా జనంతో నిండిపోయింది. దిల్లీ మహాత్ముడి కోసం నైరాశ్యంతో నిరీక్షిస్తోంది.

గాంధీ సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం దిల్లీ చేరుకున్నారు. బేలూరు నుంచి రైలులో వచ్చారు. చిరపరిచితమైన ఈ సెప్టెంబర్ ఉదయం ఆనందదాయకమైన ఉదయం కాదని గాంధీ తెలుసుకున్నారు. అన్నిచోట్లా స్మశాన నిశబద్దం ఆవరించివుంది. అన్ని మర్యాదలకూ బీటలు పడ్డాయి.

రైల్వే స్టేషన్‌లో గాంధీని ఆహ్వానించటానికి సర్దార్ పటేల్ వచ్చారు. కానీ ఆయన ముఖంలో నవ్వు మాయమైంది. పోరాటంలో కష్ట కాలంలోనూ సంతోషంగా కనిపించే అదే సర్దార్‌ ముఖంలో ఇప్పుడు నిస్పృహ కనిపించింది. వస్తారని అనుకున్న ఇతర ఆర్ యస్ యస్ పెద్దమనుషులు రైల్వే స్టేషన్ వద్ద కనిపించలేదు. గాంధీ ఆందోళనకు ఇది చాలు.

సర్దార్ కారులో కూర్చుంటూ మౌనం వీడారు ఐదు రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయి. దిల్లీ ఇప్పుడు శవాల నగరంగా మారింది.

గాంధీని ఆయనకు ప్రియమైన వాల్మీకి టౌన్‌షిప్‌కు తీసుకెళ్లలేదు. బిర్లా భవన్‌లో ఆయనకు బస ఏర్పాటు చేశారు. కారు అక్కడికి చేరుకోగానే ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కూడా వచ్చారు. అది కాకతాళీయం కాదు. ఆయన ముఖ రూపం మారిపోయింది. ఒక్క నెల రోజుల సమయంలోనే ఆయన ముఖంలో ముడతలు అనూహ్యంగా పెరిగిపోయాయి.

ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ‘బాపు’ అంటూ గుక్కతిప్పుకోకుండా అంతా చెప్పారు. లూటీ, ఊచకోత, కర్ఫ్యూ.. అన్ని వివరాలూ తెలియజేశారు. ఆహారపదార్థాలు అందుబాటులో లేవు, సాధారణ పౌరుడి దీనస్థితి, పాకిస్తాన్‌ను తన పౌరులను రక్షించుకోవాలని తను ఆ దేశానికి ఎలా చెప్పగలరు?

హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరికీ సేవ చేస్తుండే డాక్టర్ జోషి అనే ప్రఖ్యాత సర్జన్ గురించి ప్రస్తావించారు. ఆయనను ఒక ముస్లిం ఇంటి నుంచి తుపాకీతో కాల్చారు. గాంధీ ప్రతి రోజూ తన మనోభావాలను ప్రార్థనా సమావేశంలో చెప్పేవారు. అది రేడియోలో ప్రసారమయ్యేది. బహుశా ఈ ప్రయత్నాలు సరిపోలేదు.

పాకిస్తాన్ నుంచి వస్తున్న హిందువులు, సిక్కుల సంఖ్య తగ్గలేదు. ఈ జనం రక్తానికి బదులుగా రక్తం కావాలంటున్నారు. గాంధీ మాటలు వారికి రుచించలేదు. ఈ మనిషి పాకిస్తాన్ మీద నైతిక ఒత్తిడి తెస్తున్నారన్నది కూడా వారు చూడలేకపోయారు. తన పౌరులకు భద్రత కల్పిస్తానన్న జిన్నా హామీని ఆయనకు గుర్తుచేశారు.

భారతదేశానికి కూడా దాని హామీని గాంధీ గుర్తుచేస్తున్నారు. ఆ హామీని నెరవేర్చటంలో నైతిక బలం పెరగటాన్ని గాంధీ చూసేవారు. ఆయన ప్రతి రోజూ ప్రణాళిక రచించేవారు. వాటిని అమలు చేసేవారు. జనవరి వణికించే చలి వచ్చింది. భారత్ కానీ, పాకిస్తాన్ కానీ తమ విశ్వాసాలను ఉల్లంఘించాయని గాంధీ భావించలేదు.

యాభై ఐదు కోట్ల రూపాయలను విశ్వాస అనుసంధానంగా ఆయన పరిగణించారు. విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడేందుకు ఎవరికైనా ఎదురు వెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. చివరికి తనను తానే వ్యతిరేకించటానికి కూడా. గాంధీ అదే స్ఫూర్తి నుంచి నైతిక బలం పొందేవారు.

సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ వెళ్లాలనేది ఆయన ప్రణాళిక. జిన్నాను, ఆయన ప్రభుత్వాన్ని అంతకుమించి పరిగణించలేదు. శాంతి నెలకొల్పుకోవటమనే ఆలోచన ఆర్ యస్ యస్ హిందూ మహాసభకు నచ్చలేదు. గాంధీ నిరాహారదీక్షలో స్వీయ-సత్యసంధతను వీరు చూడలేదు.

ప్రపంచం గాంధీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నట్లు అనిపించినప్పుడు..   ఆర్ యస్ యస్ వారు ‘గాంధీ ముర్దాబాద్’ అని నినాదాలు చేసేవారు. ఆధ్యాత్మిక స్వచ్ఛతతో పవిత్రంగా విలసిల్లినటువంటి ప్రపంచంలోని అత్యుత్తమ ఆలోచనను.. నాథూరాం గాడ్సేకు చెందిన సైద్ధాంతిక శాఖ ఆర్ యస్ యస్ ,  బిజెపి ఎన్నడూ అర్థం చేసుకోజాలవు.

బాపు మమ్మల్ని క్షమించు..! 

మహాత్మా గాంధీ హత్య అమానుష పాపానికి పాల్పడింది ఆర్ఎస్ఎస్, ఆనాడు ఉపప్రధానిగా, హోంమంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ ,గాంధీ హత్యకు నిరసనగా RSSను ,నిషేధించాలని1949లో తన ప్రసంగంలో మత ప్రాతిపదికన రాజకీయాలు , హిందూ రాజ్ అనేది ఒక వెర్రి భావన అని ఈసడించారు.

ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ప్రభుత్వ రాజ్యవ్యవస్థ మనుగడకు ప్రమాదకరం అన్నారు .ఈ వాతావరణం అంతిమంగా గాంధీజీని బలిగొన్నది ,గాంధీ హత్య గురించి తెలియగానే ఆర్ఎస్ఎస్ ,ఆనందోత్సాహాలతో మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు.దేశానికి తీరని నష్టం గాంధీజీ హత్య! ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించినా! నిషేధాన్ని ఎత్తివేయడానికి కారణం

ఆర్ఎస్ఎస్ నుంచి లిఖితపూర్వక వాగ్దానం. ఆర్ఎస్ఎస్ రాజకీయాలతో ప్రమేయం పెట్టుకోకూడదు అది కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అని పటేల్ పట్టుబడితే దాన్ని ఆర్ఎస్ఎస్ లిఖితపూర్వకంగా అంగీకరించినందున 

1949 జూలై 11న ఆర్ యస్ యస్ పై నిషేదాన్ని తొలగించారు!

మనసు కలసివేసే సంఘటన ! గుండెలు పగిలిపోయే వేదన ! 

మనలో చాలా మందికి గాంధీపై లేదా కాంగ్రేస్ పార్టీ పై అయిష్టత ఉండి వుండవచ్చు ! 

భారతదేశ స్వాతంత్రం తరువాత అధికారంలోకి వచ్చిన * “రాజకీయ పార్టీ కాంగ్రెస్ “ కు గాంధీకి సంబంధం  లేదు ! 

స్వాతంత్రం సిద్దించటానికి కాంగ్రెస్ అనే గొడుగు క్రిందకు యావత్ దేశం వచ్చి పోరాడింది ! ఒక్క ఆర్ యస్ యస్ !  Congress is an alternative name for a large national or international conference . కాంగ్రెస్ పదానికి అర్థం జాతీయ లేదా అంతర్జాతీయ సమావేశానికి ప్రత్యామ్నాయ పదం ! కనీసం ఆ పదానికి అర్థం తెలియకుండా మనలో చాలా మంది ఒకనాటి కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు ! ఆనాటి కాంగ్రెస్ అంటే మన మందరం అంటే దేశం మొత్తం !జాతి మొత్తం ! ఒక్క ఆర్ యస్ యస్ తప్ప ! 

డా. BR అంబేత్కర్ కూడా కాంగ్రెస్ లో భాగమే . ఆతరువాత ఏర్పడ్డ తొలి స్వాతంత్ర భారత ప్రభుత్యంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి హిందు కోడ్ బిల్లుకు ప్రాణం పోసాడు డా.అంబేత్కర్ . ఏంటి ఈ హిందూ కోడ్ బిల్ ? the Hindu Marriage Act, Hindu Succession Act, Hindu Minority and Guardianship Act, and Hindu Adoptions and Maintenance Act. హిందూ కుంటుంబాల క్షేమం కోసం హిందు వివాహా చట్టం విడాకులు /భరణం / పునర్వివాహం , పిల్లలు , సంరక్షణ, ఆస్తులు , హక్కులు , దత్తత మొదలగు అంశాలు . ఆనాడు ఈ ఆర్ యస్ యస్ మూక ఏం చేసిందో తెలుసా! ఇండియా గేట్ వద్ద ఆనాటి  హిందూ కోడ్ బిల్  చట్టం ప్రతులను తగలబెట్టి అంబేత్కర్ ను నాటి కాంగ్రేస్ ప్రభుత్వాన్ని బండ బూతులు తిట్టారు . ఆర్ యస్ యస్  అంటే మనువాద అధర్మ భావజాలం పునాదులపై నిర్మించిన రాకాశి కోరల విష వలయం . భర్త చనిపోతే అదే చితి మంటలో బలవంతంగా తోసేసిన భావజాలం ! ఆమంటలు తట్టుకోలేక చితినుండి బయటపడే ప్రయత్నం చేస్తే ! చుట్టూ పెద్ద పెద్ద కర్రలతో ఆమెను బయటకు రాకుండా విచక్షాణా రహితంగా గొడ్డును బాదినట్టు బాదేవారు ఈ దారుణాన్ని బ్రిటీష్ పాలకుడు సర్ చార్లెస్ నేపియర్ తీవ్రంగా వ్యతిరేకించి చట్టం తెచ్చాడు . against the practice of sati ; Sir Charles Napier ordered to hang to death any Hindu priest who presided over a widow burning. ఈ వికృత తంతులో పాల్గొన్న పూజారిని చచ్చెవరకు ఉరితీయండి అనేది ఉత్తర్వులు . ఇదే అంశం మీద అభ్యుదయ బ్రాంహ్మణ కులానికి చెందిన మహానీయుడు రాజా రామ్ మోహన్ రాయ్ చితి మంటల్లో ఆడబిడ్డలు కాలిపోకుండా దేశవ్యాప్త ఉద్యమం నడిపారు. ఇక ఆ తరువాతి కాలంలో కాల్చడం ప్రక్కన పెట్టి భర్త చనిపోతే గుండు కొట్టించి తెల్లచీర కట్టించి బ్రతికినంత కాలం ఇతరుల కంట పడకుండా దాక్కుని బ్రతకాలి ! దాన్ని బద్దలు కొట్టాడు అంబేత్కర్ . ఈ రోజు హిందూ స్త్రీలు / పిల్లలు / పురుషులు హక్కులు అనుభవిస్తున్నారంటే కారణం నాటి కాంగ్రేస్ ప్రభుత్యం తొలిన్యాయ శాఖ మంత్రి అంబేద్కర్ కావడం విశేషం.  మనువాద ఆర్ యస్ యస్  భావజాల  కుల వ్యవస్థ ! వేల సంవత్సరాల అసమానతలు , అకృత్యాలు , కులాల పుట్టుకకు కారకులు ఈ  మనువాద ఆర్ యస్ యస్  భావజాలం కారణంగా ఈ దేశం  నిత్యం తగలబడుతునే ఉంది ! ఇది ఆరని ఖర్చిచ్చు ! ఆర్ యస్ యస్  బ్రిటీష్ బూట్లు ఎలా నాకింది ! ?ఎందుకు నాకింది ! ?స్వతంత్ర పోరాటాన్ని అణచటానికి పొట్టి కాకి నిక్కర్లు వేసుకుని బ్రిటీష్ మోరల్ పోలీస్ గా ఉద్యమకారులపై విరుచుకు పడటం ! బ్రిటీష్ స్వాతంత్రం ఇచ్చె సమయంలో 565 Princely states రాజ సంస్థానాలు  బ్రిటిష్ తొత్తులుగా ఉండేవారు ! వీరి సంస్థానాలను ఇండియలో కలపొద్దు అని ఆర్ యస్ యస్  ఎందుకు కుతంత్రం చేసింది ఇంకోసారి వివరంగా చెప్పుకుందాం .  అన్నిటికంటే కృరమైన భావజాలం విభజన !  ఈ దేశం రెండు ముక్కలు అవ్వటానికి కారకులు ఎవరో తెలుసా ! ఇంకెవరు ! వేర్పాటు వాద ఛాందస మూఢ భావాజం వారసులు . ఆర్ యస్ యస్ చాంధస మనువాద భావజాలం అదే చాంధస మత  మౌడ్యం మహ్మద్ జిన్నాను విభజనకు ఆనాడు దేశాన్ని మంటల్లోకి తోసింది ! ముందుండి నడిపించింది .

ఈ అతివాద భావజాలమే లక్షలాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. . నేటి ఆధునిక హిందుస్తాన్ చరిత్ర చూస్తూనే ఉన్నాం ! నేటి కాంగ్రెస్ పార్టీని విమర్శించటం / పొగడటం మీ ప్రాధమిక హక్కు ! మీకు ప్రాధమిక హక్కులు కల్పించే పరిస్థితి నాటి గాంధీ సారధ్యం వహించిన కాంగ్రేస్ తోనే సాధ్యం అయ్యింది అని గుర్తుంచుకోండి ! తొలి తరం కాంగ్రెస్ పెద్దలు తమ సర్వస్వం దేశానికి ధారపోసారు ! ప్రాణాలు సైతం అర్పించారు ! ఇప్పుడు ఆమహానీయుల వారసులు ఎక్కడున్నారు ? ఏంచేస్తున్నారు మనకు పట్టదు . చివరగా ఒక మాట  గాంధీని గాంధీతత్వాన్ని విమర్శించడం అంటే మనం అరువు తెచ్చుకున్న అజ్ఞానం కారణం అని అర్ధం.  ఆర్ యస్ యస్ / బిజెపి అంతలా ఎందుకు గాంధీని విమర్శిస్తుంది అంటే గాంధీ తత్వం ఆర్ యస్ యస్ భావజాలనికి పూర్తి వ్యతిరేకమైనది అనేగా అర్థం! సత్యం కూడా అదే గాంధీ ఔనత్యం మనకంటే బయటవారే ఎక్కువ అర్ధం చేసుకున్నారు .  " మహాత్మా మిమల్ని చంపుకోవడం! మీ రక్తంతో ఈ నేల తడవడం కంటే మహా పాపం ఉంటుందా ..! మహాత్మా మమ్ములను క్షమించు అది హత్య మాత్రమే కాదు... ఆధునిక భారత నిర్మాణం పై ఆరెస్సెస్‌ తొలి వేటు మహాత్మా గాంధీ జీవితంతో పాటు మరణం కూడా ఎప్పటికప్పుడు చరిత్ర కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ప్రత్యేకించి ఆరెస్సెస్ బిజెపి సాగించే వ్వ్యక్తిత్వ హననం,విధాన హననం వంటి ముప్పేట ముష్కర వ్యూహాలదే పైచేయి అవుతున్న నేటి తరుణంలో  జాతి పితగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీని నేటి పాలకులు చీపురు పుల్లకు సరిపెట్టారు.

హంతకులే రొమ్ము విరుచుకుని తిరగటం అన్నది మధ్యయుగాల  సంస్కృతిలో తప్ప ఆధునిక సంస్కృతిలో కనిపించని లక్షణం.కానీ ఉన్నావో మొదలు హథ్రస్‌ , మణిపూర్ వరకూ నిందితులంతా పాలకపక్షం పంచన చేరి సన్మానాలందు కుంటున్నారు.ఈ ఒరవడి గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించటంతోనే మొదలైంది. హంతకులు ఛాతీ విరుచుకుని నడవటమే వీరత్వమన్న బిజెపి  సంఘ పరివారం సైద్ధాంతిక నేపథ్యమే దీనికి పునాది. ఈ పునాదులు దశాబ్దాలుగా అంత కంతకూ బలోపేతం అవుతూ వస్తున్నాయి. అందుకే పార్లమెంట్‌లో గాంధీ విగ్రహానికి ఎదురుగా గాంధీ హత్యకు ప్రేరేపించిన సనాతన వైదిక బ్రాహ్మణ మతదేశం స్థాపించాలనే  భావజాలానికి ఆది గురువైన సావర్కార్‌ విగ్రహం నిలబెట్టి గాంధీ విలువలనే కాదు. ఆధునిక భారతదేశం గురించి గాంధీ కన్న కలలను ప్రశ్నిస్తోంది. జీవిత కాలంలో గాంధీ పాటించిన విలువలు, సాగించిన ఉద్యమాలు, సాధించిన విజయాలు, కన్న కలలు, నిర్మించతల పెట్టిన జాతి నిర్మాణం గురించి అధ్యయనం చేయటం ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో ఆయన మరణంపై అంశాలను ఎలా ప్రభావితం చేశాయో అధ్యయనం చేయటం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశం. దేశ స్వాతంత్య్రానికీ స్వావలంబనకూ చేటుతెచ్చే విధానాలను,విదేశీ,స్వదేశీ కార్పొరేట్లకు దేశసంపద ను దోచిపెట్టే విధానాలను అమలు చేస్తున్నారు.వీటిని ప్రజలందరూ ప్రతిఘటించేందుకు ఐక్యం కాకుండా ఉండేందుకు మతతత్వ,మనువాద సనాతన ధర్మం పేరుతో   రాజకీయాలు ముందుకొచ్చాయి.వాటిని సమర్ధించుకోవడానికే నిజమైన జాతీయోద్యమానికి, దాని నాయకులకు మసిపూసి,చరిత్రనువక్రీకరించి,గాడ్సేలను హీరోలుగా చిత్రీకరిస్తున్నారు.తమ దేశద్రోహాన్ని బూటకపు హిందూత్వ జాతీయవాదంతో కప్పిపుచ్చు కుంటున్నారు. 

వైసీపీ బాటలోనే బీఆర్ఎస్?.. అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం

  పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క ఓటమితో కుదేలైపోయిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కోలేక పలాయన మంత్రం పఠిస్తోందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం అందులో భాగమేనని అంటున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే అసెంబ్లీని బహిష్కరించి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  దీంతో రాజకీయ వర్గాలలో బీఆర్ఎస్  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అడుగుజాడలలో నడుస్తోందని అంటున్నారు. ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంంది.   సోమవారం (జనవరి 5)న సభకు హాజరై.. మంగళవారం (జనవరి 6) నుంచి అంటే సభలో కృష్ణ, గోదావరి జలాలపై చర్చ జరిగే సమయానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకులు మాత్రం సభలో కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కోనేందుకు సభాపక్ష ఉప నేతల నియామకం తరువాత బీఆర్ఎస్ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హారీశ్‌రావుకి క్రెడిట్ దక్కే చాన్స్ ఇవ్వవద్దన్య వ్యూహంతోనే బీఆర్ఎస్ ఈ బాయ్ కాట్ నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా అసెంబ్లీలో నదీ జలాలపై చర్చను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడమంటే.. పలాయన మంత్రం పఠించడమేనని పరిశీలకులు భావిస్తున్నారు.   అయితే నిన్న మొన్నటి వరకూ నదీ జలాల అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ ఇంత హఠాత్తుగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైతే.. జల వివాదాలకు ఆయనే సమాధానం చెబుతారు. అయితే కేసీఆర్ గైర్హాజరౌతున్న నేపథ్యంలో ఇటీవల శాసనసభాపక్ష ఉప నేతగా నియమితులైన హరీష్ రావు సభలో బీఆర్ఎస్ తరఫున ప్రసంగించాల్సి ఉంది. అదే జరిగితే సభ సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా మారిపోతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ డమ్మీ అయిపోతారు. ఇప్పటికే శాసనసభాపక్ష ఉప నేతగా హరీష్ రావు నియామకం కేటీఆర్ ను ఒకింత తక్కువ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇక జలవివాదాలపై హరీష్ రావు గట్టిగా గళం విప్పితే కేటీఆర్ పరిస్థితి పార్టీలో మరింత దిగజారుతుందన్న భావనతోనే బీఆర్ఎస్ ఆకస్మికంగా అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి సీఎం రేవంత్, హరీష్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనీ, వారిరువురి మధ్యా అరగంట భేటీ జరిగిందనీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంక్షోభం ముదిరేలా చేసుకోవడం కంటే.. జనం పలాయనం అనుకున్నా అసెంబ్లీ బాయ్ కాటే మేలని బీఆర్ఎస్ నిర్ణయించుకునట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశేషమేంటంటే  పార్టీ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయాన్నిస్వయంగా హరీష్ రావే ప్రకటించడం విశేషం.

కేసీఆర్ తోనూ ఢీ అంటే ఢీ.. కవిత మాటల అర్ధం అదేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని ఖతమేనా? ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కవిత ఇదే విషయాన్ని ఒకింత నర్మగర్బంగా చెప్పారా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆరంభం సందర్భంగా సభకు వచ్చి ఓ ఐదారు నిముషాలు సభలో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్..  ఆ తరువాత  సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. అయితే.. ఆ రోజు సభలో ఏ విషయంపైనా చర్చ జరిగే అవకాశం లేనందున ఆయన సభనుంచి వెళ్లిపోయారనీ, కొత్త సంవత్సరం రెండో తేదీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ సర్కార్ ను అడుగడుగునా ఇరుకున పెట్టి తన విశ్వ రూపాన్ని చూపిస్తారనీ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు గట్టిగా చెప్పారు. అదే నమ్మారు. అయితే కేసీఆర్ మాత్రం సభలో పార్టీ గొంతు గళంగా వినిపించేందుకు ఉప నాయకులను నియమించడంతో.. ఆయన ఈ శీతాకాల సమావేశాలలో ఇక సభలో కనిపించరని పరిశీలకులు ఆ రోజే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవిష్యత్ పై తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సభకు కేసీఆర్ డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఇక ఖతమే అని అన్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 2) శాసనమండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో  చిట్ చాట్ చేసిన ఆమె.. తన తండ్రి కేసీఆర్ కే  సవాల్ విసిరారు. ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుంటే కేసీఆర్ సభకు రావాలని సవాల్ విసిరారు.   అధినాయకుడు అసెంబ్లీకి రాకుండా..  పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు.   హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య బాండ్ ఉందని ఆరోపించిన ఆమె హరీష్ సీఎం చాంబర్ లో అరగంట సేపు ముచ్చటించడం నిజం కాదా అని ప్రశ్నించారు.   అసెంబ్లీలో  మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆమె..  రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ చాలా ప్రమాదకరమన్నారు.  కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై నేరుగా అటాక్ చేయడం ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ తో తాను మాట్లాడి నాలుగు నెలలు పైనే అయ్యిందన్నారు.  కేటీఆర్, హరీష్ లకు పార్టీని వదిలేయడంపై ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ ను తప్పుపట్టారు.  ఇలా మాట్లాడడం ద్వారా ఆమె తాను కేసీఆర్ తో డీ అంటే ఢీ అనడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత తన శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శుక్రవారం (జనవరి 2) కూడా ఆమె శాసనమండలి స్పీకర్ ను తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. 

సొంత ఇంటి పంచాయతీ పరిష్కరించలేక చేతులెత్తేశారు.. కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున ఆయనపై బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంలా ఉందన్నట్లుగా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇతరుల పంచాయతీలను పరిష్కరించడంలో గొప్ప ఉత్సాహం చూపిస్తారనీ, అయితే సొంత ఇంటి పంచాయతీల పరిష్కాం విషయంలో మాత్రం చేతులెత్తేశారనీ అన్నారు. గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  ఇక కల్వకుంట్ల కవిత సొంత దారి చూసుకున్నారనీ, నేడో, రేపో ఆమె కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమనీ జోస్యం చెప్పారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిలు లేచి నిలబడకపోవడం వారి విచక్షణకు సంబంధించిన విషయమన్న రఘునందనరావు.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావాలన్న యాంబిషన్ ఉందనీ, అయితే అది సాకారం అవ్వాలంటే ఉండాల్సిన మద్దతు కేటీఆర్ కు సొంత పార్టీ నుంచే కరవైందన్నారు.  పార్టీ దాకా ఎందుకు ఆయనకు సొంత కుటుంబంలోనే మద్దతు లేదని చెప్పారు.  ఈ పరిణామాలన్నిటినీ నిశబ్దంగా గమనిస్తున్న హరీష్ రావు సమయం కోసం వేచి చూస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రఘునందనరావు.. కావాలంటే ఈ విషయాన్ని తాను రాతపూర్వకంగా కూడా చెబుతానన్నారు.  ఇక రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలపై స్పందిస్తూ.. ఏ పార్టీలోనైనా అభిప్రాయబేధాలు సహజమని కొట్టి పారేశారు.  దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలననూ చూసిన తెలంగాణం ఇప్పడు బీజేపీకి పట్టం గట్టాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు.  

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై కర్నాటకలోని బళ్లారిలో హత్యాయత్నం జరిగింది. ఆయనపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీవిషయంలో  తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.   ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి  గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో  కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. అలాగే తొలుత కాల్పులు జరిపిన సతీష్ రెడ్డి గాయపడ్డాడు.   స్థానిక ఎమ్మెల్యే భరరత్ రెడ్డి, గాలి జనార్థన్ రెడ్డిల మధ్య దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్న సంగతి విదితమే.  భరత్ రెడ్డి వర్గం వారు గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఘర్షణకు దారి తీసింది.  కాగా ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో  పోలీసులు 144వ సెక్షన్ విధించారు. బళ్లారిలో ప్రధాన నాయకులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.  

కొత్త సంవత్సరంలో కవిత వార్ కొత్త పుంతలేనా?

బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకూ ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒకింత సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తు వచ్చారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.  కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం   2006 లో  సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశాననీ చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నా నన్నారు.  తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు.  అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత..  తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకువచ్చినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె,  మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో  సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైందన్నారు.  మహిళలకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. వారిలో కనీసం ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఎత్తి చూపారు. ఆ నాడే తాను తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.  ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్ లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటి వరకూ చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవపట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించేసినట్లైంది. 

మెగా ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు.. జనసైనికులు ఎటువైపు?

జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు కొద్ది కాలంగా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అటువంటి నాగబాబు.. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. జనసేన ఎమ్మెల్సీగా.. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పని చేసుకుంటూ పోతున్న నాగబాబు.. శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారారు. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు  కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.   వాస్తవానికి మెగా కాంపౌడ్ అంత పటిష్ఠంగా ఉండటానికి నాగబాబే కారణమని అంటుంటారు, ఆయన నాగ‌బాబు లేకుండా మెగా కాంపౌండ్ ఇంత స్ట్రాంగా నిల‌బ‌డే ఛాన్స్ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి అయినా, మెగాపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అయినా.. తాము మాట్లాడితే ఇబ్బంది అనుకునే విషయాలను నాగబాబు నోట పలికిస్తారని వారిని దగ్గరా తెలిసన వారు చెబుతుంటారు.   ఇందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సందర్భంలో కానీ,  ఇండస్ట్రీలో చిరుకు మద్దతుగా గళం విప్పే అంశంలో కానీ నాగబాబు ఎలాంటి శషబిషలూ లేకుండా ముందుకు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక తన స్వంత కుమార్తె నీహారిక విషయంలో ఆమె పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలబడిన ఉదంతాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నాగబాబును జనసేన నుంచి సస్పెండ్ చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ను జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. మహాళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నాగబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అనవసర అంశాన్ని ఇంకా పొడిగించకుండా కామైపోవడం మంచిదని హితవు చెబుతున్నారు.  

గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు రేహాన్ వాధ్రా గాంధీయేనా?

రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు.  కాంగ్రెస్ పార్టీకి ప్ర‌స్తుత‌ం పెద్ద దిక్కు. ద‌శా దిశా దిస్కూచి కూడా రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. అందులో సందేహం లేదు. అయితే.. రాహుల్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూసిన ఆయన సోదరి ప్రియాంక వధేరా గాంధీ కుమారుడు   రేహాన్ వాద్రానే వార‌సుడు. అందుకు కారణం రాహుల్ గాంధీ అవివాహితుడిగా ఉండటమే. ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.   అదే రాహుల్ గాంధీకి వివాహమై ఉంటే.. ఆయ‌న త‌న‌యులే త‌ర్వాతి  త‌రం వార‌సులు అయి ఉండేవారు. కొద్ది కాలం కిందటి వరకూ రాహుల్ గాంధీ వివాహం అన్నదే వారి కుటుంబంలోనే కాక, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ గా ఉండేది. అయితే.. రాహుల్ వివాహం పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చ క్రమంగా ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ మేనల్లుడు రేహాన్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కూడా ఓ ప్రియురాలు ఉండేదని గట్టిగా వినిపించేది. అయితే ఆయన రేహాన్ లా ధైర్యం చేయలేదు. అందుకు ప్రధాన కారణం సెక్యూరిటీ థ్రేట్ అంటారు.  అప్ప‌ట్లో సోనియా గాంధీ ప్ర‌ధాని  కావ‌ల్సిన  వారు.. ఆమె ప్ర‌ధాని కాలేక పోవ‌డానికి, త‌ర్వాత రాహుల్ పెళ్లాడ‌క పోవ‌డానికి కూడా అదే కారణంగా చెబుతారు.  అప్ప‌ట్లో ఎల్. టీ. టీ. ఈ అనే మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీని హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. సోనియా ప్ర‌ధాని కాకుండా హెచ్చ‌రిక‌లు జారీ చేసి అడ్డుకున్నది కూడా ఎట్టీటీయే అని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ నేప‌థ్యంలో రాహుల్ తన త‌ద‌నంత‌ర వార‌సుల‌కు ఈ ప్రాణ‌హాని  సైతం అనువంశికంగా  క‌ల్పించ‌డం ఎందుకు? అన్న కోణంలో ఆలోచించి.. త‌న పెళ్లి ఊసెత్తలేదని అంటారు. అందుకే రేహాన్ పెళ్లి ద్వారా ఆ ఇంట ఇన్నేళ్ల‌కు ఒక శుభ‌కార్యం జ‌రుగుతుండ‌టంతో హ్యాపీ ఫీల‌వుతున్నారు కాంగ్రెస్ కార్య‌ర్త‌లు.

తిరుమలలో రోజా రాజకీయ వ్యాఖ్యలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు?

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం. తిరుమల పవిత్రతను కాపాడడానికీ, అలాగే తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండడానికీ టీటీడీ ఈ నిబంధనను అమలు చేస్తున్నది. కోట్లాది మంది భక్తులు కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే వారిలో సామాన్యుల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన వారు ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారిలో ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా.. తిరుమల కొండపై అందరూ శ్రీవారి భక్తులుగా మాత్రమే మెలగాలన్న ఉద్దేశంతో తిరుమల గిరిపై రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలపై నిషేధం విధించారు.   టీటీడీ ట్రస్ట్ బోర్డు ఈ విషయాన్ని  స్పష్టంగా పేర్కొంది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది.  తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.  అయితే మాజీ మంత్రి   రోజా ఆ నిబంధనలనూ, ఆంక్షలనూ తోసి రాజని తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు.  జగనన్న మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని తాను కోరుకున్నట్లు దర్శనానంతరం మీడియాతో చెప్పారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల కొండపై రోజా తన రాజకీయ ఆకాంక్షను మీడియా ముందు వ్యక్తపరచడం నిబంధనల ఉల్లంఘనేననీ, ఆమెపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.   తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటి సారి కాదంటున్నారు. గతంలో అంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తొలి రోజులలోనే తిరుమల కొండపై ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపాయి.  ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని ఇష్టారీతిగా వ్యవహరించినా అడిగేవారు లేరన్న రీతిలో ఆమె తీరు ఉందని అంటున్నారు. టీటీడీ కేవలం హెచ్చరికలకు పరిమితం కాకుండా.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

కేసీఆర్ ఆస్త్రసన్యాసమేనా?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రసన్యాసం చేసేశారా? ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాల హాజరు ఇక ముగిసిపోయిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో గళమెత్తేందుకు అధికారాలు అప్పగిస్తూ ఆయన చేపట్టిన నియామకాలను చూస్తుంటే ఔననే అనాల్సి వస్తోందంటున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ నియమించారు. అంతే కాదు.. అసెంబ్లీ, మండలిలో   పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు  సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని  దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.  అసెంబ్లీలో హరీష్ రావు తో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.   సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావుతో పాటు, మహిళా, బీసీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సబితా ఇంద్రారెడ్డి, తలాసానిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. వీరు ముగ్గురూ సభలో పార్టీ పక్షాన కీలక అంశాలపై చర్చలలో పాల్గొంటారు. ఇక శాసనమండలిలో ఎల్. రమణ,  పి. సతీష్ రెడ్డిలను ఉప నేతలుగా నియమించారు. పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు. కేటీఆర్ కు ఎటువంటి బాధ్యతలూ అప్పగించకపోవడంపై పార్టీలోనే కాదు, రాజకీయవర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లోపలా, బయటా కూడా అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో కేటీఆర్ వైఫల్యాల కారణంగానే ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అది పక్కన పెడితే.. కేసీఆర్ ఇక ఈ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు లేవనడానికి ఈ నియామకాలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు నియామకం

  అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) మాజీ మంత్రులు హరీష్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ని నియమించారు.  విప్ బాధ్యతలు సభలో సభ్యుల హాజరు, అధికార పార్టీ నేతల ప్రతిస్పందనలను సమీక్షించడం, పార్టీ విధానాలను అమలు చేయడం వంటి కీలక అంశాలను కవర్ చేయనున్నారు. కేసీఆర్ తన అసెంబ్లీ నాయకత్వానికి మద్దతుగా మధుసూదనాచారీని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగించారు. శాసన పభ సమావేశాల్లో పార్టీ తొలి ప్రతినిధిగా మధుసూదనాచారీని కొనసాగించడం ద్వారా పార్టీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల అమల్లో కీలకంగా మారనుంది.