మాధవిలతపై కేసు 

హైదరాబాద్ లోకసభ బిజెపి అభ్యర్థి మాధవిలతపై ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కేసు నమోదైంది. మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజంపురా పోలింగ్ బూత్ లోకి నేరుగా ప్రవేశించి ముస్లిం మహిళ వోటరు బురఖాను తొలగించారు.  ఈ సమాచారం ఎన్నికల కమిషన్ కు చేరింది. ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు మలక్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవిలతపై నాలుగు వేర్వేరు సెక్షన్ ల ప్రకారం కేసు నమోదు చేశారు. ముస్లిం మహిళా వోటరు ఐడీ కార్డును తనిఖీ చేయడం వివాదానికి కారణమైంది. మాధవిలత సోమవారం ఉదయం పోలింగ్ జరుగుతున్న సమయంలో మలక్ పేటలో చేసిన హడావిడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Teluguone gnews banner