Read more!

విమానంలోనే మరణించిన కో పైలెట్

 

లయన్ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి థాయ్ ఎయిర్ పోర్టు నుంచి 152 మంది ప్రయాణికులతో గాల్లోకి ఎగిరింది. ఆ సమయంలో విమానాన్ని కో పైలెట్ నడుపుతున్నాడు. గాల్లోకి ఎగిరిన కాసేపటికి కో పైలెట్ పక్కనే వున్న పైలెట్ యథాలాపంగా కో-పైలెట్ వైపు చూసి అదిరిపోయాడు. కారణం.. కో పైలెట్ సీట్లో కూర్చునే మరణించి వున్నాడు. అప్పటి వరకూ విమానం అతని కంట్రోల్లో వుందని అనుకుంటూ తాపీగా కూర్చున్న పైలెట్ అలర్ట్ అయి విమానాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కో పైలెట్ విమానంలోనే మరణించిన విషయాన్ని తెలుసుకున్న అధికారులు విమానాన్ని వెంటనే వెనక్కి తెప్పించి ఎమర్జెన్సీ లాండింగ్ చేయించారు. విమానం నడుపుతున్న కో పైలెట్ మరణించాడన్న విషయాన్ని ఆ తర్వాత తెలుసుకున్న విమానంలోని 152 మంది ప్రయాణికులు బతుకు జీవుడా అనుకున్నారు.