Read more!

సమగ్ర కుటుంబ సర్వే నోటిఫికేషన్ జారీ...

 

ఆగస్టు 19న తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని, సర్వేలో పాల్గొనే ఉద్యోగులకు ప్రజలు కచ్చితమైన ఆధారాలు చూపాలని పేర్కొన్నారు. సర్వే నిర్వహించిన రెండు వారాలలోగా డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని, హైదరాబాద్ మినహాయించి 9 జిల్లాల్లో 14 వేల డాటా ఎంట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. సర్వేకు సంబంధించిన పూర్తి డాటా ఎంట్రీ సెప్టెంబర్ 4వ తేదీకి పూర్తి చేయాలని, పూర్తి చేసిన సర్వే వివరాలపై సెప్టెంబర్ 10 నుంచి స్కూట్న్రీ జరుగుతోందని పేర్కొన్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 30 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉండగా, వారికి ఒక్కొక్క బుక్‌లెట్‌లో పది ఫారాలు అదనంగా చేర్చి మొత్తం 30 సర్వే ఫారాలను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో సర్వే ఫారాలు ఇంగ్లీష్‌లో, గ్రామీణ ప్రాంతాలలో తెలుగులో వుంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.