హైదరాబాద్ లో మరో రైతు ఆత్మహత్య
posted on Sep 21, 2015 @ 9:32AM
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి, రోజుకు సగటున ఐదారుమంది రైతులు బలన్మరణాలకు పాల్పడుతున్నారు, సాగు కష్టాలు తట్టుకోలేక మొన్నామధ్య హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పై ఓ రైతు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంటే, మరో రైతు సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలోనే ఉరితాడు బిగించుకుని తనువు చాలించాడు.ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించిన ఈ దృశ్యం... బేగంపేటలో కనిపించింది. వ్యవసాయంతో అప్పులుపాలై మెదక్ జిల్లా రాంసాగర్ గ్రామం నుంచి ఉపాధి కోసం భాగ్యనగరానికి వచ్చిన జగ్గోళ్ల మల్లేశాన్ని(58)... వడ్డీ వ్యాపారులు ఫోన్లు చేసి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే తన తండ్రి ఆత్మహత్యకు వ్యవసాయానికి చేసిన అప్పులే కారణమని, ఐదేళ్లుగా పంటలు సరిగా పండటం లేదని, అదే సమయంలో చెల్లెళ్లకు పెళ్లి చేయటంతో అప్పుల భారం మరింత పెరిగిందని, వాటిని ఎలా తీర్చాలో తెలియక మనోవ్యథకు గురవుతున్నాడని, ఈ నేఫథ్యంలోనే బలన్మరణానికి పాల్పడి ఉంటాడని కొడుకు మల్లేశ్ తెలిపాడు