టీడీపీలో విబేధాలు.. ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి
posted on Apr 11, 2016 @ 3:28PM
టీడీపీ పార్టీలో పార్టీ నేతల మధ్య విబేధాలు ఒకదాని తరువాత ఒకటి బయటపడుతున్నాయి. ఇప్పటికే అనంతలో జేసీ ప్రభాకర్ రెడ్జి, ప్రభాకర్ చౌదరి మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇప్పుడు వైసీపీ పార్టీనుండి వెళ్లిన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య విబేధాలు బయటపడ్డాయి. గతంనుంటే రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిల మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ మారారు.. ఒకే పార్టీలో ఉన్నా కూడా వీరిమధ్య సయోధ్య కుదరలేదు. ఈ నేపథ్యంలోనే రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిపై విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యలయంలో మాట్లాడిన ఆయన ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్టీలో చేరేంత వరకూ బానే ఉన్నా.. చేరిన తరువాత ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని.. తమ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు తనను, సీఎం రమేష్ ను ఆహ్వానిచంవద్దని.. ఆదినారాయణరెడ్డి అనుచరులు కార్యకర్తలను బెదిరిస్తున్నారని.. వారు వినకపోవడంతో ఇళ్ళపై దాడి కూడా చేస్తున్నారని ఆరోపించారు. లోపల ఒకటి పెట్టుకొని.. బయటకు ఒకటి నటించే ఆదినారాయణ రెడ్డి తన ద్వంద్వ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.